India Weather : వాతావరణంపై షాకింగ్ రిపోర్ట్.. ఇప్పటికే 3వేలకు పైగా మరణాలు
- ప్రతికూల వాతావరణంపై షాకింగ్ రిపోర్ట్
- దేశంలో ఇప్పటికే 3వేలకు పైగా మరణాలు
- గతేడాది కంటే అత్యధికం
- ఏపీలో అత్యధికంగా ఇళ్లు ధ్వంసం
- 32 లక్షల హెక్టార్లకు పైగా పంట నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో వాతావరణ పరిస్థితులపై షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) ఈ నివేదిక ప్రకారం.. 2024 మొదటి తొమ్మిది నెలల్లో భారతదేశం 93 శాతం రోజులు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంది. 274 రోజులలో 255 రోజులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విపరీతమైన వేడి, చలి, తుఫాను, వర్షం, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల వల్ల ప్రభావితమైనట్లు నివేదిక చూపుతోంది. ఈ విపత్తులు 3,238 మంది ప్రాణాలను బలిగొన్నాయి. 2.35 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వ్యవసాయం కూడా భారీగా నష్టపోయింది. 32 లక్షల హెక్టార్లకు పైగా భూమిలో పంటలు నాశనమయ్యాయి.
ఈ ఏడాది అధిక మరణాలు..
సీఎస్ఈ నివేదిక 2023 కంటే 2024లో వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉందని చూపిస్తుంది. గత ఏడాది ఇదే సమయంలో దేశంలో 273 రోజులలో 235 రోజులు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కనిపించాయి. ఫలితంగా 2,923 మంది మరణించారు. 18.4 లక్షల హెక్టార్లలో పంటలు ధ్వంసమయ్యాయి. 80,293 ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఢిల్లీకి చెందిన సంస్థ తన వార్షిక ‘స్టేట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్’ నివేదికలో మధ్యప్రదేశ్లో వాతావరణం విధ్వంసం సృష్టించిన గరిష్ట సంఖ్య 176 రోజులు అని పేర్కొంది.
Also Read
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
కేరళలో అత్యధిక మరణాలు..
కేరళలో అత్యధికంగా 550 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్లో 353 మంది, అస్సాంలో 256 మంది వాతావరణ బారిన పడి అనంతలోకాలకు చేరుకున్నారు. అయితే… ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 85,806 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 142 రోజుల పాటు తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్న మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా పంట నష్టం వాటిల్లగా, 60 శాతం పంటలు నాశనమయ్యాయి. పంట నష్టంలో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ ధోరణి ఊహాజనితమైనది కాదని సిఎస్ఇ డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణ్ అంటున్నారు.
వాతావరణం ఎక్కడ విధ్వంసం సృష్టించింది?
నివేదికలోని ప్రాంతాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. వాతావరణం మధ్య భారతదేశంలో గరిష్టంగా 218 రోజుల పాటు విధ్వంసం సృష్టించింది. దీని తర్వాత నార్త్-వెస్ట్ వస్తుంది. ఈ ప్రదేశంలో 213 రోజులు ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నాయి. మధ్య భారతదేశంలో 1,001 మంది మరణించారు. దీని తర్వాత దక్షిణ ద్వీపకల్పం-762 మరణాలు, తూర్పు, ఈశాన్య -741 మరణాలు , నార్త్-వెస్ట్ -734 మరణాలు సంభవించాయి.
తాజావార్తలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
-
Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!