Pakistan vs England: పాకిస్థాన్కు బిగ్ షాక్.. సెమీఫైనల్కు చేరాలంటే పాక్ ముందున్న దారులు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan vs England: పాకిస్థాన్కు భారీ ఎదురు దెబ్బ తగిలించింది. ఇంగ్లండ్తో కీలక మ్యాచ్ను పాక్ కోల్పోయింది. టీ20 వరల్డ్కప్ సూపర్–8లో ఇంగ్లండ్తో రెండు వికెట్ల తేడాతో ఓడిపోవడం వల్ల సెమీఫైనల్ ఆశలు క్లిష్టంగా మారాయి. 165 పరుగుల టార్గెట్ను ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో ఛేజ్ చేయగా, కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత శతకం మ్యాచ్ను తమ వైపునకి తిప్పింది. 51 బంతుల్లో చేసిన ఈ సెంచరీ కేవలం మ్యాచ్ గెలిపించడమే కాదు.. ఇంగ్లండ్ను నేరుగా సెమీఫైనల్కు చేర్చింది. రెండు మ్యాచ్ల్లో నాలుగు పాయింట్లతో గ్రూప్–2 నుంచి ముందుగా అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. మరోవైపు రెండు మ్యాచ్ల్లో ఒక్క పాయింట్తో ఉన్న పాకిస్థాన్కు చివరి మ్యాచ్ “డూ ఆర్ డై”గా మారింది. ఇంతకీ పాకిస్థాన్కు సెమీఫైనల్ ఆశలు ఉన్నాయా? అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం..
READ MORE: OTT: ఓటీటీ లవర్స్ కు షాక్.. ఐదు OTT ప్లాట్ఫామ్లను బ్లాక్ చేసిన కేంద్రం.. లిస్ట్ లో ఉన్నవి ఇవే
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ప్రస్తుతం గ్రూప్లో ఇంగ్లండ్ టాప్లో ఉంది. న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్తో ఒక పాయింట్, పాకిస్థాన్ రెండు మ్యాచ్లతో ఒక పాయింట్ సాధించడగా.. శ్రీలంక ఇంకా ఖాతా తెరవలేదు. ఇక మిగిలిన మ్యాచ్లు మొత్తం సమీకరణాన్ని మార్చబోతున్నాయి. న్యూజిలాండ్–శ్రీలంక, న్యూజిలాండ్–ఇంగ్లండ్, పాకిస్థాన్–శ్రీలంక మ్యాచ్లు గ్రూప్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే శ్రీలంకపై తప్పక గెలవాలి. అలా గెలిస్తే మూడు పాయింట్లు వస్తాయి. కానీ ఈ గెలుపు సైతం పాకిస్థాన్కు సరిపోదు. పాకిస్థాన్ సెమీస్కు చేరాలంటే.. ఇతర మ్యాచ్లపై ఆధారపడక తప్పదు. ఇంగ్లండ్ న్యూజిలాండ్ను ఓడించాలి. అలాగే శ్రీలంక న్యూజిలాండ్పై గెలవాలి. అప్పుడు పాకిస్థాన్ (3), శ్రీలంక (2), న్యూజిలాండ్ (1) పాయింట్లు వస్తాయి. దీంతో పాక్ రెండో స్థానంలో సెమీఫైనల్కు చేరుతుంది.
READ MORE: T20 World Cup 2026: ఉత్కంఠ పోరులో పాక్ ఓటమి.. సెమీఫైనల్కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్
ఇదిలా ఉండగా.. ఒకవేళ న్యూజిలాండ్ తమ మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఒకటి గెలిచి ఒకటి ఓడిపోతే, పాకిస్థాన్ శ్రీలంకపై గెలిచినట్లయితే రెండు జట్లు మూడు పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు నెట్ రన్రేట్ కీలకమవుతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్కు ఎన్ఆర్ఆర్ మెరుగ్గా ఉండటం పాక్కు సమస్యగా మారింది. అయితే శ్రీలంక చేతిలో ఓడిపోతే మాత్రం పాకిస్థాన్ టోర్నమెంట్ నుంచి నేరుగా బయటపడుతుంది. ఒకవేళ పాకిస్థాన్–శ్రీలంక మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే పాక్ రెండు పాయింట్లతో ముగుస్తుంది. అదే సమయంలో శ్రీలంక–న్యూజిలాండ్ మ్యాచ్ కూడా రద్దయి, న్యూజిలాండ్ ఇంగ్లండ్ చేతిలో ఓడిపోతే మూడు జట్లు రెండు పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు ఎవరి నెట్ రన్రేట్ బెటర్గా ఉన్న టీమ్ సెమీఫైనల్కు చేరుకుంటుంది. ఇప్పుడు అందరి చూపు ఫిబ్రవరి 28న జరిగే పాకిస్థాన్–శ్రీలంక మ్యాచ్పైనే ఉంది. ఈ మ్యాచ్ పాకిస్థాన్కు డూ ఆర్ డై మ్యాచ్.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!