-
Citroën India: టాటా కర్వ్ తో పోటీ పడుతున్న ఈ కారుపై రూ.2.80 లక్షలు తగ్గింపు..! 31 వరకే ఛాన్స్..
ప్రతి నెలా ఆటో కంపెనీలు తమ కార్ల ధరలను తగ్గిస్తూ.. కస్టమర్లకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయి. భారత్లో అగుడు పెట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. సిట్రోయెన్ ఇండియా కూడా గొప్ప ఆఫర్తో ముందుకు వచ్చింది. ఈ కంపెనీ మొట్టమొదటి ప్రసిద్ధ కూపే ఎస్యూవీ సిట్రోయెన్ బసాల్ట్పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఎస్యూవీపై మాత్రమే కాకుండా.. C3, EC3, ఎయిర్క్రాస్ వంటి మోడళ్లకు కూడా మంచి ప్రయోజనాలు కల్పించారు. -
Child Marriage: మరీ ఇంత దారుణమా..? 6 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల వ్యక్తి..
45-Year-Old Man Marries 6-Year-Old Girl: ఆఫ్ఘనిస్తాన్ వంటి కొన్ని దేశాలలో బాల్య వివాహాలు కొత్తేం కాదు. అయితే, ఇటీవల ఇక్కడ ఓ బాల్య వివాహ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసింది. ఆఫ్ఘనిస్తాన్లోని హెల్మండ్ ప్రావిన్స్లో 45 ఏళ్ల వ్యక్తి ఆరేళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. -
Hyderabad: కల్తీ కల్లు బాధితులు హెల్త్ బులిటెన్ విడుదల.. సంచలన విషయాలు వెల్లడి..
కల్తీకల్లు కారణంగా చికిత్స పొందుతున్న బాధితుల హెల్త్ బులిటెన్ను నిమ్స్ వైద్యులు విడుదల చేశారు. చికిత్స పొందుతున్న వారిలో కిడ్నీ బాధితులు సంఖ్య పెరుగుతోందని.. కిడ్నీ పని చేయని వారి సంఖ్య 9 మందికి చేరిందని తెలిపారు. మరో ఇద్దరు బాధితులకు కూడా డయాలసిస్ చేయాల్సి పరిస్థితి ఉన్నట్లు వెల్లడించారు. చికిత్స పొందుతున్న వారిలో 11 మంది ఆరోగ్యంగా నిలకడగా ఉన్నట్లు వైద్యలు వెల్లడించారు. -
Hyundai July 2025 offer: ఈ హ్యుందాయ్ కారుపై ఏకంగా రూ. 85 వేలు తగ్గింపు..! త్వరపడండి..
Hyundai Venue July 2025 offer: జూలై నెలలో హ్యుందాయ్ కంపెనీ వివిధ మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ కంపెనీకి చెందిన రెండవ బెస్ట్ సెల్లింగ్ కారు హ్యుందాయ్ వెన్యూపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తున్నారు. జూలై 2025లో హ్యుందాయ్ వెన్యూ కొనుగోలు చేస్తే.. ఏకంగా రూ. 85,000 వరకు ఆదా అవుతుంది. నగదు తగ్గింపుతో పాటు, ఈ ఆఫర్లో ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. డిస్కౌంట్ గురించి మరిన్ని వివరాల కోసం.. కస్టమర్లు తమ సమీప డీలర్షిప్ను సంప్రదించవచ్చు. హ్యుందాయ్ వెన్యూ ఫీచర్లు,… -
Ajit Doval: “భారత్ నష్ట పోయినట్లు ఒక్క ఫొటో చూపించండి”.. మీడియాపై అజిత్ దోవల్ ఫైర్..
చెన్నైలో జరిగిన ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని అజిత్ దోవల్ వివరించారు. భారతదేశం నష్టాన్ని చూపించే ఒక్క చిత్రాన్ని అయినా తనకు చూపించాలని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పలు విదేశీ మీడియా సంస్థలు పాకిస్థాన్ భారత్లోని పలు ప్రాంతాలను ధ్వంసం చేశాయని కథనాలు రాశాయి. ఈ అంశంపై తాజాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పందించారు. -
HYD Drugs: ఐటీ సిటీ.. హైదరాబాద్ డ్రగ్స్కు అడ్డాగా మారుతోందా..?
