Ramzan Mubarak: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మోడీ
- పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం
- శుభాకాంక్షలు తెలిపిన మోడీ
- సమాజంలో శాంతి, సౌహార్దం వెల్లివిరియాలంటూ పోస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramzan Mubarak: రంజాన్ పవిత్ర మాసం భారతదేశంలో ప్రారంభమైంది. ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసాలు (రోజాలు) ప్రారంభించారు. శనివారం సాయంత్రం రంజాన్ మాసం చందమామ దర్శనమిచ్చిన తర్వాత ప్రజలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ తన ఎక్స్ (పాత ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ లో ” పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మన సమాజంలో శాంతి, సౌహార్దం వెల్లివిరియాలి. ఈ పవిత్ర మాసం ఆత్మపరిశీలన, కృతజ్ఞత, భక్తి లక్షణాలను ప్రతిబింబిస్తూ.. మనకు దయ, సహానుభూతి, సేవ వంటి విలువలను గుర్తు చేస్తుంది. రంజాన్ ముబారక్!” అని తెలిపారు.
Read Also: Fake Darshan Tickets: శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్లు.. పోలీసులకు వరుస ఫిర్యాదులు
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
ఇక గత శుక్రవారం, జహాన్-ఏ-ఖుస్రో 25వ ఎడిషన్ లో ప్రధాని పాల్గొని రంజాన్ పండుగకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారతదేశపు సూఫీ సంప్రదాయం అందించే సందేశాన్ని ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక అధికారిక ప్రకటనలో “ఈ పవిత్ర దినాలలో ఉపవాసం, ఆత్మ నియంత్రణ, సహనం, పూజ వంటి మంచిపనులు సహనం, సరళత, పరస్పర సోదరత్వం వంటి విలువలను పెంపొందిస్తాయి” అని ఆయన అన్నారు.
Read Also: SBI ATM: బరితెగించిన దొంగలు.. ఏటీఎం పగలగొట్టి రూ.30లక్షల చోరీ
As the blessed month of Ramzan begins, may it bring peace and harmony in our society. This sacred month epitomises reflection, gratitude and devotion, also reminding us of the values of compassion, kindness and service.
Ramzan Mubarak!
— Narendra Modi (@narendramodi) March 2, 2025
రంజాన్ మాసంలో ముస్లింలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉంటారు. వీటిని రోజాలు అంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, చందమామ కనిపించడం ద్వారా కొత్త మాసం ప్రారంభమవుతుంది. ఈ ఇస్లామిక్ మాసాలు 29 లేదా 30 రోజులు ఉంటాయి. రంజాన్ ముగిసిన తర్వాతి రోజు ఈద్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. రంజాన్ సమయంలో ముస్లింలు నెల పొడవునా నిబంధనలను పాటిస్తూ, ప్రార్థనలు (ఇబాదత్) చేస్తూ ఉంటారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!