DGP: డీజీపీని కలిసిన రాజ లింగమూర్తి భార్య.. సీబీఐ విచారణ కోరుతూ వినతి
- సీబీఐ విచారణ కోరుతూ లేఖ
- తన భర్త హత్య వెనుక బీఆర్ఎస్ నేతలున్నారని ఆరోపణ
- విచారణ జరిపించాలని వినతి
తీవ్ర సంచలనం సృష్టించిన భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి (52) హత్య.. రాజకీయ దుమారం రేపుతోంది. ఈ హత్య వెనుక బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం హస్తం ఉందంటూ మృతుడి భార్య సరళ ఆరోపించడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. రాజలింగమూర్తి గతంలో పలు భూ వివాదాలు, ప్రజా సమస్యలపై కోర్టుల్లో కేసులు వేయడం, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ఏడో బ్లాకు కుంగుబాటుపై అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ప్రాజెక్టు ఇంజనీర్లపైనా కోర్టులో పిటిషన్ దాఖలు వేయడం కూడా ఆరోపణలకు కారణమైంది. తాజాగా రాజ లింగమూర్తి భార్య మరో అడుగు వేసింది.
READ MORE: Donald Trump: కెనడాకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్.. ఏకంగా 50 శాతం టారిఫ్..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
తెలంగాణ రాష్ట్ర డీజీపీని రాజలింగమూర్తి భార్య సరళ కలిశారు. తన భర్త రాజలింగమూర్తి హత్యపై సీబీఐ విచారణ కోరుతూ డీజీపీకి వినతి పత్రం సమర్పించారు. తన భర్త హత్య వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర, బీఆర్ఎస్ నేత హరిబాబు ఉన్నారని ఆరోపించారు. అనుమానితులపై కేసు పెట్టకుండా భూపాలపల్లి డీఎస్పీ తప్పుదోవ పట్టించారని లేఖలో పేర్కొన్నారు.
మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్పై కేసు వేసినందుకు అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి బెదిరించాడని పేర్కొన్నారు. ఎవరితోనో పిటిషన్ రాయించి తన సంతకం తీసుకున్నారని సరళ తెలిపారు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. తన భర్త రాజలింగమూర్తి హత్య కేసును సీబీసీఐడీ లేదా సీబీఐలకు అప్పజెప్పాలని కోరారు.
READ MORE: Donald Trump: కెనడాకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్.. ఏకంగా 50 శాతం టారిఫ్..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో