Fake Rank: UPSCలో ర్యాంక్ సాధించానన్నాడు.. ఎమ్మెల్యే, పోలీసులు ఘనంగా సన్మానం.. కట్ చేస్తే అంతా ఫేక్..
- యూపీఎస్సీలో ర్యాంక్ సాధించానని తప్పుడు ప్రచారం..
- స్థానిక ఎమ్మెల్యే, పోలీసుల చేత సన్మానం..
- ఫేక్ ర్యాంక్ అని తేలడంతో పరారైన బిహార్ వాసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిహార్లోని షేక్పురా జిల్లాలో జరిగిన ఒక వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూపీఎస్సీ (UPSC) పరీక్ష పాసయ్యానని అబద్ధం చెప్పి, ఊరి మొత్తాన్ని నమ్మించి, చివరకు అడ్డంగా దొరికిపోయిన ఒక యువకుడి కథ ఇది. అసలేం జరిగిందంటే.. షేక్పురా జిల్లాలోని ఫతేపూర్ గ్రామానికి చెందిన రంజిత్ కుమార్, తాను యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో విజయం సాధించానని.. ఐఏఎస్ (IAS) అధికారిని అయ్యానని ఊరిలో ప్రచారం చేసుకున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో.. ఆ యువకుడికి అభినందనలు వెల్లువెత్తాయి. స్థానిక ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే విజయ్ సామ్రాట్ స్వయంగా రంజిత్ ఇంటికి వెళ్లి.. అతడికి పూలమాలలు వేసి, బహుమతులు ఇచ్చి సత్కరించారు. ఆ ఊరిలో పండగ వాతావరణం నెలకొంది. అంతటితో ఆగకుండా.. స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లిన రంజిత్కు ఎస్హెచ్ఓ (SHO) కూడా లడ్డూలు తినిపించి ఘనంగా సన్మానించారు.
Also Read:Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది..? నిపుణులు ఏమంటున్నారంటే..
Also Read
బయటపడ్డ అసలు నిజం..
ఈ సంబరాలు జరుగుతుండగానే.. ఊరిలోని కొంతమంది యువకులకు అనుమానం వచ్చి యూపీఎస్సీ అధికారిక ఫలితాలను ఆన్లైన్లో తనిఖీ చేశారు. ఆలిండియా ర్యాంక్ 440 సాధించింది కర్ణాటకకు చెందిన ‘రంజిత్ కుమార్ ఆర్’ అని, బీహార్కు చెందిన ఈ రంజిత్ కుమార్ కాదని వారికి అర్థమైంది.
పరారైన రంజిత్..
ఈ విషయం తెలియడంతో పోలీసులు రంజిత్ను తన అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని స్టేషన్కు రమ్మని పిలిచారు. అసలు విషయం బయటపడిందని గ్రహించిన రంజిత్.. వెంటనే తన ఇంటి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు. అభినందనలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కూడా, సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలను వెంటనే డిలీట్ చేశారు.
Also Read:Hyderabad: అందుబాటులోకి మరో అర్బన్ పార్క్.. గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటన..
ఇలాంటి సంఘటనలు మరిన్ని..
యూపీఎస్సీ ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటి మరికొన్ని ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. భోజ్పూర్ జిల్లాలో ఒక వ్యక్తి తాను 301వ ర్యాంక్ సాధించానని చెప్పుకోగా.. యూపీలోని మరొకరు 113వ ర్యాంక్ తమదేనని తప్పుగా భావించారు. కానీ తర్వాత ఆ ర్యాంకులు వేరే వ్యక్తులకు వచ్చినవని స్పష్టమైంది. సాధారణ రైతు కుటుంబానికి చెందిన రంజిత్, ఢిల్లీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. పోలీసులు రంజిత్ కావాలనే ఈ అబద్ధం చెప్పాడా లేక ఏదైనా పొరపాటు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!