UP: సంభాల్లో 46 ఏళ్ల తర్వాత హోలీ.. మసీదు ముందు నుంచి డీజే ఊరేగింపు(వీడియో)
- దేశమంతటా ఘనంగా హోలీ
- యూపీలోని సంభాల్లో 46ఏళ్ల తర్వాత పండుగ
- ఘనంగా నిర్వహించుకున్న హిందువులు
- భారీగా పోలీసు బందోబస్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశమంతటా అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుగుతున్నాయి. జనమంతా రంగుళకేళిలో తేలియాడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు వాటర్ గన్లను తీసుకుని రంగులు జల్లుకుంటూ ఉత్సాహాన్ని పంచుకుంటున్నారు. కాగా.. ఉత్తర్ప్రదేశ్లోని సంభాల్లో మాత్రం 46 ఏళ్ల తర్వాత హోలీ ఘనంగా నిర్వహించారు. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా నగరంలోని కార్తికేయ ఆలయంలో హోలీ వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు, హిందువులు ఒకరినొకరు గులాల్ పూసుకుంటూ.. సంబరాలు జరుపుకున్నారు. హోలీ ఊరేగింపు సంభాల్లోని ఒక మసీదు ముందు నుంచి సాగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
READ MORE: Minister Nimmala Ramanaidu: జూన్ నాటికల్లా లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు..
Also Read
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- Healthy Breakfast Recipe: రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఇదే బెస్ట్ బ్రేక్ఫాస్ట్..! ప్రోటీన్ అధికంగా ఉండే శనగ చాట్ ఇలా ట్రై చేయండి..
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
వాస్తవానికి.. భస్మ శంకర్ ఆలయం అని కూడా పిలువబడే కార్తీక్ మహాదేవ్ దేవాలయం 1978లో మూసేశారు. మత అల్లర్లు నగరాన్ని కుదిపివేసిన తరువాత.. ఆలయం మూతపడింది. ఈ ఆయంలో46 సంవత్సరాల తర్వాత డిసెంబర్ 13, 2024న తిరిగి తెరిచారు. ఈ దేవాలయానికి విముక్తి కలిగిన తర్వాత వచ్చిన మొదటి హోలీ ఇది. అందుకే భక్తులు, హిందువులు పెద్ద ఎత్తున డీజే చప్పుళ్లతో నగర పుర వీధులు గుండా డ్యాన్స్లు చేస్తే ఘనంగా హోలీ నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
READ MORE: CM Yogi: హోలీ సందర్భంగా హిందువులకు సీఎం యోగి కీలక సందేశం!
ఇటీవల సంభాల్ పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. ‘‘హోలీ ఏడాదికి ఒకసారి వస్తుంది. శుక్రవారం నమాజ్ 52 సార్లు చేసుకోవచ్చు. ఎవరికైనా హోలీతో ఇబ్బంది ఉంటే ఇంట్లోనే ఉండండి.’’ అని సంభాల్ పోలీస్ అధికారి అనుజ్ చౌదరి అన్నారు. దీనిపై రాజకీయ విమర్శలు వచ్చాయి. సంభాల్లోని వివాదాస్పద జామా మసీదుతో పాటు మరో 10 మసీదులను టార్పలిన్లతో కప్పారు. పోలీసులు భారీ బందోబస్తు మధ్య రెండు మతాల పండుగలు సామరస్యంగా జరుపుకుంటున్నారు.
#WATCH | #Holi procession underway in Uttar Pradesh's Sambhal as the festival of colour is being celebrated today across India with great enthusiasm pic.twitter.com/eYwETKL8om
— ANI (@ANI) March 14, 2025
తాజావార్తలు
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2026 Playoffs Scenario: కేకేఆర్ సెన్సేషనల్ విక్టరీ.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప!
-
BMW Vision K18: భవిష్యత్ హై-పర్ఫార్మెన్స్ టూరింగ్ బైక్.. బీఎండబ్ల్యూ విజన్ K18 ఆవిష్కరణ
-
Tilak Varma – Sreeleela : శ్రీలీల – తిలక్ వర్మ.. టీ20 లవ్..?
-
iQOO 15T: ఐకూ 15T వచ్చేస్తోంది.. 200MP ప్రధాన కెమెరా, 8000mAh బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..