వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. భార్య భర్తలు సంతోషంగా బతుకుతున్న సమయంలో.. వారి జీవితంలోకి కొందరు మృగాళ్లు చేరి సంసారాన్ని ఆగం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. భార్య వివాహేతర సంబంధంతో భర్త బలయ్యాడు. మృతుడు విశాఖలోని ఓ ప్రయివేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కట్టుకున్న భార్య, నమ్మిన స్నేహితుడు మోసం చేయడం తట్టుకోలేక హరి ప్రకాష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీతంపేటలో విగ్నేశ్వర విల్లాలోని F11లో హరిప్రకాష్, భువనేశ్వరి కాపురం ఉంటున్నారు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కాగా.. మొదటి భార్యకు 12 ఏళ్ల కుమార్తె ఉంది.
Read Also: Mamata Banerjee: డాక్టర్ హత్యపై సీఎం కీలక వ్యాఖ్యలు.. అవసరమైతే నిందితుల్ని ఉరితీస్తామని ప్రకటన
అయితే.. స్నేహితుడు రాజేష్తో భువనేశ్వరి వివాహేతర సంబంధాలు ఉన్నాయని.. ఈ క్రమంలో అతన్ని వారు తీవ్రంగా వేధించే వారని మృతుడు హరి ప్రకాష్ చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో చెప్పాడు. ఆ వేధింపులు భరించలేకనే తన ప్రాణాలు తీసుకుంటున్నట్టు తెలిపాడు. అలాగే, భువనేశ్వరికి ఆమె బావతోనూ సంబంధాలు ఉన్నాయని ఆరోపించాడు హరి ప్రకాష్. ఆరు పేజీల మరణ వాంగ్మూలం కూడా విడుదల చేశారు. రెండవ భార్య భువనేశ్వరి పెట్టే బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడు. చనిపోయే ముందు కుటుంబ సభ్యులకు తన ఆవేదన చెప్పుకున్న తీరు కలచి వేస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజేష్ పరారీలో ఉండగా.. హరి ప్రకాష్ కుటుంబం ఈ ఘటనపై ద్వారకా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Read Also: National Disaster: జాతీయ విపత్తు అంటే ఏంటి?.. వయనాడు ఘటనపై కేంద్ర వైఖరి?