Skype Shutting Down: 22 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణానికి తెర.. స్కైప్కు మైక్రోసాఫ్ట్ గుడ్బై!
- మే నెల నుంచి స్కైప్ కి గుడ్బై
- 22 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి తెర
- 2003 ఏడాదిలో స్కైప్ ప్రారంభం
- 2011లో కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్
స్కైప్ విషయంలో మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మే నెల నుంచి ఆ కంపెనీ స్కైప్ను శాశ్వతంగా మూసి వేయబోతోంది. 22 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణానికి తెరపడనుంది. స్కైప్ 2003 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VOIP) ప్లాట్ఫామ్గా ఉద్భవించింది. 2011లో, మైక్రోసాఫ్ట్ దీనిని $8.5 బిలియన్లకు కొనుగోలు చేసింది. దీని తరువాత.. మైక్రోసాఫ్ట్ క్రమంగా ఈ ప్లాట్ఫామ్ కి మార్పులు చేస్తూ వచ్చింది. ఇటీవల ఆ కంపెనీ విండోస్ లైవ్ మెసెంజర్ను తొలగించింది. 2015 లో, మైక్రోసాఫ్ట్ స్కైప్ను విండోస్ 10 లో అనుసంధానించడానికి ప్రయత్నించింది. అయితే.. దాన్ని తొమ్మిది నెలల్లోనే మూసివేయాల్సి వచ్చింది. మైక్రో సాఫ్ట్ టీమ్స్లో వీడియో కాల్స్, చాట్స్ చేసుకోవాలని ఆ సంస్థ సూచించినట్లు తెలిసింది.
READ MORE: Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన విద్యార్థి నేత కొత్త రాజకీయ పార్టీ..
Also Read
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
- iQOO 9 SE: 48MP OIS కెమెరా + 120Hz AMOLED - ఐకూ 9 SE ఇప్పుడు అతి చౌకగా! డీల్ మిస్ కాకండి!
- Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
ఆపిల్ కి చెందిన iMessage తో పోటీ పడగలిగేలా మైక్రోసాఫ్ట్ స్కైప్ను అనేకసార్లు పునఃరూపకల్పన చేసింది. అయినా లాభం లేకపోవడంతో చివరికి ఈ నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ 2017 సంవత్సరంలో టీమ్స్ను ప్రవేశపెట్టింది. కంపెనీల కమ్యూనికేషన్ల కోసం స్లాక్ వంటి ప్లాట్ఫామ్లతో పోటీ పడటానికి టీమ్స్ను ప్రత్యేకంగా సృష్టించింది. అప్పటి నుంచి స్కైప్ అంతర్గతంగా పోటీ ఎదుర్కొంటూ వచ్చింది. ఇలా రాను రాను స్కైప్ కి ఆదరణ తగ్గింది. మైక్రోసాఫ్ట్ సంస్థ స్కైప్ను శాశ్వతంగా మూసేస్తుందన్న వాదనలు వినిపించాయి. కోవిడ్-19 మహమ్మారి తర్వాత కంపెనీ స్కైప్ను పట్టించుకోవడం మానేసింది. ఇప్పటివరకు స్కైప్ వాడుతున్న వారు టీమ్స్కు మారాల్సి ఉంటుంది. ఇప్పటికే కొందరికీ టీమ్స్కు మారారని మెసేజ్లు కూడా వచ్చాయి. టీమ్స్ నుంచే వీడియోకాల్స్ వంటి కార్యకలాపాలు కొనసాగించాలని అందులో సూచించారు.
READ MORE: Posani Krishna Murali: పోసాని కృష్ణమురళిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్..
తాజావార్తలు
-
DC Vs RCB: చెత్త రికార్డు మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. 6 ఓవర్లలోపే చేతులెత్తేశారుగా..
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!