Foods- Cancer : రోడ్ సైడ్ టిఫెన్ చేస్తున్నారా? అయితే మీకు క్యాన్సర్ తప్పదు..!
- బిజీ లైఫ్లో బయటి ఫుడ్కి అలవాటు పడుతున్న జనాలు
- రోడ్ సైడ్ టిఫెన్ చేస్తున్నారా?
- చాలా ప్రమాదం ఉందన్న నిపుణులు
- క్యాన్సర్ తప్పదని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం జనాలు అంతా బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఈ క్రమంలో ఏదైనా పనిని చేయాలనుకుంటే టైం సరిపోదని చెప్పి, కొన్నిసార్లు ఆహారాన్ని కూడా బయటే తినేస్తున్నారు. ఇలా బయట ఫాస్ట్ ఫుడ్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు బండ్ల వద్ద ఏ టైంలో చూసినా రద్దీగానే ఉంటున్నాయి. కొందరైతే ఇంటి దగ్గర వండు కోవడం మానేస్తున్నారు. అయితే ఇలా బయట బిర్యానీ, ఫ్రైలు అంటూ బాగానే తింటున్నారు. కానీ అవి వేటితో తయారు చేస్తారు? రుచికి ఏం కలుపుతున్నారు? ఇంతకీ అవి తాజావేనా అనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా? రోడ్ సైడ్ టిఫెన్ చేసేవాళ్లకు మాత్రం ఓ షాకింగ్ న్యూస్ వెలువడింది. ఈ ఫుడ్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట.
READ MORE: IND vs SA: శాంసన్ వీర విహారం.. సిక్సులతోనే డీల్
Also Read
- Lucky Plants: ధనలక్ష్మిని ఇంట్లోకి లాగేసే ‘లక్కీ ప్లాంట్స్’.. మీ తలరాత మారిపోవడం ఖాయం అంట!
- Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
- Termite Prevention: వర్షాకాలం ఇంట్లో చెదలు పెరుగుతుందా.? అయితే ఇలా చెక్ పెట్టండి..
- Ring Removal Tips: మీ ఉంగరం వేలికి ఇరుక్కుపోయిందా..? సింపుల్గా తీసే చిట్కాలు ఇవే..
రోడ్ సైడ్ ఫుడ్ను తయారు చేసే పద్ధతి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఆహార తయారీకి ఉపయోగించే నూనె నల్లగా కనిపిస్తుంది. అంటే నూనెను ఎక్కువగా మరిగించడం, అదే నూనెలో నాలగైదు దఫాలుగా వాడటం వల్ల ఆ కలర్ వస్తుంది. దీని వల్ల చాలా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా రోడ్సైడ్ ఫుడ్ తయారీ దారులు మినిమం శుభ్రత కూడా పాటించడం లేదు. తక్కువ ధరకు లభించే సరకుల వినియోగించడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
READ MORE:Indian Railways: భార్యాభర్తల గొడవతో రైల్వేకి రూ.3కోట్లు నష్టం.. ఏం జరిగిందంటే?
ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారి ముప్పును పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు నూనె పదార్థాలు, బయట ఫుడ్ తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. ఆయిల్ ను ఎక్కువసార్లు మరిగించడం వల్ల అందులోని టోటల్ పోలార్ కాంపౌండ్స్ (టీపీసీ) ఫ్రీరాడికల్స్గా మారుతాయి. నార్మల్గా వంట నూనెలో పోలార్ కాంపౌండ్స్ 25 శాతానికి మించితే దాన్ని మార్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిబంధనలు పేర్కొంటున్నాయి. దాదాపు అన్ని హోటళ్లలో మోతాదుకు మించి హానికరమైన ఫుడ్ కలర్లు, టేస్టింగ్ సాల్ట్, సోయా సాస్లు యూజ్ చేస్తున్నారు. కాబట్టి, రోడ్ సైడ్ ఫుడ్ తీసుకోవడం కారణంగా ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Nandamuri Mokshagna : బాలయ్య వారసుడి కోసం సందీప్ రెడ్డి వంగా?
-
Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!
-
Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
-
Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Astrology: శ్రావణ మాసానికి ముందే శని వక్రగతి.. ఈ 5 రాశుల వారికి సంవత్సరాంతం వరకు ధన యోగం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!