Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
- తొలి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఓటమి
- మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో భారత్
- ఇంగ్లండ్ జట్టు ప్రదర్శనపై బ్రూక్ నిరాశ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harry Brook Reaction on England Defeat vs India in 1st ODI: మంగళవారం ఎడ్జ్బాస్టన్లో టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ఇంగ్లండ్ 258 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని భారత్ 45.2 ఓవర్లలోనే 4 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యం సాధించింది. మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ జట్టు ప్రదర్శనపై నిరాశ వ్యక్తం చేశాడు. మ్యాచ్లో కీలక సమయంలో వరుసగా ఐదు వికెట్లు కోల్పోవడమే తమ పరాజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. రెండో వన్డేలో మరింత బలంగా తిరిగి వస్తామని, టీమిండియాపై గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
‘మొదటి వన్డేలో మా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో 20 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోవడం మమ్మల్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆ దశలోనే మ్యాచ్పై మేము పట్టును కోల్పోయాం. అయినప్పటికీ చివర్లో జో రూట్, లియామ్ డాసన్ అద్భుత భాగస్వామ్యంతో జట్టును గౌరవప్రదమైన స్కోరు దిశగా తీసుకెళ్లారు. చివర్లో వచ్చిన చిన్నచిన్న భాగస్వామ్యాలు కూడా మాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఆ పరిస్థితుల్లో 260 పరుగులు చేయడం గొప్ప విషయం. ఈ క్రెడిట్ రూట్, డాసన్లకే దక్కుతుంది’ అని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ చెప్పాడు.
Also Read
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
- రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
‘260 పరుగుల లక్ష్యాన్ని మా బౌలర్లు కాపాడగలమనే నమ్మకం ఉంది. ఇన్నింగ్స్ విరామ సమయంలో పిచ్ కొంత నెమ్మదించింది. అదే పరిస్థితి కొనసాగితే మా బౌలర్లకు అనుకూలంగా మారుతుందని అనుకున్నాం. కానీ భారత బ్యాటర్లు ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదు. ఐదు నుంచి ఆరు పరుగుల రన్రేట్తో సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించారు. పిచ్ స్వభావం మారడంతో మా వ్యూహాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మేము ఎప్పుడూ పిచ్ పరిస్థితులను బట్టి తుది జట్టును ఎంపిక చేస్తాం. ఈ మ్యాచ్లో మరో 60-70 పరుగులు చేసి 320 లేదా 330 స్కోరు సాధించి ఉంటే మా స్పిన్నర్లు మ్యాచ్లో మరింత ప్రభావం చూపేవారు. కానీ మిడిల్ ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోవడం వల్ల ఆ అవకాశం లేకుండా పోయింది. అదే మా ఓటమికి ప్రధాన కారణం’ అని అన్నాడు.
రెండో వన్డేకు ముందు ఆందోళన ఏమీ లేదని బ్రూక్ స్పష్టం చేశాడు. ‘ఇప్పుడు మేము కార్డిఫ్కు వెళ్తాం. అక్కడ పిచ్ను పరిశీలించి జట్టు కూర్పుపై నిర్ణయం తీసుకుంటాం. తొలి మ్యాచ్లో చేసిన తప్పులను సరిదిద్దుకుని రెండో వన్డేలో మరింత మెరుగైన ప్రదర్శన చేస్తాం. కచ్చితంగా టీమిండియాను ఓడించడానికే చూస్తాం. సిరీస్ను సమం చేయడానికి ప్రయత్నిస్తాం’ అని హ్యారీ బ్రూక్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
-
UPI Transactions: యూపీఐ సేవలు ఉచితం కాదు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!