SBI ATM: బరితెగించిన దొంగలు.. ఏటీఎం పగలగొట్టి రూ.30లక్షల చోరీ
- రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో బరితెగించిన దొంగలు..
- ఏటీఎం పగలగొట్టి రూ.30లక్షల చోరీ
- కేవలం నాలుగు నిమిషాల్లోనే ఏటీఎం చోరీ.
SBI ATM: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం (మార్చి 2) తెల్లవారు జామున రావిర్యాల గ్రామంలో ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనం జరిగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత వ్యూహాత్మకంగా దోపిడీ చేశారు. ముందుగా సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. అనంతరం గ్యాస్ కట్టర్, ఇనుప రాడ్ల సాయంతో ఏటీఎంను బద్దలు కొట్టారు. ఆ తరవాత కేవలం నాలుగు నిమిషాల్లోనే ఏటీఎం నుంచి డబ్బును తీసుకొని పారిపోయారు. రెండు రోజుల క్రితం మాత్రమే ఏటీఎంలో రూ. 30 లక్షలు నిక్షిప్తం చేసినట్లు బ్యాంక్ మేనేజర్ తెలిపారు.
Read Also: Britain- Ukraine: ఉక్రెయిన్కి మద్దతుగా ఐరోపా దేశాలు.. బ్రిటన్ భారీ సాయం
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు జరిపారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దొంగలు షిఫ్ట్ కారులో వచ్చి, పూర్తి వ్యూహాత్మకంగా చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ. 29 లక్షల రూపాయలు అపహరణకు గురైనట్లు బ్యాంక్ మేనేజర్ వెల్లడించారు. పోలీసులు దొంగలను త్వరగా పట్టుకుని, దొంగతనం జరిగిన డబ్బును రికవరీ చేస్తారని స్థానికులు ఆశిస్తున్నారు. ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. ఏటీఎం సెక్యూరిటీ వ్యవస్థల్లో లోపాలను సరిదిద్దేలా బ్యాంక్ యాజమాన్యం, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!