Sheikh Hasina: ప్రభుత్వ పతనానికి అమెరికా కారణం.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
- ప్రభుత్వ పతనానికి అమెరికా కారణమన్న షేక్ హసీనా
- సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించనందుకే పతనం
- విద్యార్థుల మృత దేహాలపై అధికారంలోకి రావాలనుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తమ ప్రభుత్వ పతనానికి అమెరికా కారణమని ఆరోపించారు. బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు వీలుగా ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించనందుకే తనను అధికారం నుంచి తప్పించారని హసీనా ఆరోపించారు. ఛాందసవాదుల వల్ల తప్పుదోవ పట్టవద్దని బంగ్లాదేశ్ పౌరులకు ఆయన విజ్ఞప్తి చేశారు. షేక్ హసీనా ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారని తెలిసిందే.
READ MORE: DoubleiSmart: ప్లీజ్ నాలాగా ఎవరూ చేయకండి : రామ్ పోతినేని
Also Read
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. “నేను మృతదేహాల ఊరేగింపును చూడకుండా ఉండటానికి రాజీనామా చేశాను. విద్యార్థుల మృత దేహాలపై అధికారంలోకి రావాలని వారు కోరుకున్నారు. కానీ నేను దీనిని అనుమతించలేదు. సెయింట్ మార్టిన్ దీవి సార్వభౌమాధికారాన్ని అమెరికాకు అప్పగించి బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు అనుమతి ఇచ్చి ఉంటే నేను అధికారంలో ఉండగలిగేదాన్ని. నా దేశ ప్రజలను నేను అభ్యర్థిస్తున్నాను.” అని ఆమె పేర్కొన్నారు.
“నేను ఇంకా దేశంలో ఉండి ఉంటే, ఎక్కువ మంది ప్రాణాలు పోయేవి. మరిన్ని వనరులు, ప్రజా ఆస్తులు దెబ్బతినేవి. మీరు నన్ను ఎన్నుకున్నారు.. కాబట్టి నేను నాయకురాలిని అయ్యాను. మీరే నా బలం. నా పార్టీ అవామీ లీగ్కు చెందిన పలువురు నాయకులు హత్యకు గురయ్యారని, కార్యకర్తలపై వేధింపులకు గురవుతున్నారు. వారి ఇళ్లను తగులబెట్టారని వార్తలు వస్తున్నాయి. అవి చూసి నా గుండె రోదిస్తున్నది. అల్లా దయతో నేను త్వరలో తిరిగి వస్తాను. సవాళ్లతో పోరాడిన తర్వాత అవామీ లీగ్ మళ్లీ నిలబడేలా చేస్తాను. బంగ్లాదేశ్ భవిష్యత్తు కోసం అల్లాను ప్రార్థిస్తున్నాను. నా గొప్ప తండ్రి కలలు కన్న, దాని కోసం కృషి చేసిన దేశం. నా తండ్రి, కుటుంబం తమ ప్రాణాలను అర్పించిన దేశం.” అని మాజీ ప్రధాని షేక్ హసీనా భావోద్వేగానికి గురయ్యారు.
తాజావార్తలు
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!