IND vs SL: భారత్-శ్రీలంక మ్యాచ్ టై..
- భారత్-శ్రీలంక మధ్య తొలి వన్డేలో మ్యాచ్ టై
- 231 పరుగుల లక్ష్యాన్ని భారత్ బ్యాటర్లు..
- చివరి వరకూ పోరాడినప్పటికీ తేలని ఫలితం
- చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన చరిత్ అసలంక.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-శ్రీలంక మధ్య కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో మ్యాచ్ టై గా ముగిసింది. 231 పరుగుల లక్ష్యాన్ని భారత్ బ్యాటర్లు చివరి వరకూ పోరాడినప్పటికీ.. చరిత్ అసలంక చివరి ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు. శివం దూబే ఇంకాసేపు ఉండుంటే మ్యాచ్ విజయం సాధించే వాళ్లం.. కానీ..చరిత్ అసలంక వేసిన బౌలింగ్లో దూబే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరగా.. ఇంకో ఒక పరుగు చేయాల్సిన ఉండగా, అర్ష్దీప్ సింగ్ కూడా ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు. దీంతో మ్యాచ్.. టై అయింది. 231 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక బౌలర్లు గెలవకుండా కట్టడి చేశారు. భారత్ బ్యాటింగ్ విషయానికొస్తే.. రోహిత్ శర్మ (58) అర్థసెంచరీతో రాణించాడు. మిడిలార్డర్ లో కేఎల్ రాహుల్ (31), అక్షర్ పటేల్ (33), శివం దూబే (25), శ్రేయాస్ అయ్యర్ (23), కోహ్లీ (24), గిల్ (16) పరుగులు చేశారు. శ్రీలంక బౌలింగ్ లో చరిత్ అసలంక, హసరంగ కీలక 3 వికెట్లు తీసి మ్యాచ్ చేజారిపోకుండా ఆపారు. ఆ తర్వాత వెల్లలాగే 2 వికెట్లు.. ధనుంజయ, అశిత ఫెర్నాండో తలో వికెట్ తీశారు.
Theppa Samudram: చైతన్య రావు తెప్ప సముద్రం.. ఎందులో .. ఎక్కడ చూడాలంటే?
Also Read
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
- FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 230 పరుగులు చేసింది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో దునిత్ వెల్లలాగే (67), పతుం నిస్సాంకా (56), హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రీలంక బ్యాటింగ్లో నిస్సాంకా 75 బంతులు ఆడి 56 రన్స్ సాధించాడు. అతని ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు ఉన్నాయి. వెల్లలాగే ఇన్నింగ్స్ లో 65 బంతుల్లో 67 పరుగులు చేశాడు. 2 సిక్సులు, 7 ఫోర్లు సాధించాడు. జనిత్ లియాంగే (20), హసరంగ (24), అఖిలా ధనుంజయ (17), చరిత్ అసలంక (14), కుశాల్ మెండీస్ (14) పరుగులు చేశారు. భారత్ బౌలర్లు సమిష్టిగా రాణించారు. అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు సాధించారు. మహమ్మద్ సిరాజ్, శివం దూబె, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ చొప్పున పడగొట్టారు.
Nadendla Manohar: రేషన్ బియ్యం పంపిణీ చేసే వాహనాల వల్ల ఎలాంటి లాభం లేదు..
తాజావార్తలు
-
NBK 111 : బాలయ్య మాస్ ర్యాంపేజ్.. ఫ్యాన్సీ రేటుకి NBK 111 ఓటీటీ డీల్ క్లోజ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
-
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
-
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్