Bhatti Vikramarka: దశాబ్ద కాలంగా గత ప్రభుత్వం కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదు..
- హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా శ్రీ భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలు
- పాల్గొన్న డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
- కళాకారుల నంది అవార్డులపై కీలక వ్యాఖ్యలు.
Bhatti Vikramarka: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శ్రీ భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రతి యేటా తమిళనాడులో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాల మాదిరిగా, ఇకపై ప్రతి సంవత్సరం తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని, ఇందులో ప్రముఖ సంగీత విద్వాంసులు పద్మశ్రీ డా. యెల్లా వెంకటేశ్వరరావు, పద్మశ్రీ డా. శోభారాజు, హైదరాబాద్ బ్రదర్స్, హైదరాబాద్ సిస్టర్స్, కోవెల శాంత, డివి మోహన్ కృష్ణ తదితరులు పాల్గొనడం గర్వంగా ఉందని చెప్పారు.
Read Also: OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విడాముయార్చి.. ఎక్కడ చూడాలంటే .?
Also Read
- USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..
- Easy Mango Lassi Recipe: క్షణాల్లో అదిరిపోయే మామిడి లస్సీ.. ఒక్క గ్లాస్తో ఆగరు అంతే..
- Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..
- Soft Pink Lips Tips: మీ పెదాలు మృదువుగా.. గులాబీ రంగులో మెరిసిపోయే చిట్కాలు ఇవే..
తన జిల్లా ఖమ్మం నుంచే శ్రీ భక్త రామదాసు జన్మించారని, ఆ జిల్లాకు తాను ప్రాతినిధ్యం వహించడమే గాకుండా రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. తానిషా పాలనలో తహసిల్దారుగా ఉన్న రామదాసు, ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించిన చరిత్రను స్మరించారు. ఈ చర్యకు తానిషా ప్రభువుల ఆగ్రహానికి గురై, గోల్కొండ కోటలో ఖైదీగా మారిన విషాద కహానీని వివరించారు.
Read Also: Ramzan Mubarak: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మోడీ
చిత్రహింసలను భరించి కూడా భక్త రామదాసు తన భక్తిని కోల్పోకపోవడం, కీర్తనలు రాయడం ద్వారా భక్తి రస వాగ్గేయకారుడిగా నిలిచారని కొనియాడారు. భక్త రామదాసును స్ఫూర్తిగా తీసుకొని, మరెంతో మంది సంగీత విద్వాంసులు, వాగ్దాయకారులు ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించిన భట్టి విక్రమార్క, గత దశాబ్ద కాలంగా సినిమా కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదని అన్నారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గద్దర్ పేరిట గద్దర్ ఫిలిం అవార్డులను ఉగాదికి అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా, నాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్రవ్యాప్తంగా నాటక పోటీలను నిర్వహించి, కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. కళలు కొంతమందికే సొంతం అయినప్పటికీ, ఆ కళను సమాజానికి పంచి, కళాకారులు సమాజ వికాసానికి దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అంతటా భక్తి రసాలను పండించింది. శ్రీ భక్త రామదాసు త్యాగాలు, భక్తి, కీర్తనలు తలచుకుంటూ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తాజావార్తలు
-
USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..
-
IPL 2026: ‘మీరు మారిపోయారు సార్’.. లక్నో ఓడినా పంత్ను హత్తుకున్న ఓనర్ సంజీవ్ గోయెంకా..
-
Easy Mango Lassi Recipe: క్షణాల్లో అదిరిపోయే మామిడి లస్సీ.. ఒక్క గ్లాస్తో ఆగరు అంతే..
-
Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..
-
Soft Pink Lips Tips: మీ పెదాలు మృదువుగా.. గులాబీ రంగులో మెరిసిపోయే చిట్కాలు ఇవే..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!