Indian Hockey Team: ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారత హాకీ జట్టుకు ఘన స్వాగతం..
- పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకుని..
- స్వదేశానికి తిరిగి వచ్చిన భారత పురుషుల హాకీ జట్టు
- ఢిల్లీ విమానాశ్రయంలో భారత ఆటగాళ్లకు పూల మాలలు వేసి ఘన స్వాగతం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత పురుషుల హాకీ జట్టు శనివారం స్వదేశానికి తిరిగి వచ్చింది. ఢిల్లీ విమానాశ్రయంలో భారత ఆటగాళ్లకు డప్పు వాయిద్యాలతో, పూల మాలలు వేసి ఘన స్వాగతం పలికారు. వేసి ఉదయం నుంచి భారత ఆటగాళ్ల కోసం విమానాశ్రయం లోపల అభిమానులు భారీ సంఖ్యలు వేచి ఉన్నారు. ఆటగాళ్లు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. ఇదిలా ఉంటే.. పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత భారత హాకీ జట్టు ఆటగాళ్లు ఢిల్లీ విమానాశ్రయం వెలుపల సంబరాలు చేసుకున్నారు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ సంబరాలు చేసుకున్నారు.
S Jaishankar: మాల్దీవుల ప్రెసిడెంట్తో జైశంకర్ భేటీ..ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ..
Also Read
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
- FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
ఈ సందర్భంగా హాకీ ఇండియా జనరల్ సెక్రటరీ భోళనాథ్ సింగ్ మాట్లాడుతూ.. పారిస్ ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో జెండా బేరర్గా పీఆర్ శ్రీజేష్ ఎంపిక కావడం గురించి మాట్లాడారు. పిఆర్ శ్రీజేష్ ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో పతాకధారిగా అర్హుడని తెలిపారు. భారత ప్రభుత్వం, భారత ఒలింపిక్ కమిటీ అతనికి ఈ అవకాశాన్ని కల్పించినందుకు హాకీ ఇండియా తరుఫున ధన్యవాదాలు తెలిపారు. వరుసగా రెండు పతకాలు సాధించడం ఒక గొప్ప విజయం అని అన్నారు. తమ లక్ష్యం ఫైనల్ ఆడటం, కానీ అమిత్ రోహిదాస్ను సిట్ అవుట్ చేయడంలో రిఫరీ చేసిన పొరపాటు కారణంగా తాము ఓడిపోయామన్నారు. అందుకే తాము కాంస్య పతకంతో ఇక్కడకు వచ్చాము. లేకుంటే పతకం రంగు మారి ఉండేదని పేర్కొన్నారు.
Manish Sisodia: అలా చేస్తే 24 గంటల్లో కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వస్తారు..
టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత హాకీ జట్టు పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే.. మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పారిస్లో కూడా భారత్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కాంస్య పతక పోరులో భారత్ 2-1తో స్పెయిన్ను ఓడించింది. అంతకుముందు సెమీస్లో జర్మనీ చేతిలో భారత్ 3-2 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 1980లో మాస్కో ఒలింపిక్స్ తర్వాత హాకీలో భారత్ స్వర్ణం సాధించలేదు. హాకీలో భారత్ ఇప్పటి వరకు ఎనిమిది స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించింది. భారత పురుషుల హాకీ జట్టు 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్లో పతకాలు సాధించింది. ఇంతకు ముందు 1968, 1972లో పతకాలు సాధిచింది.
Our Heroes are back!
Current mood: 🥳🎊🕺🏻🥁#BronzeMedalists #BackHome #HockeyIndia pic.twitter.com/MA78WcZS7q
— Hockey India (@TheHockeyIndia) August 10, 2024
తాజావార్తలు
-
Galla Siddharth : సౌత్ కొరియా అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి వివాహం
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ishqnama Trailer: సరిహద్దులు దాటిన ప్రేమ.. హృదయాలను కదిలిస్తున్న ‘ఇష్క్నామా’ ట్రైలర్
-
Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
-
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!