CNG,PNG Price Cut: గ్యాస్ వినియోగదారులకు పీఎం మోడీ న్యూ ఇయర్ గిఫ్ట్.. జనవరి 1 నుంచి తగ్గనున్న CNG-PNG ధరలు
- పీఎం మోడీ న్యూ ఇయర్ గిఫ్ట్
- జనవరి 1 నుంచి తగ్గనున్న CNG-PNG ధరలు
- PNGRB సుంకాల తగ్గింపును ప్రకటించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరికొన్ని రోజుల్లో 2025 కాలగర్భంలో కలిసిపోనున్నది. 2026 కి వెల్ కం చెప్పేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు పీఎం మోడీ కొత్త సంవత్సరం బహుమతి ఇవ్వనున్నారు. జనవరి 1 నుంచి సీఎన్ జీ, పీఎన్జీ ధరలను తగ్గించనున్నారు. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (PNGRB) సుంకాల తగ్గింపును ప్రకటించింది. ఫలితంగా, జనవరి 1, 2026 నుండి CNG, హౌస్ హోల్డ్ నేచురల్ గ్యాస్ పైపు లైన్స్ (PNG) ధరలు యూనిట్కు 2 నుండి 3 రూపాయలు తగ్గుతాయి. PNGRB సభ్యుడు A.K. తివారీ ఈ విషయాన్ని తెలిపారు. కొత్త టారిఫ్ స్ట్రక్చర్ రవాణా రంగం, గృహ వంటగది బడ్జెట్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
Also Read:Tata Sierra: ఏంది మామా ఈ క్రేజ్.. టాటా సియెర్రాకు తొలి రోజే 70,000 బుకింగ్స్..
Also Read
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
గతంలో, గ్యాస్ ధరలు మూడు వేర్వేరు డిస్టెన్స్ బేస్డ్ జోన్స్ పై (200 కి.మీ, 1200 కి.మీ అంతకంటే ఎక్కువ) ఆధారపడి ఉండేవి. ఇది ఇప్పుడు కేవలం రెండు జోన్లకు తగ్గించారు. కొత్త వ్యవస్థ కింద, జోన్ 1 రేటు గతంలో 80 రూపాయలు, 107 రూపాయలతో పోలిస్తే 54 రూపాయలకు రేషనలైజ్ అయ్యింది. ఈ సరళీకరణ భారతదేశం అంతటా ఏకరీతిలో వర్తిస్తుంది. ప్రయోజనాలు సాధారణ వినియోగదారులకు నేరుగా చేరుతాయి. ఈ నిర్ణయం భారతదేశం అంతటా 312 భౌగోళిక ప్రాంతాలలో పనిచేస్తున్న 40 సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) కంపెనీలను ప్రభావితం చేస్తుంది.
తగ్గిన రేట్ల పూర్తి ప్రయోజనాలను నేరుగా వినియోగదారులకు అందించాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. కంపెనీలు ధరల తగ్గింపులను ప్రజలకు బదిలీ చేస్తున్నాయా లేదా అని నియంత్రణ బోర్డు పర్యవేక్షిస్తుంది. ఇది ప్రైవేట్ వాహనాలు, టాక్సీ డ్రైవర్లకు మాత్రమే ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, పైపుల ద్వారా గ్యాస్ను ఉపయోగించే గృహ వినియోగదారుల ఖర్చును కూడా తగ్గిస్తుంది.
Also Read:Sunny Leone : న్యూఇయర్ ట్రీట్’కి రెడీ అయిన సన్నీ
ఈ తగ్గింపు ద్వారా దేశవ్యాప్తంగా సహజ వాయువు వినియోగాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వం లక్ష్యం. ఈ దిశగా, వ్యాట్ను తగ్గించడానికి, మౌలిక సదుపాయాల విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు సంయుక్తంగా దేశవ్యాప్తంగా గ్యాస్ నెట్వర్క్లను విస్తరిస్తున్నాయి. సరసమైన రేట్లు, సులభమైన లభ్యత భవిష్యత్తులో క్లీన్ ఎనర్జీ వినియోగంలో గణనీయమైన పెరుగుదలకు దారితీస్తాయని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ట్రెండింగ్
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!