ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓ పోస్ట్ను పంచుకున్నారు. 'ఇది వెళ్ళే సమయం...' అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు కంగారు పడ్డారు. సోషల్ మీడియాలో రిటైర్మెంట్పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ ఊహాగానాలకు, తాను చేసిన ట్వీట్కు అమితాబ్ బచ్చన్ క్లారిటీ ఇచ్చారు.
ప్రముఖ నటి, మాజీ రాజ్యసభ, లోక్ సభ సభ్యురాలు జయప్రద ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు రాజబాబు (65) ఈరోజు (ఫిబ్రవరి 28) మధ్యాహ్నం అనారోగ్యంతో కన్నుమూశారు. రాజబాబు నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3.26 గంటలకు తుదిశ్వాస విడిచారు.
సినీ సెలబ్రేటీలు పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత రాజకీయం వైపు వెళ్లాలను కుంటారు. కొందరు ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంటారు. బాలీవుడ్ లో నటులే కాకుండా నటీమణులు సైతం రాజకీయంలో సత్తాచాటుతున్నారు. దీనికి ఉదాహరణ కంగనా రనౌత్.. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రీతి జింటాకు ఓ ప్రశ్న ఎదురైంది
మల్లూవుడ్.. సస్పెన్స్, క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకుటోంది. ఈ ఏడాది జనవరిలో వచ్చిన స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ రేఖా చిత్రం.. రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను చేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన "ఆఫీసర్ ఆన్ డ్యూటీ" కూడా అదే ఫ్లోలో దూసుకుపోతోంది. మాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన కుంచాకో బోబన్ ఈ సినిమాలో తన ప్రతిభ కనబరిచాడు.
ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఫిబ్రవరి 2025కి సంబంధించి అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ నెలలో కంపెనీ 25,000 యూనిట్లను విక్రయించింది. ఇది గత ఏడాది ఫిబ్రవరి కంటే 25.86% తక్కువ. ఫిబ్రవరి 2024లో కంపెనీ 33,722 యూనిట్లను అమ్మింది. అయితే, అమ్మకాలు తగ్గినప్పటికీ.. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికీ భారతదేశ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో 28% మార్కెట్ వాటాతో అతిపెద్ద కంపెనీగా కొనసాగుతోంది.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని సంఘటనలు ప్రజలను నవ్విస్తాయి. మరి కొన్ని నెటిజన్లను ఆశ్చర్యపరుస్తాయి. ఇలాంటి ఓ ఆశ్చర్య పరిచే ఘటన చైనాలో జరిగింది. వాయువ్య చైనాలోని మంచు పర్వతంపై 18 ఏళ్ల యువకుడు 10 రోజుల పాటు మంచులో చిక్కుకున్నాడు.
తనను తాను టైమ్ ట్రావెలర్ అని చెప్పుకునే ఓ వ్యక్తి 2025 సంవత్సరానికి సంబంధించి కొన్ని షాకింగ్ అంచనాలు వేశాడు. ఆయన చెప్పిన మాటలపై ఇంటర్నెట్లో చర్చ జరుగుతోంది. టైమ్ ట్రావెలర్ అని చెప్పుకునే ఎల్విస్ థాంప్సన్ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆయన కొన్ని తేదీలను సైతం ప్రస్తావించారు.
విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై రెచ్చిపోవడం కామన్ అయిపోయింది. విధులకు ఆటంకం కలిగిస్తే.. తర్వాత జరిగే పరిణామాల గురించి ఆలోచించడం లేదు. రాజకీయ నాయకులు, ప్రముఖుల అండతో పబ్లిక్లోనే పోలీసులపై చిందులేస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్లో చోటు చేసుకుంది. పంజాగుట్ట లో కారు ఓనర్ హల్చల్ సృష్టించాడు. పెండింగ్ చలానాలు చెక్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కారు ఆపారు. నాలుగు వేల పెండింగ్ చలానాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 ఎఫ్ 3 సినిమాలు మంచి హిట్లుగా నిలిచాయి. ఇక వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమా మీద ఆసక్తి ఉంది. ఆయా ఆసక్తిని మరింత పెంచే విధంగా సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పెట్టారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్లో మిగతా సంక్రాంతి సినిమాల కంటే ముందు వరుసలో నిలిచింది. ఆడియో సూపర్ హిట్ కావడం, డిజిటల్…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూర్య అభిమానులను డిసప్పాయింట్ చేసింది. సూర్య సతీమణి జ్యోతిక కూడా ఫస్టాఫ్ బాలేదని స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు హిట్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజుతో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈమూవీ చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది.