Steel Prices: భారీగా తగ్గిన స్టీల్ ధరలు.. మూడేళ్ల కనిష్ట స్థాయికి..!
- మరోసారి తగ్గుతున్న ఉక్కు ధరలు
- ధరలు తగ్గడానికి దిగుమతులు పెరగడమే ప్రధాన కారణం
- అవి మూడేళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయిన రేట్లు
- స్టీల్పై దిగుమతి సుంకాన్ని పెంచాలని డి మాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్కు ధరలు మరోసారి తగ్గుతున్నాయి. ఉక్కు ధరలు తగ్గడానికి దిగుమతులు పెరగడమే ప్రధాన కారణంగా పరిగణిస్తున్నారు. కొన్ని ఉక్కు ఉత్పత్తుల ధరలు చాలా వేగంగా పడిపోయాయి. అవి మూడేళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్టీల్పై దిగుమతి సుంకాన్ని పెంచాలని దేశీయ ఉక్కు తయారీదారులు కోరుతున్నారు. అలాగే.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేదా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఉన్న దేశాలను కూడా ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచిస్తున్నారు.
READ MORE: Mamata Banerjee: ట్రైనీ డాక్టర్పై అత్యాచారం-హత్య కేసును వేగంగా ఛేదించాలి.. పోలీసులకు అల్టిమేటం
Also Read
- Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
- Milky Mist Founder: 16 ఏళ్లకే చదువు మానేసి పనీర్ అమ్ముతూ.. రూ.10 వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు! ఎవరీ సతీష్ కుమార్?
- KCC Loan: రైతులకు గుడ్న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
- PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
ప్రస్తుత ధర ఎంత?
మార్కెట్ పరిశోధన సంస్థ బిగ్మింట్ నివేదిక ప్రకారం..2022 ఏప్రిల్లో టన్ను రూ.76,000 ఉన్న హాట్ రోల్డ్ కాయిల్స్ (హెచ్ఆర్సీ) ధర ఇప్పుడు రూ.51,000 పలుకుతోంది. కోల్డ్ రోల్డ్ కా యిల్స్ (సీఆర్సీ) టన్ను ధర ఇదే కాలంలో రూ.86,300 కోట్ల నుంచి రూ.58,200 కోట్లకు దిగజారాయి.
READ MORE: Venu Swamy: నాగచైతన్య-శోభిత జాతకంను అందుకే చెప్పా.. ఇచ్చిన మాటపై నిలబెడుతా: వేణుస్వామి
దిగుమతి ప్రధాన కారణం..
భారత్లో ఉక్కు ధరలు తగ్గడానికి దిగుమతులు పెరగడమే ప్రధాన కారణం. అందుకే దేశీయంగా ఉక్కు ధరలు మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. “భారతదేశంలో హెచ్ఆర్సీ మరియు సీఆర్సీ రేట్లు మూడేళ్ల కనిష్ట స్థాయికి ట్రేడవుతున్నాయి. దిగుమతుల పెరుగుదల దేశీయ ధరలపై ప్రభావం చూపింది. తద్వారా డిమాండ్పై ప్రభావం చూపింది” అని బిగ్మింట్ తన నివేదికలో పేర్కొంది. జూన్ త్రైమాసికంలో ఉక్కు దిగుమతులు 68% పెరిగి 11.5 కోట్ల టన్నుల నుంచి రూ.19.3 కోట్ల టన్నులకు చేరుకున్నాయి.
READ MORE: Minister Nadendla Manohar: ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం.. 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి సొమ్ము..
డ్యూటీ పెంచాలని డిమాండ్
భారతదేశంలోని కొన్ని అతిపెద్ద ఉక్కు తయారీదారులు ఉక్కుపై దిగుమతి సుంకాన్ని 7.5% నుంచి 12.5%కి మరోసారి పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చైనా నుంచి చౌకగా దిగుమతి అవుతున్న ఉక్కు స్థానిక పరిశ్రమను నాశనం చేస్తోందన్నారు. ఈ కారణంగా.. భారతీయ ఉక్కు తయారీదారుల బ్యాలెన్స్ షీట్ కూడా ఇబ్బందుల్లో ఉంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ సుంకం పెంపుపై వాణిజ్య మంత్రిత్వ శాఖతో కూడా మాట్లాడినట్లు సమాచారం.
తాజావార్తలు
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!