India Weather : వాతావరణంపై షాకింగ్ రిపోర్ట్.. ఇప్పటికే 3వేలకు పైగా మరణాలు
- ప్రతికూల వాతావరణంపై షాకింగ్ రిపోర్ట్
- దేశంలో ఇప్పటికే 3వేలకు పైగా మరణాలు
- గతేడాది కంటే అత్యధికం
- ఏపీలో అత్యధికంగా ఇళ్లు ధ్వంసం
- 32 లక్షల హెక్టార్లకు పైగా పంట నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో వాతావరణ పరిస్థితులపై షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) ఈ నివేదిక ప్రకారం.. 2024 మొదటి తొమ్మిది నెలల్లో భారతదేశం 93 శాతం రోజులు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంది. 274 రోజులలో 255 రోజులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విపరీతమైన వేడి, చలి, తుఫాను, వర్షం, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల వల్ల ప్రభావితమైనట్లు నివేదిక చూపుతోంది. ఈ విపత్తులు 3,238 మంది ప్రాణాలను బలిగొన్నాయి. 2.35 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వ్యవసాయం కూడా భారీగా నష్టపోయింది. 32 లక్షల హెక్టార్లకు పైగా భూమిలో పంటలు నాశనమయ్యాయి.
ఈ ఏడాది అధిక మరణాలు..
సీఎస్ఈ నివేదిక 2023 కంటే 2024లో వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉందని చూపిస్తుంది. గత ఏడాది ఇదే సమయంలో దేశంలో 273 రోజులలో 235 రోజులు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కనిపించాయి. ఫలితంగా 2,923 మంది మరణించారు. 18.4 లక్షల హెక్టార్లలో పంటలు ధ్వంసమయ్యాయి. 80,293 ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఢిల్లీకి చెందిన సంస్థ తన వార్షిక ‘స్టేట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్’ నివేదికలో మధ్యప్రదేశ్లో వాతావరణం విధ్వంసం సృష్టించిన గరిష్ట సంఖ్య 176 రోజులు అని పేర్కొంది.
Also Read
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
కేరళలో అత్యధిక మరణాలు..
కేరళలో అత్యధికంగా 550 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్లో 353 మంది, అస్సాంలో 256 మంది వాతావరణ బారిన పడి అనంతలోకాలకు చేరుకున్నారు. అయితే… ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 85,806 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 142 రోజుల పాటు తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్న మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా పంట నష్టం వాటిల్లగా, 60 శాతం పంటలు నాశనమయ్యాయి. పంట నష్టంలో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ ధోరణి ఊహాజనితమైనది కాదని సిఎస్ఇ డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణ్ అంటున్నారు.
వాతావరణం ఎక్కడ విధ్వంసం సృష్టించింది?
నివేదికలోని ప్రాంతాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. వాతావరణం మధ్య భారతదేశంలో గరిష్టంగా 218 రోజుల పాటు విధ్వంసం సృష్టించింది. దీని తర్వాత నార్త్-వెస్ట్ వస్తుంది. ఈ ప్రదేశంలో 213 రోజులు ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నాయి. మధ్య భారతదేశంలో 1,001 మంది మరణించారు. దీని తర్వాత దక్షిణ ద్వీపకల్పం-762 మరణాలు, తూర్పు, ఈశాన్య -741 మరణాలు , నార్త్-వెస్ట్ -734 మరణాలు సంభవించాయి.
తాజావార్తలు
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!