KTR : మూసీ మీద 15 బ్రిడ్జిలు.. బీఆర్ఎస్ ప్లానింగ్ చెప్పిన కేటీఆర్
- మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కేటీఆర్
- ఇళ్ల కూల్చివేతలపై తీవ్ర విమర్శలు
- మూసీపై 15 బ్రిడ్జిల నిర్మాణం బీఆర్ఎస్ ప్లాన్
- పేదల ఇళ్లను కూల్చొద్దని ప్రభుత్వానికి హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ‘మింగడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె’ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేసిన ఆయన, రాష్ట్ర ఖజానాలో ప్రజా హామీలకే నిధులు లేనప్పుడు మూసీ ప్రాజెక్టు కోసం వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని నిలదీశారు. గతంలో కేసీఆర్ అసెంబ్లీ వేదికగా తెలంగాణ నిర్మాణం గురించి ప్రెజెంటేషన్ ఇస్తే, నేటి ముఖ్యమంత్రి ఫైవ్ స్టార్ హోటళ్లలో కూర్చుని పేదల ఇళ్లను ఎలా విద్వంసం చేయాలో ప్రెజెంటేషన్లు ఇస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎప్పుడూ మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని, అయితే సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చడాన్ని మాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు.
Uttam Kumar Reddy: గ్యాస్పై తెలంగాణ ప్రజలకు ఊరట.. మంత్రి కీలక ప్రకటన..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
బీఆర్ఎస్ హయాంలో తాము అనుసరించిన అభివృద్ధి నమూనాను వివరిస్తూ, ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా ముషీరాబాద్ , నాగోల్ వంటి ప్రాంతాల్లో ఆరు కిలోమీటర్ల మేర మూసీని అద్భుతంగా సుందరీకరించి చూపించామని కేటీఆర్ గుర్తు చేశారు. తాము గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన ఫోటోలు కాకుండా, క్షేత్రస్థాయిలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపిస్తున్నామని చెప్పారు. మంచిరేవుల నుంచి ఘట్కేసర్ వరకు 57 కిలోమీటర్ల పరిధిలో మూసీ రూపురేఖలు మార్చాలని, అందులో భాగంగా 15 బ్రిడ్జిలు నిర్మించాలనే పక్కా ప్రణాళికతో తాము ఉన్నామని వెల్లడించారు. ఇప్పటికే మూసీ నీటిని శుద్ధి చేసేందుకు రూ. 3,866 కోట్లతో ఎస్టీపీ (STP) ప్లాంట్లు నిర్మించామని, కేసీఆర్ చేసింది మూసీ పునర్జీవమైతే, రేవంత్ రెడ్డి చేస్తోంది కేవలం ఇళ్ల విద్వంసమేనని ఆరోపించారు.
Durandhar 2: ధురంధర్ ది రివెంజ్ అడ్వాన్స్ బుకింగ్లు ప్రారంభం
ఇదే క్రమంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని కేటీఆర్ ఎండగట్టారు. పేదల ఇళ్లను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, మంత్రులు , అధికార పార్టీ నేతల ఇళ్ల విషయంలో ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు, మాదాపూర్లో ఆయన సోదరుడి ఇల్లు, అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి , సీనియర్ నేతలు వివేక్ వెంకటస్వామి, కేవీపీ రామచందర్ రావుల ఇళ్లు ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లలో ఉన్నాయని, వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. ఒక్క ఇల్లు కట్టే తెలివి లేని ముఖ్యమంత్రికి వందల ఇళ్లు కూల్చే తెలివి ఉందని విమర్శించిన కేటీఆర్, బాధితులకు భరోసా ఇస్తూ మరో రెండేళ్లు తమ ఆస్తులను కాపాడుకోవాలని, త్వరలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక మూసీ ప్రాంత నివాసుల ఇళ్లకు చిన్న సున్నం కూడా చెదరకుండా సుందరీకరణ చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!