India Weather : వాతావరణంపై షాకింగ్ రిపోర్ట్.. ఇప్పటికే 3వేలకు పైగా మరణాలు
- ప్రతికూల వాతావరణంపై షాకింగ్ రిపోర్ట్
- దేశంలో ఇప్పటికే 3వేలకు పైగా మరణాలు
- గతేడాది కంటే అత్యధికం
- ఏపీలో అత్యధికంగా ఇళ్లు ధ్వంసం
- 32 లక్షల హెక్టార్లకు పైగా పంట నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో వాతావరణ పరిస్థితులపై షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) ఈ నివేదిక ప్రకారం.. 2024 మొదటి తొమ్మిది నెలల్లో భారతదేశం 93 శాతం రోజులు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంది. 274 రోజులలో 255 రోజులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విపరీతమైన వేడి, చలి, తుఫాను, వర్షం, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల వల్ల ప్రభావితమైనట్లు నివేదిక చూపుతోంది. ఈ విపత్తులు 3,238 మంది ప్రాణాలను బలిగొన్నాయి. 2.35 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వ్యవసాయం కూడా భారీగా నష్టపోయింది. 32 లక్షల హెక్టార్లకు పైగా భూమిలో పంటలు నాశనమయ్యాయి.
ఈ ఏడాది అధిక మరణాలు..
సీఎస్ఈ నివేదిక 2023 కంటే 2024లో వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉందని చూపిస్తుంది. గత ఏడాది ఇదే సమయంలో దేశంలో 273 రోజులలో 235 రోజులు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కనిపించాయి. ఫలితంగా 2,923 మంది మరణించారు. 18.4 లక్షల హెక్టార్లలో పంటలు ధ్వంసమయ్యాయి. 80,293 ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఢిల్లీకి చెందిన సంస్థ తన వార్షిక ‘స్టేట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్’ నివేదికలో మధ్యప్రదేశ్లో వాతావరణం విధ్వంసం సృష్టించిన గరిష్ట సంఖ్య 176 రోజులు అని పేర్కొంది.
Also Read
- Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
- 50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
- Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్...
- రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
కేరళలో అత్యధిక మరణాలు..
కేరళలో అత్యధికంగా 550 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్లో 353 మంది, అస్సాంలో 256 మంది వాతావరణ బారిన పడి అనంతలోకాలకు చేరుకున్నారు. అయితే… ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 85,806 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 142 రోజుల పాటు తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్న మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా పంట నష్టం వాటిల్లగా, 60 శాతం పంటలు నాశనమయ్యాయి. పంట నష్టంలో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ ధోరణి ఊహాజనితమైనది కాదని సిఎస్ఇ డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణ్ అంటున్నారు.
వాతావరణం ఎక్కడ విధ్వంసం సృష్టించింది?
నివేదికలోని ప్రాంతాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. వాతావరణం మధ్య భారతదేశంలో గరిష్టంగా 218 రోజుల పాటు విధ్వంసం సృష్టించింది. దీని తర్వాత నార్త్-వెస్ట్ వస్తుంది. ఈ ప్రదేశంలో 213 రోజులు ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నాయి. మధ్య భారతదేశంలో 1,001 మంది మరణించారు. దీని తర్వాత దక్షిణ ద్వీపకల్పం-762 మరణాలు, తూర్పు, ఈశాన్య -741 మరణాలు , నార్త్-వెస్ట్ -734 మరణాలు సంభవించాయి.
తాజావార్తలు
-
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్ను మార్చేసింది.. చైతూ, అఖిల్కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!