లోక్సభ ఎన్నికల ప్రకటనకు ముందు, చివరి దశ ఓటింగ్ వరకు రామమందిరం గురించే చర్చనీయాంశమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ పెద్దలంతా రామమందిర అంశాన్ని ప్రస్తావించారు.
మధ్య పంజాబ్ లో లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇక్కడ రెండు సీట్ల పోకడలు అందరినీ అబ్బుర పరుస్తున్నాయి. ఖలిస్థాన్కు బహిరంగంగా మద్దతు ఇస్తున్న అభ్యర్థులు.. ఫరీద్కోట్, ఖాదూర్ సాహిబ్ లోక్సభ నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు.
రేపు ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. రాబోవు అయిదేళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితవ్యం తేలనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారులు లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మచిలీపట్నం వైకాపా ఎమ్మెల్యే పేర్ని నాని ఎన్నికల సంఘంపై అర్ధంపర్ధం లేని విమర్శలు చేస్తున్నాడంటూ టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు సీఈసీ లేఖ రాశారు.
ఉత్తర్ ప్రదేశ్లోని లక్నోలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి కూలీ ముఖంపై మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. కాదనకుండా పక్కనే నిలబడిన వ్యక్తి ఇదంతా చూసి నవ్వుతున్నాడు. కూలీ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ తన కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్ల కోసం హెల్ప్లైన్ నంబర్లను జారీ చేసింది.
ప్రజల ఐదేళ్ల కష్టాలకు రేపటితో అడ్డుకట్ట పడనుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఐఏఎస్ దంపతుల కుమార్తె ఆత్మహత్య ఉదంతం వెలుగు చూసింది. మహారాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ పోస్ట్లో పని చేస్తున్న ఐఎఎస్ దంపతుల 27 ఏళ్ల కుమార్తె బహుళ అంతస్తుల భవనంలోని 10వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.
జూన్ రెండున టీ-20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైంది. ఈ సారి వెస్టిండీస్, అమెరికాలు వేదికకానున్నాయి. ఈ సారి టీంలపై డబ్బుల వర్షం కురవనుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ప్రకటించింది.
సైన్యంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అనేక గ్రూప్ B, గ్రూప్ C పోస్టుల కోసం రిక్రూట్మెంట్ను ప్రకటించింది. BSF ఈ రిక్రూట్మెంట్ కోసం 10th, 12th పాస్ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది.