IND vs SL: భారత్-శ్రీలంక మ్యాచ్ టై..
- భారత్-శ్రీలంక మధ్య తొలి వన్డేలో మ్యాచ్ టై
- 231 పరుగుల లక్ష్యాన్ని భారత్ బ్యాటర్లు..
- చివరి వరకూ పోరాడినప్పటికీ తేలని ఫలితం
- చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన చరిత్ అసలంక.
భారత్-శ్రీలంక మధ్య కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో మ్యాచ్ టై గా ముగిసింది. 231 పరుగుల లక్ష్యాన్ని భారత్ బ్యాటర్లు చివరి వరకూ పోరాడినప్పటికీ.. చరిత్ అసలంక చివరి ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు. శివం దూబే ఇంకాసేపు ఉండుంటే మ్యాచ్ విజయం సాధించే వాళ్లం.. కానీ..చరిత్ అసలంక వేసిన బౌలింగ్లో దూబే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరగా.. ఇంకో ఒక పరుగు చేయాల్సిన ఉండగా, అర్ష్దీప్ సింగ్ కూడా ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు. దీంతో మ్యాచ్.. టై అయింది. 231 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక బౌలర్లు గెలవకుండా కట్టడి చేశారు. భారత్ బ్యాటింగ్ విషయానికొస్తే.. రోహిత్ శర్మ (58) అర్థసెంచరీతో రాణించాడు. మిడిలార్డర్ లో కేఎల్ రాహుల్ (31), అక్షర్ పటేల్ (33), శివం దూబే (25), శ్రేయాస్ అయ్యర్ (23), కోహ్లీ (24), గిల్ (16) పరుగులు చేశారు. శ్రీలంక బౌలింగ్ లో చరిత్ అసలంక, హసరంగ కీలక 3 వికెట్లు తీసి మ్యాచ్ చేజారిపోకుండా ఆపారు. ఆ తర్వాత వెల్లలాగే 2 వికెట్లు.. ధనుంజయ, అశిత ఫెర్నాండో తలో వికెట్ తీశారు.
Theppa Samudram: చైతన్య రావు తెప్ప సముద్రం.. ఎందులో .. ఎక్కడ చూడాలంటే?
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 230 పరుగులు చేసింది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో దునిత్ వెల్లలాగే (67), పతుం నిస్సాంకా (56), హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రీలంక బ్యాటింగ్లో నిస్సాంకా 75 బంతులు ఆడి 56 రన్స్ సాధించాడు. అతని ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు ఉన్నాయి. వెల్లలాగే ఇన్నింగ్స్ లో 65 బంతుల్లో 67 పరుగులు చేశాడు. 2 సిక్సులు, 7 ఫోర్లు సాధించాడు. జనిత్ లియాంగే (20), హసరంగ (24), అఖిలా ధనుంజయ (17), చరిత్ అసలంక (14), కుశాల్ మెండీస్ (14) పరుగులు చేశారు. భారత్ బౌలర్లు సమిష్టిగా రాణించారు. అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు సాధించారు. మహమ్మద్ సిరాజ్, శివం దూబె, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ చొప్పున పడగొట్టారు.
Nadendla Manohar: రేషన్ బియ్యం పంపిణీ చేసే వాహనాల వల్ల ఎలాంటి లాభం లేదు..
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!