Crime: లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి..దొంగతనం కేసులో అరెస్ట్..
- కర్ణాటకాలో ఓ ట్విస్ట్
- లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ వ్యక్తి ఇప్పుడు దొంగగా మారిన వైనం
- ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ఓ బార్లో డబ్బులు.. మద్యం దొంగిలించి పరారైన ముగ్గురు నిందితులు
- అందులో ఓ వ్యక్తి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసినట్లు తేల్చిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం రాజకీయాలు కాస్లీగా మారాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు భారీగా ఖర్చు పెట్టాల్సిందే. ప్రస్తుతం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకులు రూ. కోట్లు కుమ్మరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకాలో ఓ ట్విస్ట్ నెలకొంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ వ్యక్తి ఇప్పుడు దొంగగా మారిపోయి చోరీ కేసులో అరెస్టు కావడం కలకలం రేపుతోంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు తాలూకా రాయపుర గ్రామ సమీపంలో బార్ లో జరిగిన చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి స్వయంగా ఈ చోరీ చేశాడని పోలీసులు వెల్లడించారు. రెండు నెలల క్రితం చిత్రదుర్గ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ఓ బార్లో డబ్బులు, మద్యం దొంగిలించి పరారయ్యారు. బార్లో చోరీకి పాల్పడుతున్న దృశ్యం సీసీటీవీలో రికార్డు అయ్యింది.
READ MORE: Nirmala Sitharaman: ఆర్థికమంత్రి డీప్ ఫేక్ వీడియో కలకలం.. ఎఫ్ఐఆర్ నమోదు
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే అంతకు ముందే చిక్కమగళూరులో ఓ కేసులో పోలీసులు ఆ నిందితులను అరెస్టు చేశారు. చిక్కమగళూరు జైలులో ఉన్న రఘుకుమార్, హాసన్కు చెందిన దర్శన్, జగదీష్ల బాడీ వారెంట్ మీద చిత్రదుర్గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు చాలా ఏళ్లుగా చిత్రదుర్గ, దావణగెరె, తుమకూరు, చిక్కమగళూరు జిల్లాల్లో దొంగతనాలు, చోరీలు, లూటీలతో పాటు ఇతర నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో చిత్రదుర్గలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘుకుమార్కు 2,337 ఓట్లు వచ్చాయని, ఇప్పుడు అదే రఘుకుమార్ దొంగతనాలు చేస్తున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి రెండు వేలకు పైగా ఓట్లు సంపాధించడం సామాన్యమైన విషయం కాదని, ఇప్పుడు ఇలా చోరీల కేసుల్లో చిక్కుకోవడం మాకే షాక్ గా ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!