Michael Clarke: ఐపీఎల్ 2025 జూన్ 3న ముగిసింది. గ్రాండ్ ఫినాలేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు పంజాబ్ కింగ్స్ను 6 పరుగుల తేడాతో ఓడించి తమ తొలి ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. రజత్ పటీదార్ నేతృత్వంలోని ఆర్సీబీ ఈ సీజన్ మొత్తంలో అద్భుత ప్రదర్శన ఇచ్చింది. ఫైనల్లోనూ అదే ఫార్మ్ను కొనసాగించి 18 ఏళ్ల కళను నెరవేర్చుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్, కోహ్లీ తదుపరి ఐపీఎల్ సీజన్లోనూ […]
Vangalapudi Anitha: అమరావతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఇటీవల వైస్సార్సీపీ నాయకుల మాటలు రాష్ట్ర గౌరవాన్ని భంగపరచేలా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అమరావతిని కించపరిచేలా పదాలను ఉపయోగించడంపై తీవ్ర అభ్యంతరకరం చేసారు. అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి అక్కసు.. మూడు రాజధానులు పేరుతో విషం కక్కారని హోం మంత్రి వ్యాఖ్యానించారు. వైసీపీ పాలన మొదటి నుంచీ అమరావతిని నిర్లక్ష్యం చేయడమే లక్ష్యంగా తీసుకున్నట్లు ఆమె ఆరోపించారు. Read Also: […]
Janasena: పిఠాపురం మండలంలోని పక్రుద్దీన్ పాలెం పాపిడి దొడ్డి చెరువు వద్ద మట్టి తవ్వకాలు ముదిరి జనసేన పార్టీలోని నేతకు రెండు వర్గాలుగా చీలిపోయి వీధికెక్కే స్థాయికి వెళ్లింది. విరవ గ్రామానికి చెందిన మాజీ ఎంపిపి కురుమళ్ళ రాంబాబుపై, విరవాడకు చెందిన పలువురు జనసేన నాయకులు దాడి చేశారంటూ పిఠాపురం రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ వివాదం వాస్తవానికి ఇటుక బట్టీలకు మట్టి తరలింపు విషయంలో ప్రారంభమైంది. చెరువులో మట్టి తవ్వకాలకు అవసరమైన అధికార అనుమతుల […]
French Open 2025 Final: ప్రపంచ టెన్నిస్లో నాలుగు ప్రధాన గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఒకటైన ఫ్రెంచ్ ఓపెన్ ప్రతి సంవత్సరం ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని క్లే మట్టికోర్టులపై జరుగుతుంది. ఇది మట్టి పైనే ఆడే ఏకైక గ్రాండ్ స్లామ్ టోర్నీ కావడంతో ఆటగాళ్ల సహనాన్ని, ఫిట్నెస్ను పరీక్షించే గొప్ప వేదికగా నిలుస్తుంది. మట్టికోర్ట్ పై ప్రావీణ్యం ఉన్న ఆటగాళ్లే ఇక్కడ విజయాలు సాధించడం సహజం. అయితే, 2025 ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో అభిమానుల అంచనాలను తలకిందులు […]
PhonePe: ప్రముఖ ఫిన్టెక్ సంస్థ ఫోన్పే (PhonePe) ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపు సేవల్ని ప్రవేశపెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం జీఎస్ పే టెక్నాలజీకి చెందిన కన్వర్సేషనల్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫారమ్ ‘గప్ చుప్’ను ఫోన్పే ఇటీవలే కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఫోన్పే వెల్లడించిన ప్రకారం, రానున్న త్రైమాక్షికలో భారత్ లోని ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యూపీఐ మొబైల్ యాప్ ను […]
Carlos Alcaraz: ఫ్రెంచ్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్లో ప్రస్తుత చాంపియన్ కార్లోస్ ఆల్కారాజ్ ఫైనల్కు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో ఇటలీ టెన్నిస్ స్టార్ లోరెంజో ముసెట్టికి గాయం కావడంతో ఆల్కారాజ్కు వాక్ ఓవర్ లభించింది. మ్యాచ్ ప్రారంభంలో ఆల్కారాజ్కు పోటీగా కనిపించిన ముసెట్టి తొలి సెట్ను 6-4తో కైవసం చేసుకున్నాడు. అయితే రెండో సెట్లో స్పానిష్ యువ స్టార్ ఆల్కారాజ్ తిరిగి పోటీకి రావడంతో సెట్ను టై బ్రేక్లో 7-6 (7-3)తో గెలుచుకున్నాడు. Read Also: […]
SBI Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. కోట్లాది మందికి బ్యాంకింగ్ సేవలను అందించే విధంగా దేశంలోని అనేక శాఖల ద్వారా సేవలు అందిస్తోంది. డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఇకపోతే, ఈమధ్య కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్న వేళ వినియోగదారుల భద్రత కోసం ఎస్బీఐ (SBI) ఒక కీలక ప్రకటన చేసింది. ఇకపై ఎస్బీఐ నుండి వచ్చే […]
Muhammad Yunus: బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నడుమ వచ్చే ఏడాది ఏప్రిల్లో దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ తాత్కాలిక నాయకుడు ముహమ్మద్ యూనస్ ప్రకటించారు. అక్కడి దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. గత సంవత్సరం బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుండి షేక్ హసినా తొలగించబడిన అనంతరం దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత నెలకొంది. అప్పటి నుండి ఆమె పరారీలో ఉన్నారు. ఈ పరిణామాల […]
CM Rekha Gupta: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఒక గుర్తుతెలియని వ్యక్తి ప్రాణహాని బెదిరింపు కాల్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆమె భద్రతను శుక్రవారం అధికారులు మరింతగా పెంచారు. ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ లో పోలీస్ కంట్రోల్ రూమ్కు గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఫోన్ చేసి ఈ బెదిరింపు చేసినట్టు ఘాజియాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. Read Also: Covid-19 Variant: వేగంగా వ్యాపిస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్.. లక్షణాలు ఎలా […]
Covid-19 Variant: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే భారత్, చైనా, అమెరికా వంటి దేశాల్లో వెలుగులోకి వచ్చిన NB.1.8.1 అనే కొత్త కోవిడ్ వేరియంట్ ఇప్పుడు యునైటెడ్ కింగ్డంలో (UK) కూడా గుర్తించబడింది. ఈ వేరియంట్ కారణంగా చైనాలో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది. ఇకపోతే, శుక్రవారం ఉదయం వరకు భారత్లో 5,364 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. […]