Oil Crisis: చమురు సెగ.. రోజుకు రూ.2 వేల కోట్ల నష్టం.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- పెట్రోల్పై లీటరుకు రూ.20 నష్టం
- డీజిల్పై లీటరుకు ఏకంగా రూ.45 నష్టం
- మొత్తం నష్టంలో సింహభాగం డీజిల్ అమ్మకాల ద్వారానే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oil Crisis: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో భారతీయ చమురు కంపెనీలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. చమురు ధరల పెరుగుదల దేశీయ చమురు సంస్థలను కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు సరఫరా గొలుసును దెబ్బతీయడమే కాకుండా, దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేలా చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ (IOC), BPCL, HPCL వంటి కంపెనీలు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై రోజుకు సుమారు రూ.2,000 కోట్ల భారీ నష్టాన్ని చవిచూస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
READ ALSO: Fuel Gases: LPG, CNG, PNG మధ్య తేడాలు ఏంటి.. వీటిని ఏ విధంగా ఉపయోగిస్తారు..?
Also Read
- Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- 8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్పాట్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
ఖరీదైన దిగుమతులు.. పెరిగిన రవాణా ఖర్చులు
పెట్రోల్పై లీటరుకు రూ.20 నష్టం, డీజిల్పై లీటరుకు ఏకంగా రూ.45 నష్టం. ఈ మొత్తం నష్టంలో సింహభాగం (సుమారు రూ.1,650 కోట్లు) డీజిల్ అమ్మకాల ద్వారానే వస్తుండటం గమనార్హం. భారతదేశం తన చమురు అవసరాల కోసం 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. గత 15 రోజుల్లోనే ముడి చమురు ధరలు 30% కంటే ఎక్కువ పెరిగాయి. దీనికి తోడు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల చమురు ట్యాంకర్ల బీమా ప్రీమియంలు, సరుకు రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. గతంలో తక్కువ ధరకు లభించిన రష్యా ముడి చమురు, ఇప్పుడు బ్రెంట్ ధరల కంటే బ్యారెల్కు $2 నుంచి $8 వరకు అదనపు ప్రీమియంతో లభిస్తోంది. ఖతార్ నుంచి సరఫరా అంతరాయాల వల్ల స్పాట్ LNG ధరలు కేవలం నెల రోజుల్లోనే 50% పెరిగాయి.
ప్రస్తుతానికి చమురు కంపెనీలు నష్టాలను భరిస్తూ ధరలను స్థిరంగా ఉంచినప్పటికీ, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇదే రీతిన కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం మినహా మరో మార్గం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్లతో ఎక్స్లో పోస్టులు!
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్పై ఉపాసన రియాక్షన్!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?