MP: లేబర్తో భార్య ఎఫైర్.. ఉపాధ్యాయుడైన భర్తను ఏం చేసిందంటే..!
- మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలో దారుణం
- కార్మికుడితో ఉపాధ్యాయుడి భార్య ఎఫైర్
- ప్రియుడితో కలిసి స్కెచ్ వేసిన ప్రియురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్షణిక సుఖం కోసం కొంత మంది మహిళలు అడ్డదారులు తొక్కుతున్నారు. కలకాలం తోడుండాల్సిన వాళ్లు.. మధ్యలో పరిచయం అయిన వాళ్ల కోసం కట్టుకున్న వాళ్లనే కడతేరుస్తున్నారు. జైల్లో చిప్పకూడు తినాల్సిన దుస్థితి వస్తుందని తెలిసి కూడా ఘాతుకాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Switzerland bar fire: అంతులేని విషాదం.. 47 మంది సజీవదహనం.. 115 మందికి గాయాలు
Also Read
- Divorce Drama: ప్రేమ కథగా మారిన విడాకుల ఎపిసోడ్.. భర్తపై కేసులు పెట్టిన భార్యకు కోర్టులో ఊహించని ట్విస్ట్!
- Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
- IMD: భారత్కు ఐఎండీ కీలక హెచ్చరిక.. ఈ ఏడాది కరువు తప్పదా?
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
రమాకాంత్ పాఠక్, సాధన శర్మ భార్యాభర్తలు. మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో రమాకాంత్ పాఠక్ ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా.. సాధన శర్మ అంగన్వాడీ కార్యకర్తగా పని చేస్తోంది. రమాకాంత్ ఇంటి దగ్గరలోనే ఒక పెట్రోల్ బంకు ఉంది. రోజూ సాధన శర్మ ఆ పెట్రోల్ బంకు ఎదురుగానే వెళ్తుండేది. ఈ క్రమంలో పెట్రోల్ బంకులో పని చేసే కార్మికుడు మనీష్ జాతవ్ (24) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఏడాదిన్నర నుంచి ఇద్దరి మధ్య ఏకాంతం పెరిగింది. భర్త లేని సమయంలో ఇద్దరూ ఇంట్లో కలుసుకునే వారు. ఒకరోజు భర్త రమాకాంత్ కంట్లో పడ్డారు. దీంతో తీరు మార్చుకోవాలని భర్త హెచ్చరించాడు. అయినా కూడా బుద్ధి మార్చుకోలేదు. ప్రియుడితోనే తిరుగుతోంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు జరుగుతున్నాయి. దీంతో భర్తను అంతమొందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రియుడితో మనీష్తో కలిసి స్కెచ్ వేసింది. దీనికి మనీష్ స్నేహితుడైన సత్నం సాయం కోరాడు. అయితే రమాకాంత్ పెట్రోల్ కొట్టించుకునేందుకు బంకు దగ్గరకు రావడంతో సత్నం పరిచయం పెంచుకున్నాడు. నమ్మకం కుదిరాక బయటకు వెళ్దామంటూ కారులో రమాకాంత్ను మనీష్, సత్నం తీసుకెళ్లారు. నాన్పూర్ వ్యాలీ దగ్గరకు తీసుకెళ్లాక రమాకాంత్ను చంపేసి లోయలో పడేశారు. అనంతరం బైక్ను తీసుకొచ్చి మృతదేహం దగ్గర పడేశారు.
ఇది కూడా చదవండి: Mumbai: ఓ యువతి ఘాతుకం.. ప్రియుడు అందుకు నిరాకరించాడని ఏం చేసిందంటే..!
డిసెంబర్ 27, 2025న నాన్పురా లోయలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించి దర్యాప్తు చేపట్టారు.
ఇక భార్య సాధన శర్మను స్టేషన్కు పిలిచి విచారించగా సరైన సమాధానం రాలేదు. దీంతో ఆమె కాల్ డేటాను పరిశీలించగా ఇతరులతో మాట్లాడినట్లుగా తేలింది. దీంతో ఆ దిశగా విచారించగా పొంతన లేని సమాధానం చెప్పింది. మరింత నిలదీయగా ప్రియుడితో కలిసి చంపినట్లుగా నేరాన్ని అంగీకరించింది. మొబైల్ ఫోన్లు, సీసీటీవీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. నెలన్నర క్రితం ఈ హత్యకు కుట్ర పన్నినట్లుగా పోలీసులు తేల్చారు. నిందితులు మనీష్, సత్నంను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
EPFO సభ్యులకు కీలక అప్డేట్.. వడ్డీ డబ్బు ఎప్పుడు జమ అవుతుందంటే..?
-
Hyderabad: అల్వాల్లో విషాదం.. విద్యుత్ షాక్తో తండ్రీకూతురు మృతి.!
-
Mollywood Times Controversy : ‘మాలీవుడ్ టైమ్స్’ నిర్మాతలపై సెన్సార్ టీం గరం గరం… మ్యూట్ చేసిన పదాలతో సినిమా రిలీజ్
-
Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి.. యువ క్యాడెట్లకు రక్షణ మంత్రి పిలుపు
-
Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!