యువత మత్తుకు బానిసవుతోంది. లిక్కర్ తర్వాత .. గంజాయి, డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ డ్రగ్ కల్చర్ వెర్రితలలు వేస్తోంది. పబ్స్ మాటున యువతకు నిత్యం డ్రగ్స్ సప్లై అవుతున్నాయి. మాదక ద్రవ్యాలు యువతను మత్తులో ముంచేస్తున్నాయి. బంగారం లాంటి భవిష్యత్తును ఛిద్రం చేస్తున్నాయి. వీటికి అవుననే సమాధానాలు వస్తున్నాయి. సిటీలో ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ గలీజ్ దందాకు పబ్స్ కేరాఫ్ అడ్రస్గా మారాయి. ఇది హైదరాబాద్లో ఎవరిని అడిగినా చెప్పేస్తారు. గంజాయి లాంటి… -
Mahavatar Narasimha Trailer: ట్రైలర్ రిలీజ్.. నరసింహుడి ఉగ్రరూపం చూస్తే గూస్బంప్స్ పక్కా..!
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. 'కేజీయఫ్', 'సలార్' వంటి భారీ యాక్షన్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంస్థ నుంచి వస్తున్న మొట్టమొదటి యానిమేషన్ చిత్రం 'మహావతార్ నరసింహ'. అశ్విన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 25న 3డీ ఫార్మాట్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
Hyderabad: హైదరాబాద్లో కల్తీ కల్లు కలకలం.. ఆరుకి చేరిన మృతుల సంఖ్య..?
హైదరాబాద్లో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరినట్లు తెలుస్తోంది. తాజాగా కల్తీ కల్లు సేవించి వాంతులు, విరోచనాలతో కూకట్పల్లి రాందేవ్ రావు ఆసుపత్రికి వచ్చే లోపే మౌనిక(25) అనే యువతి మృతి చెందింది. కానీ ముగ్గురు మాత్రమే మరణించినట్లు అధికారికంగా వెల్లడించారు. సీతారం, స్వరూప, మౌనిక మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. నారాయణమ్మ, బొజ్జయ్య అనే ఇద్దరు కూడా కల్తీ కల్లు తాగడం వల్లే చనిపోయినట్లు తెలుస్తోంది. -
CM Revanth Reddy: “ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాక్ అసెంబ్లీ పెడదాం.. నేనూ వస్తా”.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
ఓట్లు అన్నీ నీకు వేస్తే.. నీళ్ళు రాయలసీమకు ఇచ్చారు కేసీఆర్ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా.. తెలంగాణలో ఆయనకట్టు ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. నల్గొండకు కోతలు... రంగారెడ్డి కి నీళ్ళు ఇవ్వలేదన్నారు.. గోదావరి నీళ్లు రాయలసీమ తీసుకుపోతే తప్పులేదు అన్నారని చెప్పారు. పొద్దున్న క్లబ్.. రాత్రి ఐతే పబ్బుల్లో చర్చ చేయాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. -
CM Revanth Reddy: ఆంధ్రా పక్షాన పాలేరు అయ్యారా..? కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్..
తెలంగాణ ఉద్యమంలో సర్వం ఒడ్డి కొట్లాడిన వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారని.. పార్టీల కంటే ప్రజల అవసరాలు ముఖ్యం అని చెప్పే వాళ్లే ఇక్కడ ఉన్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలపై ప్రగతి భవన్లో తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అజెండా ఎలా ఉంది.. రాజకీయ ఆర్థిక ప్రయోజనం ఏం పొందారు అనేది చర్చనీయాంశం కాదని.. ఇక్కడ తొమ్మిదిన్నరేళ్ళు.. కేసీఆర్ కుటుంబమే ఇరిగేషన్ శాఖ చూసిందన్నారు. ఐదేళ్లు…
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!