CM Revanth Reddy: వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం
- వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం
- దేవాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం
- రూ.880 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం హెలికాప్టర్లో వనపర్తికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత దేవాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం బాయ్స్ జూనియర్ కాలేజీ మైదానంలో రూ.880 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తామని సీఎం తెలిపారు.
Read Also: AICC: మున్నూరు కాపుల సమావేశంపై ఏఐసీసీ సీరియస్
Also Read
- CJP Protest: "4 గంటల సమయం దండగ".. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
- Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
- Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..
ఇక ఆ తర్వాత కేటీఆర్ పాలిటెక్నిక్ మైదానంలో వివిధ సంక్షేమ పథకాలు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల పంపిణీ, మహిళలకు రుణాల పంపిణీ వంటి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తమ ఆనందం వ్యక్తం చేశారు. సాయంత్రం 3 గంటలకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.
ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చిన్నప్పుడు, 43 ఏళ్ల క్రితం అద్దెకు ఉండి చదువుకున్న ఇంటిని సందర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఇంటి యజమాని పార్వతమ్మను కలుసుకొని ఆమెతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం తన చిన్ననాటి స్నేహితులను కలుసుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి తొలిసారి వనపర్తికి రావడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున ఆత్మీయ స్వాగతం పలికారు. గ్రామస్తులు, కార్యకర్తలు ఆయన పర్యటనతో ఎంతో ఉత్సాహంగా కనిపించారు.
తాజావార్తలు
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
-
Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
-
Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
-
Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..
-
Balkampet Yellamma: నేడు “బల్కంపేట ఎల్లమ్మ తల్లి” వార్షిక కళ్యాణ మహోత్సవం..!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!