Rajesh Veeramalla
Author- NTV Telugu-
ICAE: నేడు 32వ వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ సదస్సు.. ప్రారంభించనున్న ప్రధాని
శనివారం 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు (ఐసీఏఈ)ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. 65 ఏళ్ల తర్వాత భారత్లో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. డిజిటల్ వ్యవసాయం, స్థిరమైన వ్యవసాయ ఆహార వ్యవస్థలను ఇందులో ప్రదర్శించనున్నారు. -
Passenger Died: ఆరోగ్యం క్షీణించి బస్సులో ప్రయాణికుడు మృతి..
ఆరోగ్యం క్షీణించి బస్సులోనే ప్రయాణికుడు మృతి చెందిన ఘటన ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది. హల్ద్వానీ నుంచి కౌసాని వెళ్తున్న కేము బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి ఆరోగ్యం శుక్రవారం క్షీణించింది. దీంతో బస్సు డ్రైవర్ ఆ ప్రయాణికుడిని భవాలీ సీహెచ్సీకి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న యువకుడి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
Terrorist Attack: జమ్మూలో ఉగ్రవాదుల దాడి భయం.. ఆర్టికల్ 370 వార్షికోత్సవానికి ముందే హై అలర్ట్
జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించి ఐదు సంవత్సాలు అవుతుంది. కాగా.. ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు జమ్మూ బస్టాండ్ను లక్ష్యంగా చేసుకున్న అనుమానాలు కనిపిస్తున్నాయి. 2019 సంవత్సరంలో జమ్మూ బస్టాండ్పై దాడికి పాల్పడిన ఉగ్రవాది యాసిర్ అహ్మద్ భట్.. జూలై 27 నుండి కుల్గామ్లోని తన ఇంటి నుండి కనిపించకుండా పోయాడు. కాగా.. అతను 2021 నుంచి బెయిల్పై బయట తిరుగుతున్నాడు. ఈ క్రమంలో.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. -
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో ఎనిమిదో రోజు భారత్ షెడ్యూల్ ఇదే..
పారిస్ ఒలింపిక్స్లో ఎనిమిదో రోజు (శనివారం) మహిళా షూటర్ మను భాకర్ పై మరోసారి పతకంపై భారత్ ఆశలు పెట్టుకుంది. నేడు మను 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఫైనల్లో విజయం సాధించి పారిస్ గేమ్స్లో హ్యాట్రిక్ పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మను భాకర్.. భారతదేశానికి ఇప్పటివరకు రెండు కాంస్య పతకాలు సాధించిపెట్టింది. -
Paris Olympics 2024: భారత బ్యాడ్మింటన్లో చరిత్రాత్మక విజయం.. క్వార్టర్ ఫైనల్స్కు లక్ష్యసేన్
లక్ష్య సేన్ బ్యాడ్మింటన్లో పురుషుల సింగిల్స్ సెమీ-ఫైనల్కు చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా లక్ష్య సేన్ నిలిచాడు. లక్ష్య 19-21, 21-15, 21-12తో తైవాన్కు చెందిన చు టిన్ చెన్పై విజయం సాధించాడు. భారత బ్యాడ్మింటన్లో లక్ష్యసేన్ చరిత్రాత్మక విజయం సాధించాడు. క్వార్టర్-ఫైనల్స్లో చైనీస్ తైపీకి చెందిన చు టిన్ చెన్పై మూడు గేమ్ల ఉత్కంఠభరితమైన గెలుపు పొందాడు. -
BSF: పారామిలటరీ ఫోర్స్ బీఎస్ఎఫ్ చీఫ్, డిప్యూటీ చీఫ్ల తొలగింపు..
బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్, డిప్యూటీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ వైబి ఖురానియాలను కేంద్రం శుక్రవారం తొలగించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. అగర్వాల్ 1989 బ్యాచ్ కేరళ క్యాడర్ అధికారి కాగా, ఖురానియా 1990 బ్యాచ్ ఒడిశా క్యాడర్ అధికారి. అగర్వాల్ గతేడాది జూన్లో బీఎస్ఎఫ్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. పాకిస్తాన్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ (పశ్చిమ)గా ఖురానియా బాధ్యతలు స్వీకరించారు. -
IND vs SL: భారత్-శ్రీలంక మ్యాచ్ టై..
భారత్-శ్రీలంక మధ్య కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో మ్యాచ్ టై గా ముగిసింది. 231 పరుగుల లక్ష్యాన్ని భారత్ బ్యాటర్లు చివరి వరకూ పోరాడినప్పటికీ.. చరిత్ అసలంక చివరి ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు. -
Tragedy: బైక్పై విద్యుత్ తీగలు పడి భార్యాభర్తలు సజీవ దహనం..
యూపీలోని బదౌన్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో.. డేటాగంజ్-బడాయూన్ రహదారిపై హైటెన్షన్ లైన్ తెగిపడి బైక్పై వెళుతున్న దంపతులపై పడింది. దీంతో.. విద్యుత్ ఘాతుకానికి గురై భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు. బైక్ కూడా పూర్తిగా కాలిపోయింది. ఎలాగోలా ప్రజలు హైటెన్షన్ లైన్ను తొలగించారు. -
Paris Olympics 2024: కాంస్య పతకాన్ని కోల్పోయిన ధీరజ్, అంకిత జంట..
మిక్స్డ్ డబుల్స్ ఆర్చరీ జోడీ ధీరజ్ బొమ్మదేవర, అంకిత భకత్ కాంస్య పతక పోరులో అమెరికాతో తలపడింది. ఈ క్రమంలో.. భారత జోడీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. భారత జోడీ తొలి రెండు షాట్లలో 17 పాయింట్లు సాధించింది. అదే సమయంలో అమెరికా జోడీ కౌఫ్హోల్డ్, అల్లిసన్ తొలి రెండు షాట్లలో 19 పరుగులు చేసి రెండు పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు. నాలుగో సెట్లో భారత జోడీ మొత్తం 35 పరుగులు చేసింది. నాలుగో సెట్లో అమెరికా జోడీ 37 పాయింట్లు సాధించి సెట్తో… -
Pooja Khedkar Mother: పూజా ఖేద్కర్ తల్లికి రిలీఫ్..! బెయిల్ మంజూరు
భూ వివాదానికి సంబంధించిన క్రిమినల్ బెదిరింపు కేసులో మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తల్లికి రిలీఫ్ దక్కింది. ఈ కేసులో మనోరమ ఖేద్కర్కు శుక్రవారం పూణె కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అడిషనల్ సెషన్స్ జడ్జి ఏఎన్ మారే బెయిల్ మంజూరు చేసినట్లు మనోరమ తరఫు న్యాయవాది సుధీర్ షా తెలిపారు. 2023లో పూణేలోని ముల్షి తహసీల్లోని ధద్వాలీ గ్రామంలో భూ వివాదంపై మనోరమ కొంతమందిని తుపాకీతో బెదిరించిన వీడియో వైరల్ కావడంతో పూణే రూరల్ పోలీసులు మనోరమ.. ఆమె భర్త…
తాజావార్తలు
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
Bengal Election: బెంగాల్లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం!
-
Mumbai Indians Unwanted Record: ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే మొదటిసారి!
-
NBK 112 : ‘బాలయ్య-కొరటాల’ మాస్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్
-
Sanju Samson: “నా విజయ రహస్యం ఇదే”.. సెంచరీ వీరుడు సంజూ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!