TTD to Build Venkateswara Temple in Patna: బీహార్ రాజధాని పాట్నాలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, భూమి కేటాయింపునకు పూర్తిస్థాయి ఆమోదం తెలపడంతో ఉత్తర భారతంలో టీటీడీ కార్యకలాపాలకు కొత్త దశ ప్రారంభమైంది. పాట్నా పరిధిలోని మోకామా ఖాస్ ప్రాంతంలో విశాల స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం కేటాయించగా, దీన్ని దీర్ఘకాలిక లీజు విధానంలో కేవలం నామమాత్రపు రుసుముతో టీటీడీకి అందజేయనున్నారు. 10.11 ఎకరాల భూమిని కేవలం ఒక్క రూపాయి…
Goa Blast: గోవా రాష్ట్రం అర్పోరా ప్రాంతంలోని ఒక రెస్టారెంట్-కమ్-నైట్ క్లబ్ అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. సెకన్లలోనే, మంటలు వ్యాపించాయి. అక్కడున్న సిబ్బంది, కస్టమర్లు పారిపోవడానికి సైతం అవకాశం లభించలేదు. ఎగసిపడుతున్న మంటలు మొత్తం ప్రాంతాన్ని సర్వనాశనం చేశాయి. ఈ సంఘటనలో మరణాల సంఖ్య ఇరవై ఐదు మందికి చేరింది. వీరిలో 22 మంది ఊపిరాడక, ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఈ సంఘటనను చాలా విషాదకరంగా అభివర్ణించారు. క్లబ్ల భద్రతా ఆడిట్ను డిమాండ్ చేశారు.…
Harish Rao: అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్కు మాజీమంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. శాసనసభ నిబంధనలను పట్టించుకోకుండా అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని పేర్కొన్నారు. "రెండేళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసే లేదు. డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని గాలికి వదిలేశారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తున్నారు. రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదు. ఏడాదికి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలి. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహణను సరిదిద్దాలి.
Jagtial: వదిలేసిన తల్లిని రోడ్డుపై వదిలేసిన ఉదంతం జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నేను వస్తా RDO ఆఫీస్కి నువ్వు వేళ్ళు అంటూ చిన్న కొడుకు తల్లిని ఆటోలో ఎక్కించాడు. సాయంత్రమైనా ఇద్దరు కొడుకులు రాలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండి నీళ్లు లేక చలిలో వణుకుతూ అక్కడే ఉండిపోయింది ఆ వృద్ధురాలు.. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కొడుకుల ఇలా వదిలేయం అందరినీ కంటతడి పెట్టించింది. చలికిలో వణుకుతు ఆ తల్లి ఆశ్రయం కోసం RDO కార్యాలయం ఎదుట వేచి ఉండిపోయింది. ఆర్డీవో…
AP Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులకు కీలక సూచనలు చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సినిమా పిచ్చిలో పడొపోవద్దని హితవు పలికారు. ఏదైనా ఓ పరిమితి వరకే ఉండాలనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సినిమాలతో ఎంతో మంది అభిమానులను కూడబెట్టుకన్న పవన్ ప్రేక్షకులకు ఇలాంటి గొప్ప సూచనలు ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది. నేనూ ఓ నటుడిగా చెబుతున్నాను అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ…
Tirupati National Sanskrit University: తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీ దారుణం చోటు చేసుకుంది. చదువు చెప్పే ప్రొఫెసర్ కామాంధుడిగా మారి.. ఓ విద్యార్థిని జీవితాన్ని నాశనం చేశాడు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ప్రెగ్నెంట్ చేశాడు. గత కొన్ని నెలలుగా విద్యార్థినితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. విద్యార్థినితో లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలు మరొక అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి రికార్డు చేశాడు... సెల్ ఫోన్ లో రికార్డు చేసి విద్యార్థిని లోబరుచుకునే ప్రయత్నం చేశాడు.
Goa Nightclub Blast: ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో శనివారం రాత్రి పెద్ద ప్రమాదం జరిగింది. ఒక నైట్క్లబ్లో సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా 23 మంది మృతి చెందారు. రాష్ట్ర రాజధాని పనాజీ నుంచి దాదాపు 25 కి.మీ దూరంలో ఘటనాస్థలం ఉంది. గతేడాది ప్రారంభమైన ఫేమస్ క్లబ్ బిర్చ్ బై రోమియో లేన్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.
IND vs SA 3rd ODI: భారత్ VS దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్ల ODI సిరీస్లో చివరి మ్యాచ్ ఈరోజు (డిసెంబర్ 6) విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్లో భారత్ నయా రికార్డుకు స్వస్తి పలికింది. అనేక మ్యాచ్లో తరువాత భారత్ టాస్ గెలిచింది. ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తుండగా, టెంబా బావుమా దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. కాగా.. మ్యాచ్ 1:30కి ప్రారంభం కానుంది.
USA Tragedy: అమెరికాలోని బర్మింగ్హామ్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్ కంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందారు. బర్మింగ్హామ్ లోని అపార్ట్మెంట్ కంప్లెక్స్లో పదిమంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నట్లు సమాచారం. హఠాత్తుగా చెలరేగిన మంటలతో ఉక్కిరిబిక్కిరైనా విద్యార్థులు.. అపార్ట్మెంట్లో ఫైర్ ప్రారంభమైన కాసేపటిలోనే ఘాటైన పొగ వెలువడడంతో విద్యార్థులు శ్వాస తీసుకోలేక భయంతో కేకలు వేశారు. ప్రాణ భయంతో వణికిపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుల్లో విద్యార్థిని సహజరెడ్డి ఒకరు. సహజరెడ్డి…
Netflix to Acquire Warner Bros Discovery in Billion-Dollar Deal: ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కీలక ఒప్పందం జరిగింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన టీవీ, ఫిల్మ్ స్టూడియోలు, స్ట్రీమింగ్ విభాగాన్ని కొనేందుకు నెట్ఫ్లిక్స్ సిద్ధమైంది. ఏకంగా బిలియన్ డాలర్లకు (సుమారు రూ.6.47 లక్షల కోట్లు)కొనుగోలు చేసేందుకు నెట్ఫ్లిక్స్ అంగీకరించింది. ఇప్పటికే.. నెట్ఫ్లిక్స్ ప్రపంచంలో అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ గా కొనసాగుతోంది. తాజాగా మరో అడుగు ముందుకు వేసిన నెట్ఫ్లిక్స్ ప్రపంచంలోనే పురాతన స్టూడియోలు కలిగిన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని భారీ డీల్తో హస్తగతం…