Election Commission: ఎన్నికల ప్రచారంలో మహిళలపై అనుచిత పదజాలం చేస్తే ఊరుకోం..
- మహిళా రాజకీయ నేతలపై అనుచిత పదజాలం తగదు
- అభ్యర్థులపై చర్యలు తప్పవు
- మహిళల గౌరవాన్ని కించ పరిచే భాషపై సీఈసీ తీవ్ర ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహిళా రాజకీయ నేతలపై అనుచిత పదజాలం వాడడాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఖండించారు. అభ్యర్థులు ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వారిపై సత్వర, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల, చట్టాన్ని అమలు చేసే అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మహిళల గౌరవాన్ని కించ పరిచే భాషపై తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేశారు.
READ MORE: CM Chandrababu: ఏలూరు పోలీసులను అభినందించిన ముఖ్యమంత్రి..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం… రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మహిళల గౌరవానికి భంగం కలిగించే ఏ పని, కార్యకలాపాలు లేదా ప్రకటనలు చేయొద్దని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అభ్యర్థులు వ్యక్తిగత దాడులు లేదా పబ్లిక్ పాత్రలతో సంబంధం లేని విమర్శలకు దూరంగా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలలో పాల్గొనే వారందరూ బహిరంగ ప్రసంగాలలో గౌరవప్రదమైన ప్రవర్తన, భాషను గమనించాలని సీఈసీ తెలిపారు. మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమి నేతలు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించిన విషయం తెలిసిందే. శివసేన అభ్యర్థి షైన ఎన్సిపై శివసేన (యుబిటి) ఎంపి అరవింద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీఈసీ నుంచి ఈ ప్రకటన వచ్చింది.
READ MORE:Salman Khan: సల్మాన్ కోసం 70 మంది సెక్యూరిటీ.. ప్రభుత్వానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!