Amit Shah: ఇక ఉపేక్షించకండి.. మణిపుర్ పరిస్థితిపై అమిత్ షా కీలక ఆదేశాలు..
- అట్టుడుకుతున్న మణిపుర్
- ఇటీవల సీఎం రాజీనామా
- రాష్ట్రంలో రాష్ట్ర పతి పాలన విధింపు
- నేడు పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి సమీక్ష
- కీలక ఆదేశాలు జారీ చేసిన అమిత్ షా
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్లో కేంద్రం ‘రాష్ట్రపతి పాలన’ విధించిన విషయం విదితమే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే పాలనా బాధ్యతలు రాష్ట్ర పతి చేతుల్లోకి వచ్చాయి. నేడు అక్కడి పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఇక ఇరు వర్గాలకు మధ్య చర్చలు జరిగే సమయంలో అడ్డంకులు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని.. అలాంటి వారికి కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించారు. గతంలో పరిస్థితులు చక్కబెట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా సార్లు సమీక్ష నిర్వహించారు. అయితే రాష్ట్ర పతి పాలన తర్వాత జరిగిన మొదటి సమీక్ష ఇది. ఈ సమావేశం నేడు ఢిల్లీ కేంద్రంగా జరిగింది. మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ఉన్నతాధికారులు, ఆర్మీ, పారామిలటరీ అధికారులు ఈ సమావేశానికి హాజరై చర్చలు జరిపారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
కాగా..ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్లో దాదాపు రెండేళ్లుగా జాతి హింస చెలరేగుతోంది. కానీ, పరిస్థితిలో ఏ మార్పూ లేదు. రాష్ట్రం అగ్నిగుండలా రగిలిపోతోంది. మెయ్తెయి, కుకి తెగల మధ్య రాజుకున్న హింసలో ఇప్పటివరకు వందలాది మంది ప్రాణాలు వదిలారు. వేల సంఖ్యలో గాయాలపాలైనట్లు సమాచారం. కానీ, హింస ఆగడం లేదు. మణిపుర్లోని మెయితెయి తెగ ప్రజలు తమను షెడ్యూల్డ్ తెగలలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఇక్కడ వివాదానికి దారితీసింది. 2023 మే 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రంలో భీకర హింస చెలరేగింది. మెయితెయిలు కుకిలను, కుకిలు మెయితెయిల స్థలాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటికీ హింస అలాగే కొనసాగుతోంది. ఎన్ని సార్లు చర్చలు జరపాలని చూసినా ఫలితం లభించలేదు.
READ MORE: Alia Bhatt: ఆలియా భట్ ఆకస్మిక నిర్ణయం.. ఎందుకు ఇలా చేసింది?
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!