ఈసారి ఆగస్టు 15వ తేదీ గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా 11వ సారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఎర్రకోటపై నుంచి వరుసగా 11 సార్లు ప్రసంగం చేసిన దేశానికి మూడో ప్రధానిగా రికార్డులకెక్కనున్నారు.
పదవీ విరమణ కేసులో కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి తన పదవీ విరమణ తర్వాత తొలుత నమోదు చేసిన పుట్టిన తేదీని మార్చుకోలేరని హైకోర్టు పేర్కొంది.
ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. ఈ ప్రత్యేక అతిథులు 150 మంది మహిళా సర్పంచ్లు. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయడంలో వారు అద్భుతమైన కృషి చేసినట్లు సమాచారం.
ఒలింపిక్స్ పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ రేసులో అమెరికాకు చెందిన రాయ్ బెంజమిన్ రెండు స్వర్ణాలు సాధించాడు. అతను ఈ సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శనను అందించి 46.46 సెకన్లలో రేసును పూర్తి చేశాడు.
ఉక్కు ధరలు మరోసారి తగ్గుతున్నాయి. ఉక్కు ధరలు తగ్గడానికి దిగుమతులు పెరగడమే ప్రధాన కారణంగా పరిగణిస్తున్నారు. కొన్ని ఉక్కు ఉత్పత్తుల ధరలు చాలా వేగంగా పడిపోయాయి.
ఉత్తర్ ప్రదేశ్లో 13 నెలల వ్యవధిలో 9మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడిని పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ 'తలాష్' విజయవంతమైనందని పోలీసులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో అరెస్టయిన సీరియల్ కిల్లర్ విన్యాసాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. మధ్య వయస్కులైన మహిళలను ఒంటరిగా కనబడితే వారికి ప్రపోజ్ చేసేవాడు.
ఇంగ్లాండ్లో జరుగుతున్న హండ్రెడ్ లీగ్లో విండీస్ దిగ్గజ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ విధ్వంసం సృష్టించాడు. పొలార్డ్ వరుసగా 5 సిక్సర్లు కొట్టి వెలుగులోకి వచ్చాడు. వరల్డ్ క్లాస్ ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఓవర్ లో అతను ఈ సిక్సర్లు బాదాడు.
మోహన్ బాబు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంకు రావడం నా అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏపీలోని చంద్రగిరిలో శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, ఎంబీయూ మొదటి స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు, ఛైర్మన్ మంచు మోహన్ బాబు హాజరయ్యారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తమ ప్రభుత్వ పతనానికి అమెరికా కారణమని ఆరోపించారు. బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు వీలుగా ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించనందుకే తనను అధికారం నుంచి తప్పించారని హసీనా ఆరోపించారు.