Mohammad Kaif: టీమిండియాకు తిలక్ వర్మ ‘నెక్స్ట్ కోహ్లీ’.. స్ట్రైక్ రేట్ విమర్శలపై మాజీ క్రికెటర్ సంచలన వివరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Kaif: ప్రస్తుతం టీమిండియాలో తెలుగు తేజం తిలక్ వర్మ గురించి చర్చ మొదలైంది. బ్యాటింగ్ వేగంపై రచ్చ కొనసాగుతోంది. నంబర్ 3 బ్యాటర్గా ఉన్న తిలక్ వేగంగా పరుగులు సాధించాలనే అభిప్రాయం మొదలైంది. సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ -8 మ్యాచ్లో రిస్కీ షాట్ ఆడుతూ పెవిలియన్కు చేరడంతో భారత్ ఒక్కసారిగా చతికిల పడింది. అప్పటికే మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి ఉండటంతో ఆ వికెట్ మ్యాచ్ గమనాన్ని ప్రభావితం చేసింది. న్యూజిలాండ్ సిరీస్కు ముందు వచ్చిన గాయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తిలక్ బ్యాటింగ్లో పాత ఫ్లో కనిపించడం లేదనే వాదన జోరందుకుంది. ఐదు మ్యాచ్ల్లో 107 పరుగులు చేసినా స్ట్రైక్రేట్ 118.88 మాత్రమే ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఈ లెక్కలు తిలక్ ప్లేయింగ్ ఎలెవన్లో స్థానం గురించే చర్చకు దారితీసేలా చేశాయి.
READ MORE: Medical Miracle:వైద్య చరిత్రలో అద్భుతం.. గర్భాశయం లేని మహిళకు పండంటి బిడ్డ.. ఎలా సాధ్యమైంది?
Also Read
- Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
- Jewar Toll Plaza: కేంద్రం గుడ్న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
- Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
ఈ తరుణంలో భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జట్టులో తిలక్ పాత్రను టీ20 ఛేజింగ్లలో విరాట్ కోహ్లీ టెంప్లేట్తో పోల్చారు. ప్రతి ఆటగాడికి జట్టులో స్పష్టమైన పాత్ర ఉండాలని తెలిపారు. తిలక్ తన సహజమైన ఆటను వదిలి ఇతరుల మాటలు పట్టించుకోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని అన్నారు. తిలక్ బలం ఇన్నింగ్స్ను నిలబెట్టడం, చివరి వరకు ఆడటమని స్పష్టం చేశారు. ఛేజ్లలో విరాట్ కోహ్లీ తరహా పాత్రను తిలక్ పోషించాలని చెప్పారు. పెద్ద షాట్ కోసం ముందుకు వచ్చి ఔట్ కావడం తిలక్ సహజమైన ఆటకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికే.. టీమిండియా బ్యాటింగ్ లైనప్ మొత్తం అగ్రెసివ్గా ఆడే ఆటగాళ్లతో నిండిపోయిందని కైఫ్ గుర్తుచేశారు. “అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ వంటి ప్లేయర్లు చెలరేగుతారు. వేగంగా పరుగులు పూర్తి చేస్తారు. అలాంటి సమయంలో తిలక్ వర్మ లాంటి వాళ్లు నిలకడగా ఆడుతూ.. ఇన్నింగ్స్ చివరి వరకు పోరాడాలి. ఈ పాత్ర చాలా కీలకం. ఛేజ్ మాస్టర్ కావాలంటే 20వ ఓవర్ వరకు క్రీజులో ఉండే ఆటగాడు తప్పనిసరిగా ఉండాలని, ఆ పాత్ర తిలక్ పోషించాల్సిందే.” అని సూచించారు.
READ MORE: Janhvi Kapoor :నీ గొంతు, నీ స్పర్శే నా బలం.. శ్రీదేవి వర్ధంతి వేళ జాన్వీ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
తాజావార్తలు
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
-
AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
-
Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. “మహామంత్రం” జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!