Foods- Cancer : రోడ్ సైడ్ టిఫెన్ చేస్తున్నారా? అయితే మీకు క్యాన్సర్ తప్పదు..!
- బిజీ లైఫ్లో బయటి ఫుడ్కి అలవాటు పడుతున్న జనాలు
- రోడ్ సైడ్ టిఫెన్ చేస్తున్నారా?
- చాలా ప్రమాదం ఉందన్న నిపుణులు
- క్యాన్సర్ తప్పదని హెచ్చరిక
ప్రస్తుతం జనాలు అంతా బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఈ క్రమంలో ఏదైనా పనిని చేయాలనుకుంటే టైం సరిపోదని చెప్పి, కొన్నిసార్లు ఆహారాన్ని కూడా బయటే తినేస్తున్నారు. ఇలా బయట ఫాస్ట్ ఫుడ్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు బండ్ల వద్ద ఏ టైంలో చూసినా రద్దీగానే ఉంటున్నాయి. కొందరైతే ఇంటి దగ్గర వండు కోవడం మానేస్తున్నారు. అయితే ఇలా బయట బిర్యానీ, ఫ్రైలు అంటూ బాగానే తింటున్నారు. కానీ అవి వేటితో తయారు చేస్తారు? రుచికి ఏం కలుపుతున్నారు? ఇంతకీ అవి తాజావేనా అనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా? రోడ్ సైడ్ టిఫెన్ చేసేవాళ్లకు మాత్రం ఓ షాకింగ్ న్యూస్ వెలువడింది. ఈ ఫుడ్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట.
READ MORE: IND vs SA: శాంసన్ వీర విహారం.. సిక్సులతోనే డీల్
Also Read
- Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
- Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Gutti Vankaya Recipe : కుక్కర్లో గుత్తి వంకాయ.. పదే పది నిమిషాల్లో అద్భుతమైన రుచి.!
- AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..
రోడ్ సైడ్ ఫుడ్ను తయారు చేసే పద్ధతి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఆహార తయారీకి ఉపయోగించే నూనె నల్లగా కనిపిస్తుంది. అంటే నూనెను ఎక్కువగా మరిగించడం, అదే నూనెలో నాలగైదు దఫాలుగా వాడటం వల్ల ఆ కలర్ వస్తుంది. దీని వల్ల చాలా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా రోడ్సైడ్ ఫుడ్ తయారీ దారులు మినిమం శుభ్రత కూడా పాటించడం లేదు. తక్కువ ధరకు లభించే సరకుల వినియోగించడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
READ MORE:Indian Railways: భార్యాభర్తల గొడవతో రైల్వేకి రూ.3కోట్లు నష్టం.. ఏం జరిగిందంటే?
ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారి ముప్పును పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు నూనె పదార్థాలు, బయట ఫుడ్ తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. ఆయిల్ ను ఎక్కువసార్లు మరిగించడం వల్ల అందులోని టోటల్ పోలార్ కాంపౌండ్స్ (టీపీసీ) ఫ్రీరాడికల్స్గా మారుతాయి. నార్మల్గా వంట నూనెలో పోలార్ కాంపౌండ్స్ 25 శాతానికి మించితే దాన్ని మార్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిబంధనలు పేర్కొంటున్నాయి. దాదాపు అన్ని హోటళ్లలో మోతాదుకు మించి హానికరమైన ఫుడ్ కలర్లు, టేస్టింగ్ సాల్ట్, సోయా సాస్లు యూజ్ చేస్తున్నారు. కాబట్టి, రోడ్ సైడ్ ఫుడ్ తీసుకోవడం కారణంగా ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!