Tragedy: బైక్పై విద్యుత్ తీగలు పడి భార్యాభర్తలు సజీవ దహనం..
- యూపీలోని బదౌన్ జిల్లాలో తీవ్ర విషాదం
- బైక్పై వెళుతున్న దంపతులపై తెగిపడ్డ హైటెన్షన్ లైన్
- విద్యుత్ ఘాతుకానికి గురై భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని బదౌన్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో.. డేటాగంజ్-బడాయూన్ రహదారిపై హైటెన్షన్ లైన్ తెగిపడి బైక్పై వెళుతున్న దంపతులపై పడింది. దీంతో.. విద్యుత్ ఘాతుకానికి గురై భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ కూడా పూర్తిగా కాలిపోయింది. ఎలాగోలా ప్రజలు హైటెన్షన్ లైన్ను తొలగించారు. కాని అప్పటికే వారి శరీరాలు బాగా కాలిపోయాయి. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. మరోవైపు ప్రమాద సమాచారం అందిన వెంటనే మృతుల కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
Read Also: Paris Olympics 2024: కాంస్య పతకాన్ని కోల్పోయిన ధీరజ్, అంకిత జంట..
Also Read
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
- Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
- ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
వివరాల్లోకి వెళ్తే.. డేటాగంజ్ కొత్వాలి ప్రాంతంలోని దుధారి గ్రామానికి చెందిన దేవ్పాల్ సింగ్ (52) శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తన భార్య మీనా సింగ్ (49)తో కలిసి బైక్పై నగరం నుంచి తన గ్రామానికి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో దేవపాల్ సింగ్ హెల్మెట్ ధరించాడు. అతని బైక్ మూసాజాగ్ గ్రామం సమీపంలోకి చేరుకోగానే.. ఒక్కసారిగా హైటెన్షన్ లైన్ తెగి వారిపై పడడంతో బైక్ పై వెళ్తున్న దంపతులు కిందపడ్డారు. వారికి కరెంటు షాక్ రావడంతో దంపతులు బైక్తో పాటు కాలిపోయి లేవలేకపోయారు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
Read Also: Shubhanshu Shukla: రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లబోతున్న రెండో భారతీయుడు ఇతనే..
బైక్ కూడా మంటల్లో కాలిపోయింది. అనంతరం వారి మృతదేహాలు కూడా కాలిపోయాయి. కాలిపోతున్న మృతదేహాలను చూసి స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రజల సాయంతో స్తంభాలపై ఉన్న హైటెన్షన్ లైన్ను తొలగించారు. అప్పటికి దంపతుల మృతదేహాల కాళ్లు కాలిపోయాయి. ఈ ఘటనపై పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుల కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!