Sheikh Hasina: ప్రభుత్వ పతనానికి అమెరికా కారణం.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
- ప్రభుత్వ పతనానికి అమెరికా కారణమన్న షేక్ హసీనా
- సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించనందుకే పతనం
- విద్యార్థుల మృత దేహాలపై అధికారంలోకి రావాలనుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తమ ప్రభుత్వ పతనానికి అమెరికా కారణమని ఆరోపించారు. బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు వీలుగా ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించనందుకే తనను అధికారం నుంచి తప్పించారని హసీనా ఆరోపించారు. ఛాందసవాదుల వల్ల తప్పుదోవ పట్టవద్దని బంగ్లాదేశ్ పౌరులకు ఆయన విజ్ఞప్తి చేశారు. షేక్ హసీనా ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారని తెలిసిందే.
READ MORE: DoubleiSmart: ప్లీజ్ నాలాగా ఎవరూ చేయకండి : రామ్ పోతినేని
Also Read
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. “నేను మృతదేహాల ఊరేగింపును చూడకుండా ఉండటానికి రాజీనామా చేశాను. విద్యార్థుల మృత దేహాలపై అధికారంలోకి రావాలని వారు కోరుకున్నారు. కానీ నేను దీనిని అనుమతించలేదు. సెయింట్ మార్టిన్ దీవి సార్వభౌమాధికారాన్ని అమెరికాకు అప్పగించి బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు అనుమతి ఇచ్చి ఉంటే నేను అధికారంలో ఉండగలిగేదాన్ని. నా దేశ ప్రజలను నేను అభ్యర్థిస్తున్నాను.” అని ఆమె పేర్కొన్నారు.
“నేను ఇంకా దేశంలో ఉండి ఉంటే, ఎక్కువ మంది ప్రాణాలు పోయేవి. మరిన్ని వనరులు, ప్రజా ఆస్తులు దెబ్బతినేవి. మీరు నన్ను ఎన్నుకున్నారు.. కాబట్టి నేను నాయకురాలిని అయ్యాను. మీరే నా బలం. నా పార్టీ అవామీ లీగ్కు చెందిన పలువురు నాయకులు హత్యకు గురయ్యారని, కార్యకర్తలపై వేధింపులకు గురవుతున్నారు. వారి ఇళ్లను తగులబెట్టారని వార్తలు వస్తున్నాయి. అవి చూసి నా గుండె రోదిస్తున్నది. అల్లా దయతో నేను త్వరలో తిరిగి వస్తాను. సవాళ్లతో పోరాడిన తర్వాత అవామీ లీగ్ మళ్లీ నిలబడేలా చేస్తాను. బంగ్లాదేశ్ భవిష్యత్తు కోసం అల్లాను ప్రార్థిస్తున్నాను. నా గొప్ప తండ్రి కలలు కన్న, దాని కోసం కృషి చేసిన దేశం. నా తండ్రి, కుటుంబం తమ ప్రాణాలను అర్పించిన దేశం.” అని మాజీ ప్రధాని షేక్ హసీనా భావోద్వేగానికి గురయ్యారు.
తాజావార్తలు
-
Sreeleela: శ్రీలీల – తిలక్ వర్మ రిలేషన్షిప్పై షాకింగ్ ట్విస్ట్..!
-
Kumar Sangakkara: “వైభవ్తో క్రికెట్ ముచ్చట్లు పెట్టను”.. బుడ్డోడి సీక్రెట్ లీక్ చేసిన రాజస్థాన్ హెడ్ కోచ్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
-
UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..