Minister Sridhar Babu: పదిమందికి మేలు చేస్తే పది తరాలు గుర్తుండాలి
- ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు 88వ జయంతి వేడుకలు
- పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు.
- పదిమందికి మేలు చేస్తే పది తరాలు గుర్తుండాలంటూ వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Sridhar Babu: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు 88వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొని, శ్రీపాదరావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. “పదిమందికి మేలు చేస్తే పది తరాలు గుర్తుంచుకోవాలి” అంటూ శ్రీపాదరావు సేవా స్ఫూర్తిని ప్రతిబింబించారు. శ్రీపాదరావు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన సేవలను ఆయన కొనియాడారు. నివాళులర్పించిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మంథని ప్రభుత్వ సామాజిక వైద్యశాలను సందర్శించారు. రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడంతో పాటు శానిటేషన్ సిబ్బందికి దుస్తులను అందజేశారు.
Read Also: Ganja Smuggling: రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు.. కానిస్టేబుల్ను ఢీ కొట్టి?
Also Read
అ తర్వాత, మంథని ప్రయాణ ప్రాంగణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించి, ప్రజలకు ఉచితంగా మజ్జిగను అందించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. “కార్యకర్తలు, నాయకుల ప్రేమ, అభిమానాలే మాకు స్ఫూర్తి. నేను రాష్ట్రానికి మంత్రి అయినా, ఈ నియోజకవర్గంలో సాధారణ కార్యకర్తగానే ఉంటాను. మా మధ్యలో శ్రీపాదరావు లేకపోయినా, ఆయన స్ఫూర్తితో కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..