-
అన్ లాక్: కోలుకుంటున్న రాష్ట్రాలు.. సాధారణ జన జీవనంలో ప్రజలు!
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిస్థాయిలో దిగువకు చేరుకుంటోంది. అత్యంత వేగంగా గ్రాఫ్ కిందికి పడిపోతోంది. పలు రాష్ట్రాలు ఇప్పటికే అన్ లాక్ దిశగా నిర్ణయాలు తీసేసుకున్నాయి. దీంతో, జనజీవనం మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటివి ఇప్పటికే అన్ లాక్ మొదలైంది. ఢిల్లీలోనూ ఆంక్షలు సడలించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా నైట్ కర్ఫ్యూ మాత్రమే వుండే అవకాశం కనిపిస్తోంది. ఇక యధావిధిగా ప్రజాజీవనం ఉండేలా […] -
అఖిల్ ఏజెంట్లో కన్నడ స్టార్!
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటే అప్పుడు దీన్ని జనం ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు తహతహ లాడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ ఏజెంట్ మూవీలో నటిస్తున్నాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో దర్శకుడు సురేందర్ రెడ్డి సైతం నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం ఇందులో ప్రతినాయకుడి పాత్ర కోసం కన్నడ స్టార్ […] -
ప్రభాస్ ‘రాధేశ్యామ్’కు భారీ ఆఫర్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం రాధేశ్యామ్ ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఓ పాటతో పాటు సీనియర్ నటుడు కృష్ణంరాజుకు సంబంధించిన ఓ ఎపిసోడ్, అలానే కొంత ప్యాచ్ వర్క్ మినహా పూర్తయ్యింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన చిత్ర బృందం ఎప్పుడెప్పుడు దీనిని పూర్తి చేసి, జనం ముందుకు సినిమాను తీసుకువద్దామా అని ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే… ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన టీ […] -
ఏపీలో రేపటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె
ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల (జూడా) సంఘం బుధవారం నుంచి విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రేపటి నుంచి నాన్ కోవిడ్ విధులను బహిష్కరిస్తామని పేర్కొంది. ఫ్రంట్ లైన్ వారియర్లందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని, కోవిడ్ ప్రోత్సాహకం ఇవ్వాలని, ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు పెంచాలని డిమాండ్ చేస్తూరాష్ట్ర వైద్య విద్య సంచాలకుడికి సమ్మె నోటీసు పంపించింది. -
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. లాక్ డౌన్ పై?
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. మూడో విడత లాక్డౌన్ గడువు ఈ నెల 9తో ముగుస్తుంది. దీంతో తదుపరి కార్యాచరణ కోసం కేబినెట్ మరోసారి సమావేశమవుతోంది. లాక్ డౌన్ సడలింపుపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న […] -
మాయ లేడీ.. ప్రేమ పేరుతో 80 లక్షల మోసం
ప్రేమ, పెళ్లి పేరుతో అమాయకులకు బురిడీ కొట్టిసున్న మాయ లేడీ శ్రీదివ్యపై పోలీస్ కేసు నమోదు అయింది.. ఆమెతో పాటు తమ్ముడు పోతురాజు, ఆమెకు సహకరిస్తున్న రజాక్ లపై బాధితుడు విజయవాడలోని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి చేసుకుంటాను అంటూ ఆ యువకుడి నుంచి 80 లక్షలు కొట్టేసింది. డబ్బులు వసూలు చేశాక ఆ మహిళ ముఖం చాటేస్తోంది. కాగా మాయలేడీ మోసాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె చేతిలో ఇలానే మోసపోయిన పలువురి వద్ద […] -
బిగ్ బాస్ ఎంపిక వార్తలపై స్పందించిన భూమిక
బుల్లితెర బిగ్ బాస్ షో ఇప్పుడు దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ నడుస్తోంది. కన్నడ, మళయాలం, తెలుగు, తమిళం, బెంగాలీ ఇలా ప్రాంతీయ భాషల్లో బిగ్ బాస్ షో ఇప్పటికే సక్సెస్ఫుల్గా దూసుకుపోతోంది. అయితే ఈ షో గురించి, ఆమెకు వస్తోన్న ఆఫర్ల గురించి హీరోయిన్ భూమిక తాజాగా స్పందించారు. తనకు ఆఫర్లు వచ్చిన మాట నిజమే గానీ వాటిని ఇంత వరకు అంగీకరించలేదు.. ఎప్పుడూ అంగీకరించను కూడా అని తెగేసి చెప్పేశారు. ఇక హిందీలో పద్నాలుగు […] -
కరీంనగర్లో వింత! తల పైకి ఎత్తి అరుస్తున్న పాము!!
కరీంనగర్ జిల్లాలో అరిచే పాము హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో ఓ వింత పాము సంచరిస్తోంది. రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఈ పామును గుర్తించారు. పాము నోరు తెరిస్తే వింత అరుపులు వినిపిస్తున్నాయి. దీంతో పామును చూసి స్థానికులు భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ పామును పట్టుకోవాలని, ఇంకా ఇలాంటి పాములు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పాము అరుస్తున్న సమయంలో సెల్ […] -
రేపు బాల్క సుమన్ ను పరామర్శించనున్న కేటీఆర్
చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఇంట్లో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బాల్క సుమన్ తండ్రి, మెట్పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్క సురేష్ అనారోగ్యంతో కన్నుమూశారు. కాగా చెన్నూరు ఎమ్మెల్యే సుమన్ ను టీఆర్ఎస్ నేతలు పరామర్శిస్తున్నారు. కాగా రేపు మంత్రి కేటీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మెట్ పల్లిలో బాల్క సుమన్ ను కేటీఆర్ పరామర్శించనున్నారు. అనంతరం కోరుట్ల, జగిత్యాల పట్టణాల్లో కూడా కేటీఆర్ పర్యటించనున్నారు. ఇదివరకు ముఖ్యమంత్రి […] -
కృతిక ఉదయనిధి మూడో చిత్రం
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కోడలు, ఉదయనిధి స్టాలిన్ భార్య కృతిక ఉదయనిధి ముచ్చటగా మూడోసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకోబోతోంది. ఇప్పటికే యూనిక్ స్టోరీ లైన్ తో ‘వనక్కమ్ చెన్నయ్’, ‘కాళీ’ చిత్రాలను కృతిక తెర కెక్కించింది. ఇప్పుడు కాళిదాస్ జయరాం, తన్య రవిచంద్రన్ జంటగా మూడో చిత్రం మొదలుపెట్ట బోతోంది. రైజ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో పెంటెల సాగర్ దీనిని నిర్మించబోతున్నాడు. ఇదో జర్నీ ఆఫ్ లైఫ్ మూవీ అని, ఆ ప్రయాణం కధలో అంతర్భాగంగా సాగుతుందని […]
తాజావార్తలు
-
PM Modi: ఇవాళ రాత్రి 8.30కి.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ..
-
Central Govt: ఎట్టకేలకు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం..
-
Tech Layoffs 2026: మీరు ఐటీ ఉద్యోగులా? అయితే ఈ రిపోర్ట్ చదవాల్సిందే.. 5 ఏళ్లలో 10 లక్షల మంది ఇంటికి!
-
Strait of Hormuz: ట్రంప్ బెదిరింపులు.. ఇరాన్ దూకుడు.. 24 గంటల్లోపే మళ్లీ హార్మూజ్ మూసివేత
-
Simhachalam Chandanotsavam Tickets Row: సింహాచలం చందనోత్సవం టిక్కెట్లపై గందరగోళం
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!