ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయనున్న విషయం తెలిసిందే. మూడో సారి అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు.
మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వాలో ఐదేళ్ల అమాయక బాలికపై అత్యాచారం జరిగిన జుగుప్సాకరమైన ఘటన చోటుచేసుకుంది. పొరుగున ఉంటున్న 17 ఏళ్ల మైనర్ ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి బాలికకు కడుపునొప్పి రావడంతో విషయం వెలుగులోకి వచ్చిందని బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో బహిరంగ చర్చకు బీజేపీ యువమోర్చా ఉపాధ్యక్షుడు అభినవ్ ప్రకాశ్ పేరును సోమవారం నామినేట్ చేసింది. భారతీయ జనతా యువమోర్చా ప్రెసిడెంట్ తేజస్వి సూర్య రాహుల్ గాంధీకి రాసిన లేఖలో, 'ఇది రాజకీయ కుటుంబానికి చెందిన వారసులు, సాధారణ యువకులకు మధ్య గొప్ప చర్చ అవుతుంది' అని రాశారు.
ఇరాన్లోని చాబహార్ పోర్టును పదేళ్లపాటు నిర్వహించేందుకు టెహ్రాన్తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఓడరేవును నిర్వహించడంతోపాటు భారత్ కూడా దీన్ని అభివృద్ధి చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఒప్పందానికి సంబంధించి అమెరికా వార్నింగ్ ఇచ్చింది.
వారణాసి నుంచి లోక్సభ ఎన్నికలకు ప్రధాని మోడీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రధాని కాశీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ప్రధాని మోదీ వారణాసిలో భారీ రోడ్ షో కూడా నిర్వహించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టై ఇప్పటికే ఆమె తిహార్ జైల్లో ఉంటున్న విషయం విదితమే.
వైద్యులు శస్త్రచికిత్స చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. కొంత మంది వైద్యులు ఆపరేషన్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండి కడుపులో శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించే పలు వస్తువులు మర్చిపోతుంటారు.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడి చేయవద్దని అమెరికా, ఇతర దేశాలు ఒత్తిడి చేస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. రఫాలో పాలస్తీయన్ ప్రజలు ఖాళీ చేయాలని, సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని మరోసారి ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది.
ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్లోని రుయాంగ్ అగ్నిపర్వతంలో పేలుడు సంభవించింది. బూడిద, పొగ 19 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న స్ట్రాటో ఆవరణకు చేరుకుంది. సునామీ భయం పుట్టింది. 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై బీజేపీ నేతలతో పాటు ప్రతిపక్ష నేతలంతా ఆయనను స్మరించుకుని నివాళులు అర్పిస్తున్నారు.