ప్రస్తుతం పాకిస్థాన్ అన్ని వైపుల నుంచి అవమానాలు ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్లో జరిగిన రైలు హైజాక్ సంఘటనపై ఒకవైపు రష్యా, ఆఫ్ఘనిస్తాన్ వంటి స్నేహపూర్వక దేశాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు, పాకిస్థాన్ వైఖరిపై భారత్ కూడా మండిపడింది. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్లో భారతదేశ ప్రమేయం ఉందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ చేస్తున్న ఈ నిరాధారమైన అర్థంలేని ప్రచారాన్ని భారతదేశం తీవ్రంగా తిరస్కరించింది.
గ్రూప్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు విడుదల చేసింది. డిసెంబర్ 2022 లో 1388 పోస్ట్ భర్తీకి గ్రూప్ -3 నోటిఫికేషన్ విడుదలవగా.. 5 లక్షల 36 వేల 400 మంది దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. 2 లక్షల 69 వేల 483 మంది (50.24 శాతం) పరీక్ష రాశారు. ఫలితాలతో పాటే ఫైనల్ కీ, అభ్యర్థుల లాగిన్ ఐడీలకు OMR షీట్స్ కూడా పంపించారు. టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in/ లో…
దేశమంతటా అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుగుతున్నాయి. జనమంతా రంగుళకేళిలో తేలియాడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు వాటర్ గన్లను తీసుకుని రంగులు జల్లుకుంటూ ఉత్సాహాన్ని పంచుకుంటున్నారు. కాగా.. ఉత్తర్ప్రదేశ్లోని సంభాల్లో మాత్రం 46 ఏళ్ల తర్వాత హోలీ ఘనంగా నిర్వహించారు. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా నగరంలోని కార్తికేయ ఆలయంలో హోలీ వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు, హిందువులు ఒకరినొకరు గులాల్ పూసుకుంటూ.. సంబరాలు జరుపుకున్నారు.
దేశవ్యాప్తంగా నేడు హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లో జనాల మధ్య పండుగను ఘనంగా జరుపుకున్నారు.
రేపు (శుక్రవారం మార్చి14)న ఆమిర్ ఖాన్ పుట్టిన రోజు. అయితే ఒక రోజు ముందుగానే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నటుడు ఆమిర్ ఖాన్ ముంబైలోని న్యూస్ రిపోర్టర్లు, ఫొటో గ్రాఫర్లు, అభిమానులతో కలిసి పుట్టిన రోజు వేడుక జరుపుకున్నారు. అందరి ముందు కేక్ కోసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నెలల తరబడి ఊహాగానాల తర్వాత..
టాలీవుడ్ యాక్షన్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాలు తీసిన ఆది నటన పరంగా తండ్రి పేరు నిలబెట్టాడు. దీంతో తెలుగులో అతనికి మంచి గుర్తింపు లభించింది. ఇక తాజాగా ఆది ‘షణ్ముక’ అనే థ్రిల్లింగ్ కథతో రాబోతున్నాడు. అవికాగోర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకత్వం వహిస్తుండగా.. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘షణ్ముక’ ఈ నెల…
రెండేళ్లుగా ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానులకు శుభవార్త. ‘ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో ఓ సక్సెస్ ను అందుకున్న హీరో అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల క్రితం తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా ఎట్టకేలకు స్ట్రీమింగ్కు వచ్చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం అనుకున్నంత రీతిలో సక్సెస్ సాధించలేక పోయింది.
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ ‘దిల్ రూబా’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఇది 10వ సినిమా. దీనిని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ , ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మించాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ఈ సినిమాను రూపొందించారు.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నటుడు ఆమిర్ ఖాన్ అభిమానులకు రేపు చాలా ప్రత్యేకమైన రోజు. ఒకవైపు.. దేశం మొత్తం రేపు హోలీ రంగులలో మునిగిపోతుండగా మరోవైపు, ఆమిర్ తన 60వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. రేపు అంటే మార్చి 14న అమీర్ పుట్టినరోజు. ఈ నటుడు తన పుట్టినరోజుకు ఒక రోజు ముందు ముంబైలో అభిమానులు, ఫొటో గ్రాఫర్లతో కలిసి తన పుట్టినరోజును జరుపుకున్నాడు.
బాలీవుడ్ నటి ఆలియా భట్ తన కూతురు రియా చిత్రాలను ఇటీవల సోషల్ మీడియా నుంచి తొలగించింది. ఇన్స్టాగ్రామ్లో నటిని ఫాలో అవుతున్న యూజర్లు.. ఆలియా తన కూతురి ఫోటోలన్నింటినీ తొలగించినట్లు గమనించారు. నటి అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందని అనుచరులు తమదైన రీతిలో ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలియా వెళ్లిన జామ్నగర్ ట్రిప్, పారిస్ ట్రిప్ లకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు తన ఖాతాలో కనిపించడం లేదు. తాజాగా ఈ అంశంపై ఆలియా క్లారిటీ ఇచ్చింది. మీడియాతో మాట్లాడిన ఆమె తన…