జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాల తనిఖీలు చేస్తుండగా.. అహ్లాన్ గగర్మండు ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
Exxeella ఎడ్యుకేషన్ గ్రూప్ ద్వారా నిర్వహించబడుతున్న Exxeella ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం.. ఆగస్టు 17న హైదరాబాద్లోని T-హబ్లో జరుగనుంది. ఈ కార్యక్రమంలో.. దక్షిణాదిలోని అత్యంత ప్రభావవంతమైన.. నిష్ణాతులైన మహిళలు, వారి సంబంధిత రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించిన, సామాజిక పురోగతికి దోహదపడిన మహిళలను సత్కరించనున్నారు.
కొత్త రేషన్ కార్డుల మంజూరీపై తెలంగాణ ప్రభుత్వం కీలక సమాచారం ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల మంజూరీ పై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయింది. ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉప సంఘం సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహా పాల్గొన్నారు. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.
పారిస్ 2024 ఒలింపిక్స్లో మహిళల 76 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్లో శనివారం జరిగిన క్వార్టర్ఫైనల్లో రీతికా హుడా ఓటమి పాలైంది. 1-1తో కిర్గిస్థాన్కు చెందిన టాప్-సీడ్ ఐపెరి మెడెట్ కైజీ చేతిలో ఓడిపోయింది. కైజీ ఫైనల్కు చేరితే.. రిపీచేజ్ రౌండ్లో రీతికా కాంస్య పతకాన్ని సాధించే అవకాశం ఉంది. అంతకుముందు రీతికా 12-2 టెక్నికల్ ఆధిక్యతతో హంగరీకి చెందిన బెర్నాడెట్ నాగిపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ క్రమంలో.. ఓటమి పాలవ్వడంతో కాంస్య పతకం పైనే ఆశలు ఉన్నాయి.
హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీటీడీపీ నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతుంది. కాగా.. ఈ సమావేశంలో టీటీడీపీ ముఖ్య నేతలు, పొలిట్ బ్యూరో సభ్యులు, జనరల్ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంచాయితీలకు అందించే నిధుల విషయంలో కీలక ప్రకటన చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం ఖర్చుల కోసం ఏటా ప్రభుత్వం చిన్న గ్రామ పంచాయతీలకు రూ.100, పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.250 ఇచ్చేదని.. గత 34 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇంతే మొత్తంలో నిధులు ఇచ్చేదని పవన్ తెలిపారు.
విశాఖ రైల్వే జోన్కు ఏపీ ప్రభుత్వం సరికొత్తగా భూమి కేటాయించనుంది. ఈ క్రమంలో.. వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటు పై పురోగతి ఉంది.. సీఎంతో మాట్లాడానని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎప్పటికప్పుడు సహచర కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత పురుషుల హాకీ జట్టు శనివారం స్వదేశానికి తిరిగి వచ్చింది. ఢిల్లీ విమానాశ్రయంలో భారత ఆటగాళ్లకు డప్పు వాయిద్యాలతో, పూల మాలలు వేసి ఘన స్వాగతం పలికారు. వేసి ఉదయం నుంచి భారత ఆటగాళ్ల కోసం విమానాశ్రయం లోపల అభిమానులు భారీ సంఖ్యలు వేచి ఉన్నారు. ఆటగాళ్లు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.
మహిళల 76 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత మహిళా రెజ్లర్ రితికా క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ఆమె 12-2తో హంగేరీకి చెందిన బెర్నాడెట్ నాగిని టెక్నికల్ సుపీరియారిటీను ఓడించింది. మొదటి రౌండ్ నుంచి రితికా ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించింది. ఈ క్రమంలో భారీ తేడాతో విజయం సాధించింది.
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. భార్య వివాహేతర సంబంధంతో భర్త బలయ్యాడు. మృతుడు విశాఖలోని ఓ ప్రయివేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కట్టుకున్న భార్య, నమ్మిన స్నేహితుడు మోసం చేయడం తట్టుకోలేక హరి ప్రకాష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.