Serial Killer: 9 మంది మహిళల హత్యలకు తల్లిపై ప్రేమే కారణం!
- ఉత్తర్ ప్రదేశ్లో 13 నెలల వ్యవధిలో 9మంది మహిళల హత్య
- ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన సీరియల్ కిల్లర్
- అతడిని పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ తలాష్
- ఈ హత్యలకు బలమైన కారణం
- కారణాన్ని వెల్లడించిన కిల్లర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ ప్రదేశ్లో 13 నెలల వ్యవధిలో 9మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడిని పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ ’తలాష్’ విజయవంతమైనందని పోలీసులు తెలిపారు. అతడి పేరుతో పాటు మరిన్ని కీలక విషయాలను వెల్లడించారు. యూపీ సీరియల్ కిల్లర్ పేరు కుల్దీప్ కుమార్ గంగ్వార్. అతడి వయస్సు 38ఏళ్లు. బరేలీ ప్రాంతంలో 13 నెలల వ్యవధిలో 9మంది మహిళలను హతమార్చాడు. పొలాల్లో ఒంరిగా పనిచేస్తున్న మహిళలే అతని టార్గెట్. అటవీ ప్రాంతాల్లోని మహిళలను కూడా అతని విడిచిపెట్టలేదు. జులై 2023- జులై 2024లో మధ్యలో బరేలీకి సమీపంలోని గ్రామాల్లో మహిళలను ఈ సీరియల్ కిల్లర్ చంపాడు. ఒంటరిగా కనపడిన మహిళల దగ్గరికి వెళ్లడం, లైంగికంగా వారికి దగ్గరవ్వడానికి ప్రయత్నించడం, ఒప్పుకోకపోతే.. తీవ్రస్థాయిలో కోపం తెచ్చుకుని, వారిని గొంతు నులిమి చంపడం ఈ సీరియల్ కిల్లర్కి అలవాటు. అనంతరం మహిళల లిప్స్టిక్లు, బిందీలు, ఐడీ కార్డులను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
READ MORE: Crime: మొదట ప్రపోజ్ చేస్తాడు.. తిరస్కరిస్తే చంపేస్తాడు.. సీరియల్ కిల్లర్ కథ
Also Read
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
కాగా.. ఈ దర్యాప్తులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. ఈ హత్యలు ఎందుకు చేశాడు? ఇంత దారుణంగా ఎలా చంపుతున్నాడు? దీనికి గల ఓ బలమైన కారణం బయట పడింది. తన తల్లి జీవించి ఉండగానే తన తండ్రి బాబూరామ్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో భార్య కోరిక మేరకు మొదటి భార్యను తరచూ కొట్టేవాడు. ఈ కారణంగానే నిందితుడికి తన సవతి తల్లి పట్ల ద్వేషం కలిగింది. ఈ కారణంగా అతను ఆ వయస్సులో ఉన్న మహిళలను బలిపశువులను చేయడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు 9 మందిని అంతమొందించాడు.
READ MORE:Tollywood: బాలీవుడ్ మోజులో టాలీవుడ్ కు నో చెప్పిన భామలు ఎవరంటే..?
కుల్దీప్ని పట్టుకునేందుకు ఆపరేషన్ తలాష్ని చేపట్టారు. ఇందులో భాగంగా జులైలో పోలీసులకు ఒక టిప్ వచ్చింది. దానిపై వారు వెంటనే స్పందించారు. షాహి, శీష్గఢ్ పోలీస్ స్టేషన్ల మధ్యలో 25 కి.మీల రేడియస్ని మార్క్ చేసి గాలింపు చర్యలు చేపట్టారు.”యూపీ సీరియల్ కిల్లర్ని పట్టుకునేందుకు 22 బృందాలను ఏర్పాటు చేశాము. 1,50,000 అనుమానాస్పద మొబైల్ నెంబర్లను స్కాన్ చేశాము. 1,500 సీసీటీవీ కెమెరాలను మానిటర్ చేశాము. క్రైమ్ ప్యాటర్న్ని దర్యాప్తు చేశాము,” అని బరేలీ ఎస్ఎస్పీ అనురాగ్ ఆర్య తెలిపారు.
తాజావార్తలు
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?