ఎలాన్ మస్క్ 2002లో అమెరికా పౌరసత్వం పొందారు. చాలాకాలం పాటు ఎలాంటి రాజకీయ పార్టీ ముద్ర పడకుండా ఉన్నారు. ఆయన తనను తాను హాఫ్-డెమొక్రాట్, హాఫ్ రిపబ్లికన్ అనీ, రాజకీయంగా మితవాద, ఇండిపెండెంట్ అంటూ చెప్పుకునేవారు. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్లకు ఓటు వేశానని, అంతేకాకుండా జో బైడెన్కు అయిష్టంగానే ఓటు వేశానని మస్క్ చెప్పారు. కానీ కొన్నేళ్లుగా ఆయన డోనల్డ్ ట్రంప్కు మద్దతిస్తూ వచ్చారు. ట్రంప్ ప్రచారానికి ప్రధాన మద్దతుదారులలో ఒకరిగా ఉన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కి చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా. ఈ కంపెనీ భారత్లో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. చాలా మంది టెస్లా రాక కోసం ఎదురు చూస్తున్నారు. వీరి నిరీక్షణ అతి త్వరలో ముగియబోతోంది. మీడియా నివేదికల ప్రకారం.. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా భారతదేశంలో తన మొదటి షోరూమ్ కోసం స్థలాన్ని చూసింది. షోరూమ్ కోసం కంపెనీ దాదాపు 4,000 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుంది.
నేడు యూపీఐ చెల్లింపులు జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయాయి. ఆన్లైన్ షాపింగ్ కు మాత్రమే కాకుండా.. చిన్న చిన్న కిరాణా సామన్లు కొనుగోలు చేసేందుకు కూడా ఈ చెల్లింపు విధానాన్ని ఉపయోగిస్తున్నాం. భారతదేశాన్ని ‘న్యూ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’గా మార్చడానికి ఇది చాలా ముఖ్యమైన సాధనం. ఇప్పటికే జనాలు ఈ యూపీఐ చెల్లింపు విధానానికి అలవాటు పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్ విధానం మొదలు పెట్టింది.
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్లో కేంద్రం ‘రాష్ట్రపతి పాలన’ విధించిన విషయం విదితమే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే పాలనా బాధ్యతలు రాష్ట్ర పతి చేతుల్లోకి వచ్చాయి. నేడు అక్కడి పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు.
బాలీవుడ్ నటి అలియా భట్ తన కూతురు రియా చిత్రాలను సోషల్ మీడియా నుంచి తొలగించింది. ఇన్స్టాగ్రామ్లో నటిని ఫాలో అవుతున్న యూజర్లు.. అలియా తన కూతురి ఫోటోలన్నింటినీ తొలగించినట్లు గమనించారు. నటి అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందని అనుచరులు తమదైన రీతిలో ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. అలియా వెళ్లిన జామ్నగర్ ట్రిప్, పారిస్ ట్రిప్ లకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు తన ఖాతాలో కనిపించడం లేదు. ఈ అంశం ప్రస్తుతం రెడ్డిట్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రతిభ, పట్టుదలకు సలాం కొట్టాల్సిందే. ఐదు దశాబ్దాలుగా ఆయన యాక్టింగ్తో అభిమానులను కట్టి పారేశారు. చిత్ర పరిశ్రమలో "బిగ్ బీ" అని ముద్దుగా పిలువబడే ఆయన లెక్కలేనన్ని హిట్లను అందించారు. 82 ఏళ్లు దాటింది. ఇప్పటికీ ఆయన యాక్టింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటి ప్రజలకు ఆయన సక్సెస్ మాత్రమే తెలుసు. కానీ.. 90లలో బిగ్ బీ పడిన ఇబ్బందుల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం పాలైన విషయం విదితమే. మృతదేహాలను బయటకు తీసుకొచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాయంత్రంలోపు మృతదేహాలను వెలికి తీసేందుకు ముమ్మర ప్రయాత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 5 మృతదేహాలను బయటకు తీసినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూసినప్పుడు మన ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. కొన్నింటిలో ప్రజల సృజనాత్మకత మనల్ని అబ్బుర పరుస్తుంది. అదే వీడియోను ఓ సెలబ్రిటీ షేర్ చేస్తే.. ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. తాజాగా అలాంటి ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోను బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ షేర్ చేశారు. ఇందులో కొంతమంది పిల్లలు సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని తయారు చేశారు. ఈ టూ వీలర్లో ఒకేసారి 7…
మహిళల్లో చాలా మందికి నెల వారీ రుతుక్రమం సమయంలో నొప్పి వస్తుంది. సాధారణంగా ఈ నొప్పి పొత్తికడుపు కండరాలు పట్టేసినట్లుగా ఉంటుంది. ఆ నొప్పి అక్కడి నుంచి వీపు మీదకు, తొడలకు, కాళ్లకు, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించవచ్చు. పీరియడ్ సమయంలో ఈ నొప్పి ఓ మాదిరిగా, హెచ్చుతగ్గులు లేకుండా ఉండవచ్చు.
స్కైప్ విషయంలో మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మే నెల నుంచి ఆ కంపెనీ స్కైప్ను శాశ్వతంగా మూసి వేయబోతోంది. 22 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణానికి తెరపడనుంది. స్కైప్ 2003 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VOIP) ప్లాట్ఫామ్గా ఉద్భవించింది. 2011లో, మైక్రోసాఫ్ట్ దీనిని $8.5 బిలియన్లకు కొనుగోలు చేసింది.