America: అమెరికాలో నలుగురు తెలుగు వాళ్ల అరెస్ట్.. మనుషుల అక్రమ రవాణా కేసు
- నలుగురు తెలుగు వాళ్లని అరెస్ట్ చేసిన టెక్సాస్ పోలీసులు
- అందులో భార్యభర్తలు కూడా ఉన్నట్లు గుర్తింపు
- ఆ దేశ చట్టాల ప్రకారం వారిపై పలు సెక్షన్ల కింద కేసులు
- మనుషుల అక్రమ రవాణా.. కంపెనీల్లో వెట్టిచాకిరి చేయిస్తోన్నారంటూ ఫిర్యాదులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనుషుల అక్రమ రవాణా కేసులో అమెరికాలోని టెక్సాస్ పోలీసులు నలుగురు తెలుగు వాళ్లని అరెస్ట్ చేశారు. అందులో భార్యభర్తలు కూడా ఉన్నారు. ఆ దేశ చట్టాల ప్రకారం వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆ నలుగురూ- చందన్ దశిరెడ్డి, సంతోష్ కట్కూరి, ద్వారకా గుండా, అనిల్ మలెగా పోలీసులు నిర్ధారించారు. వారిలో సంతోష్ కట్కూరి, ద్వారకా గుండా భార్యభర్తలు. టెక్సాస్లోని ప్రిన్స్టన్ కొలిన్ కంట్రీలో వాళ్లు నివసిస్తోన్నారు. మనుషుల అక్రమ రవాణాకు పాల్పడటం, నిర్బంధించి తమ కంపెనీల్లో వెట్టిచాకిరి చేయిస్తోన్నారంటూ ఫిర్యాదులు అందాయి. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కొలిన్ కంట్రీ గిన్స్బర్గ్ లేన్లోని ఓ ఇంట్లో 15 మంది మహిళలు ఒకే గదిలో నివసిస్తోన్నారని, వారి అత్యంత దయనీయంగా ఉందంటూ పెస్ట్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన ప్రిన్స్టన్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ 15 మంది బాధితుకు విముక్తి కల్పించారు.
READ MORE: Poonam Kaur: త్రివిక్రమ్ నాకేం చేశాడో వేరే వాళ్ళ చేత ఏం చేయించాడో అతన్నే అడగండి!
Also Read
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
దీంతో పాటు ఆ ఇంట్లో కంప్యూటర్, కొన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులు, బ్లాంకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ఫర్నిచర్ కూడా ఆ ఇంట్లో లేకపోవడం, ఆ ఇళ్లు కూడా అంతమంది నివసించడానికి అనుకూలంగా లేకపోవడం.. హ్యూమన్ ట్రాఫికింగ్కు నిదర్శనంగా గుర్తించారు. వారిని చందన్ దశిరెడ్డి, సంతోష్ కట్కూరి, ద్వారకా గుండా, అనిల్ మలె బలవంతంగా నిర్బంధించినట్లు నిర్ధారించారు. కొన్ని కంపెనీల్లో ఉద్యోగాలను ఇప్పిస్తామని ఆశపెట్టి వారిని అమెరికాకు తీసుకొచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అవన్నీ కూడా డొల్ల కంపెనీలేనని వెల్లడించారు. ప్రిన్స్టన్తో పాటు మెలిస్సా, మెక్కెన్నీ ప్రాంతాల్లోనూ ఈ దాడులు కొనసాగాయి. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
-
Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!