CM Nitish Kumar: నన్ను సీఎం చేసింది ఆ మహానుభావుడే.. బీహార్ సీఎం కీలక వ్యాఖ్యలు
- వాజ్పేయి తనను సీఎం చేశారన్న సీఎం నితీశ్
- రెండు సార్లు తప్పుడు వ్యక్తులతో కలిశానన్న సీఎం
- ఇకపై ఎన్డీయేను వీడిది లేదని మరోసారి స్పష్టం
- ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ సీఎం నితీశ్కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని, దివంగత అటల్ బీహార్ వాజ్పేయి తనను సీఎం చేశారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. ఎన్డీయే నుంచి వైదొలిగి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరి రెండుసార్లు తప్పు చేశానని నితీశ్ పునరుద్ఘాటించారు. తాను రెండుసార్లు తప్పుడు వ్యక్తులతో వెళ్లానని, అయితే వారు తప్పు చేస్తున్నారని తేలడంతో మళ్లీ బీజేపీలోకి వచ్చానని అన్నారు. ఇకపై ఎన్డీయేను వీడేది లేదని మరోసారి స్పష్టం చేశారు. వాజ్పేయి మహానుభావుడని కొనియాడారు.
READ MORE: Canada Student Visa: కెనడా వెళ్లాలనుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్కి షాక్.. SDS వీసా నిలిపివేత..
Also Read
- Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
- Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
భోజ్పూర్ జిల్లాలోని తరారీ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం నితీశ్ ఈ విషయాలు చెప్పారు. బీజేపీ అభ్యర్థి విశాల్ ప్రశాంత్కు మద్దతుగా ప్రచారం నిర్వహించి ఉప ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తన ప్రసంగంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి పాలనను సీఎం తీవ్రంగా టార్గెట్ చేశారు. జంగిల్ రాజ్ అని పిలుస్తున్నారని గుర్తు చేస్తూ.. ఆర్జేడీ కేవలం ముస్లింల ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుని.. మైనారిటీల కోసం ఎలాంటి పని చేయలేదని ఆరోపించారు. తాము అందరి కోసం పని చేస్తామన్నారు. భాగల్పూర్ అల్లర్లను గుర్తు చేసిన ముఖ్యమంత్రి నితీశ్.. తాము ఉన్నంత కాలం హిందువులైనా, ముస్లింలమైనా అందరి ఒకే విధంగా చూస్తామన్నారు. తాము పని చేశాం కాబట్టే ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చి ఓట్లు అడుక్కుంటున్నారని తెలిపారు.
READ MORE:India Weather : వాతావరణంపై షాకింగ్ రిపోర్ట్.. ఇప్పటికే 3వేలకు పైగా మరణాలు
అయితే.. ఇటీవల దేశంలో జరిగిన లోక్సభ ఎన్నికల అనంతరం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాజీ మిత్రపక్షమైన ఎన్డీఏలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను అక్కడికి ఇక్కడికి వెళ్లనని, శాశ్వతంగా ఎన్డీఏతోనే ఉంటానని స్పష్టం చేశారు. 2005 నుంచి బిహార్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని అన్నారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చర్చలో అన్ని విషయాలు చర్చించుకున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..
-
Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. “డ్రైవర్నే చంపుకోండి” అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
-
Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!