Markapuram Bus Fire Accident: మార్కాపురం సమీపంలో జరిగిన బస్సు దగ్ధం ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి హరికృష్ణ ట్రావెల్స్ యజమాని హరికృష్ణ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయనే బస్సును నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. Reliance Industries: పాపం అంబానీ.. ఒక్కరోజులో రూ.82 వేల కోట్లు లాస్! కారణం ఇదే.. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుని 14 మంది […]
Wife Kills Husband: అనంతపురం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కల్యాణదుర్గం మండలంలోని పాతచెరువు గ్రామంలో ఓ భార్య తన భర్తను హత్య చేసి అతని మృతదేహాన్ని ఇంటి ముందే పాతిపెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు హనుమంతుగా గుర్తించగా, నిందితురాలు అతని భార్య సుకన్యగా పోలీసులు తెలిపారు. ఈ ఘటన నాలుగు నెలల క్రితమే జరిగినప్పటికీ, తాజాగా తల్లీకూతుళ్ల మధ్య జరిగిన గొడవ కారణంగా ఈ దారుణం బయటపడింది. Weight Loss Tips […]
TECNO Spark 50 5G Launch: టెక్నో (TECNO) కంపెనీ భారత మార్కెట్లో కొత్త 5G స్మార్ట్ఫోన్ TECNO Spark 50 5Gను అధికారికంగా లాంచ్ చేసింది. మిడ్-రేంజ్ సెగ్మెంట్లో పోటీని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఫోన్, భారీ బ్యాటరీ, మంచి బిల్డ్, ప్రత్యేక కనెక్టివిటీ ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించేలా ఉంది. మరి ఆ ఫీచర్లేంటో ఒక లుక్ వేద్దామా.. బ్యాటరీ: ఈ స్మార్ట్ఫోన్లో 6500mAh భారీ బ్యాటరీను అందించారు. ఇది రోజంతా సులభంగా ఉపయోగించుకునేలా […]
Nepal Gang: హైదరాబాద్లో సంపన్నుల ఇళ్లను టార్గెట్ చేసుకుని దోపిడీ చేస్తున్న నేపాలీ గ్యాంగ్ ఆట కట్టించారు పోలీసులు. ఇటీవల జూబ్లీహిల్స్లోని ఓ ఇంట్లో పని మనుషుల్లా నటించి.. ఆ ఇంటికే స్కెచ్ వేసి దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా సొత్తు దోచుకు వెళ్లిన గ్యాంగ్ను పట్టుకున్నారు. ఇంతకీ ఆ కంత్రీ గ్యాంగ్ ఎక్కడ దొరికింది? పోలీసులు చోరీ సొత్తును మొత్తం రికవరీ చేశారా..? వారి పేర్లు మహేష్ షాహీ, అప్సర. నిజానికి ఇద్దరికీ సంబంధం […]
India Home Schedule: 2026-27 సంవత్సరానికి భారత పురుషుల జట్టు హోం సీజన్ అంతర్జాతీయ షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ (BCCI). ఈ సీజన్ లో భారత్ జట్టు వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం 17 నగరాల్లో 22 అంతర్జాతీయ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ హోం సీజన్ సెప్టెంబర్ 27, 2026న వెస్టిండీస్ టూర్తో ప్రారంభమవుతుంది. ఈ సిరీస్లో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఉంటాయి. వన్డే మ్యాచ్లు […]
IPL 2026 Tickets: కర్ణాటకలో ఐపీఎల్ 2026 టికెట్ల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాశప్పనవర్ విజయానంద శివశంకరప్ప కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)పై సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి కుటుంబాలకు ఇవ్వాల్సిన ఉచిత టికెట్లను ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. మార్చి 28న ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో ఈ వివాదం తలెత్తింది. మీడియాతో మాట్లాడిన శివశంకరప్ప, “ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు పొందుతున్న కేఎస్సీఏ, […]
Jowar Murukulu Recipe: ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రుచికరమైన స్నాక్స్ తినాలనుకునే వారికి జొన్న పిండి మురుకులు ఒక బెస్ట్ ఛాయస్. సాధారణంగా మురుకులు అంటే బియ్యపుపిండి గుర్తుకు వస్తుంది. కానీ, జొన్న పిండితో చేసిన మురుకులు మరింత పోషక విలువలతో పాటు తేలికగా జీర్ణమవుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు ఈ హెల్తీ స్నాక్ ను నిరభ్యంతరంగా ఆస్వాదించవచ్చు. తక్కువ జిగురు ఉండే జొన్న పిండితో కూడా కొన్ని సులభమైన చిట్కాలతో కరకరలాడే మురుకులు ఎలా […]
GST Scam: రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న జీఎస్టీ మోసాన్ని డైరెక్టరేట్ జనరల్ అఫ్ జీఎస్టీ ఇంటలిజెన్స్ (DGGI) అధికారులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించిన ఈ సిండికేట్ ద్వారా సుమారు రూ. 217 కోట్ల ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) దోపిడీ జరిగినట్లు నిర్ధారణ అయింది. అధికారులు నిర్వహించిన దర్యాప్తులో మొత్తం 72 నకిలీ (షెల్) కంపెనీలు గుర్తించారు. ఇవి కేవలం కాగితాల మీద మాత్రమే ఉండి, ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు […]
JIO Offers: రిలయన్స్ జియో మరోసారి వినియోగదారులను ఆకట్టుకునే సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. కంపెనీ అధికారికంగా చేసిన ప్రకటనలో భాగంగా.. ‘జియో హోమ్ బ్రాడ్బ్యాండ్’ ప్లాన్లపై ప్రత్యేక బెనిఫిట్ను ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం 3 నెలల ప్లాన్ రీచార్జ్ చేస్తే అదనంగా 1 నెల ఉచిత వాలిడిటీ లభిస్తుంది. అంటే 3 నెలల ధరకే ఇప్పుడు 4 నెలల సేవలను పొందవచ్చు. జియో హోమ్ అనేది జియో అందించే బ్రాడ్బ్యాండ్ సేవ. ఇందులో కేవలం […]
Markapur Accident: మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిలించింది. టిప్పర్ లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పలువురు ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా 14కు చేరుకుంది. మరో 28 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొంతమంది బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన వారిని తక్షణమే మార్కాపురం […]