Jammu Kashmir: అనంతనాగ్ జిల్లాలో ఎదురుకాల్పులు.. ఇద్దరు సైనికులు మృతి
- జమ్మూకాశ్మీర్ : అనంతనాగ్ జిల్లాలో ఎదురుకాల్పులు
- కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి
- ఉగ్రవాదుల కాల్పుల్లో మరో ముగ్గురికి తీవ్రగాయాలు
- ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాల తనిఖీలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాల తనిఖీలు చేస్తుండగా.. అహ్లాన్ గగర్మండు ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇంకా.. అహ్లాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. సెర్చ్ టీమ్పై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. దీనికి ధీటుగా సైనికులు కూడా కాల్పులు జరుపుతున్నారు.
Read Also: Delhi: ఢిల్లీలో కూలిన బిల్డింగ్.. ఒకరి మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
ఇదిలా ఉంటే.. ఆగస్టు 6వ తేదీన బసంత్గఢ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. రెండు గంటల పాటు కాల్పులు మోత మోగింది. భద్రతా దళాలు సాయంత్రం వరకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. అడవిలో దాక్కున్న ఉగ్రవాదులపై సైన్యం గాలింపును పెంచింది. ఈ కాల్పుల్లో ఉగ్రవాదులెవరూ హతమైనట్లు సమాచారం లేదు. అంతకు ముందు ఒక రోజు.. భద్రతా దళాలు అనంత్నాగ్లో ముగ్గురు టెర్రరిస్టులను అరెస్టు చేశాయి. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఉగ్రవాదులను దావూద్ అహ్మద్ దార్, ఇంతియాజ్ అహ్మద్ రేషి, షాహిద్ అహ్మద్ దార్లుగా గుర్తించారు. ఈ ముగ్గురూ హసన్పోరా తవేలా నివాసితులు అని పోలీసులు కనుగొన్నారు.
Read Also: TV somanathan: కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా టీవీ సోమనాథన్ నియామకం
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!