India Weather : వాతావరణంపై షాకింగ్ రిపోర్ట్.. ఇప్పటికే 3వేలకు పైగా మరణాలు
- ప్రతికూల వాతావరణంపై షాకింగ్ రిపోర్ట్
- దేశంలో ఇప్పటికే 3వేలకు పైగా మరణాలు
- గతేడాది కంటే అత్యధికం
- ఏపీలో అత్యధికంగా ఇళ్లు ధ్వంసం
- 32 లక్షల హెక్టార్లకు పైగా పంట నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో వాతావరణ పరిస్థితులపై షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) ఈ నివేదిక ప్రకారం.. 2024 మొదటి తొమ్మిది నెలల్లో భారతదేశం 93 శాతం రోజులు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంది. 274 రోజులలో 255 రోజులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విపరీతమైన వేడి, చలి, తుఫాను, వర్షం, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల వల్ల ప్రభావితమైనట్లు నివేదిక చూపుతోంది. ఈ విపత్తులు 3,238 మంది ప్రాణాలను బలిగొన్నాయి. 2.35 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వ్యవసాయం కూడా భారీగా నష్టపోయింది. 32 లక్షల హెక్టార్లకు పైగా భూమిలో పంటలు నాశనమయ్యాయి.
ఈ ఏడాది అధిక మరణాలు..
సీఎస్ఈ నివేదిక 2023 కంటే 2024లో వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉందని చూపిస్తుంది. గత ఏడాది ఇదే సమయంలో దేశంలో 273 రోజులలో 235 రోజులు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కనిపించాయి. ఫలితంగా 2,923 మంది మరణించారు. 18.4 లక్షల హెక్టార్లలో పంటలు ధ్వంసమయ్యాయి. 80,293 ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఢిల్లీకి చెందిన సంస్థ తన వార్షిక ‘స్టేట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్’ నివేదికలో మధ్యప్రదేశ్లో వాతావరణం విధ్వంసం సృష్టించిన గరిష్ట సంఖ్య 176 రోజులు అని పేర్కొంది.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
కేరళలో అత్యధిక మరణాలు..
కేరళలో అత్యధికంగా 550 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్లో 353 మంది, అస్సాంలో 256 మంది వాతావరణ బారిన పడి అనంతలోకాలకు చేరుకున్నారు. అయితే… ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 85,806 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 142 రోజుల పాటు తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్న మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా పంట నష్టం వాటిల్లగా, 60 శాతం పంటలు నాశనమయ్యాయి. పంట నష్టంలో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ ధోరణి ఊహాజనితమైనది కాదని సిఎస్ఇ డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణ్ అంటున్నారు.
వాతావరణం ఎక్కడ విధ్వంసం సృష్టించింది?
నివేదికలోని ప్రాంతాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. వాతావరణం మధ్య భారతదేశంలో గరిష్టంగా 218 రోజుల పాటు విధ్వంసం సృష్టించింది. దీని తర్వాత నార్త్-వెస్ట్ వస్తుంది. ఈ ప్రదేశంలో 213 రోజులు ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నాయి. మధ్య భారతదేశంలో 1,001 మంది మరణించారు. దీని తర్వాత దక్షిణ ద్వీపకల్పం-762 మరణాలు, తూర్పు, ఈశాన్య -741 మరణాలు , నార్త్-వెస్ట్ -734 మరణాలు సంభవించాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!