IND vs AUS: సెమీ ఫైనల్స్లో భారత్ vs ఆస్ట్రేలియా.. పైచేయి సాధించేదెవరో!
- ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్స్లో భారత్ vs ఆస్ట్రేలియా..
- మార్చి 4న దుబాయ్ వేదికగా మ్యాచ్.
- రికార్డ్స్ పరంగా సరిసమంగా ఇరు జట్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మొదటి సెమీఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య మార్చి 4న జరగనుంది. ఐసీసీ టోర్నమెంట్ లలో ఇరు జట్లకు సెమీఫైనల్లో మూడోసారి తాడోపేడో తేల్చుకోనున్నారు. క్రితం రెండు సార్లు ఐసీసీ టోర్నమెంట్ సెమీఫైనల్లో ఇరు జట్లు ఎప్పుడు తలపడ్డాయి? అందులో ఎవరు గెలిచారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటూనే.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మొదటి సెమీఫైనల్లో గెలుపు ఎవరిది అనేది చూద్దాం.
Read Also: IOB Recruitment 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 750 జాబ్స్.. మంచి జీతం.. మిస్ చేసుకోకండి
Also Read
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
- Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ టోర్నమెంట్ సెమీఫైనల్లో మొదటి ఢీ 2007లో జరిగింది. ఇది T20 వరల్డ్ కప్ మొదటి ఎడిషన్లో డర్బన్ వేదికగా జరిగింది. ఆ మ్యాచ్లో భారత్ 15 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. భారత ఆటగాడు యువరాజ్ సింగ్ 30 బంతుల్లో 70 పరుగులు చేసి ఆ మ్యాచ్ లో హీరో అయ్యాడు. ఆ తర్వాత 2015లో జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ను 95 పరుగుల తేడాతో ఓడించింది. సిడ్నీలో జరిగిన ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా 328 పరుగులు చేయగా, భారత్ కేవలం 233 పరుగులకే కుప్పకూలింది. దింతో భారత్ భారీ ఓటమిని ఎదురుకొని టోర్నీ నుండి విశ్రమించింది.
ఇప్పుడు మూడవ సారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ లో తలపడనున్నారు. ఈసారి మ్యాచ్ యూఏఈలోని దుబాయ్ వేదికగా జరగనుంది. భారత్ తన గత అన్ని మ్యాచ్లను ఇక్కడ గెలిచింది. ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో దుబాయ్లో ఆడలేదు. కానీ, ఆ జట్టు కూడా అజేయంగా సెమిస్ కు చేరుకుంది. అంటే ఈసారి పోరు బాగానే ఉండనుంది. ఇక ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో మొత్తం 8 సార్లు భారత్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఇందులో ఇరు జట్లు నాలుగు మ్యాచ్ల చొప్పున గెలిచాయి. అంటే, ప్రస్తుతం ఈ జట్ల మధ్య రికార్డ్ సమంగా ఉంది.
Read Also: TG Govt: ప్రభుత్వ చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో ముందడుగు..
ప్రస్తుత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు మంచి ఫామ్లో ఉండడంతో అభిమానులు భారత జట్టు విజయంపై పెద్ద ఆశలు పెట్టుకున్నారు. చూడాలి మరి, సెమీఫైనల్లో ఎవరు గెలుస్తారు? టీమిండియా తన విజయ పరంపరను కొనసాగిస్తుందా లేదా కంగారూలు చేతిలో కంగు తింటారో? అన్ని ప్రశ్నలకు సమాధానాలు మార్చి 4 వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
-
Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
-
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!