Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్లో రితికా ఓటమి.. కాంస్యం మీదే ఆశలు
- క్వార్టర్ఫైనల్లో రీతికా హుడా ఓటమి
- కిర్గిస్థాన్కు చెందిన టాప్-సీడ్ ఐపెరి మెడెట్ కైజీ చేతిలో పరాజయం
- రిపీచేజ్ రౌండ్లో రీతికా కాంస్య పతకాన్ని సాధించే అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ 2024 ఒలింపిక్స్లో మహిళల 76 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్లో శనివారం జరిగిన క్వార్టర్ఫైనల్లో రీతికా హుడా ఓటమి పాలైంది. 1-1తో కిర్గిస్థాన్కు చెందిన టాప్-సీడ్ ఐపెరి మెడెట్ కైజీ చేతిలో ఓడిపోయింది. కైజీ ఫైనల్కు చేరితే.. రిపీచేజ్ రౌండ్లో రీతికా కాంస్య పతకాన్ని సాధించే అవకాశం ఉంది. అంతకుముందు రీతికా 12-2 టెక్నికల్ ఆధిక్యతతో హంగరీకి చెందిన బెర్నాడెట్ నాగిపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ క్రమంలో.. ఓటమి పాలవ్వడంతో కాంస్య పతకం పైనే ఆశలు ఉన్నాయి.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
క్వార్టర్ ఫైనల్లో కిర్గిజ్స్థాన్కు చెందిన ఐపెరి మెటెట్తో మొదట డ్రా అయింది. ఆ తర్వాత రితికా చివరి పాయింట్ను కోల్పోయింది. ప్రారంభంలో ఒక పాయింట్ ఆధిక్యాన్ని పొందగలిగిన రితికా.. రెండో భాగంలో గట్టిపోటీ ఇచ్చింది. మ్యాచ్కి చివరి పాయింట్గా రుజువైన ‘పాసివిటీ (ఓవర్ డిఫెన్సివ్ యాటిట్యూడ్)’ కారణంగా రితికా పాయింట్ కోల్పోయింది. 21 ఏళ్ల రితికా మొదటిసారి ఒలింపిక్స్లో ఆడుతుంది. ఈ వెయిట్ కేటగిరీలో ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత దేశానికి చెందిన తొలి రెజ్లర్గా రితిక రికార్డులకెక్కింది. కాగా.. ఈ ఒలింపిక్స్లో రెజ్లింగ్ నిబంధనలు భారత్ స్వర్ణ పతక ఆశలకు పెద్ద దెబ్బ తీశాయి. రితికా కంటే ముందు వినేష్ ఫోగట్ కూడా పతకం సాధించలేకపోయింది. ఆమె బరువు కేవలం 100 గ్రాములు ఎక్కువ ఉన్న కారణం వల్ల ఫైనల్ ఆడలేకపోయింది. నిబంధనల ఆధారంగా ఆమెను అనర్హులుగా ప్రకటించారు.
AP CM Chandrababu: ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు అధ్యక్షతన టీటీడీపీ నేతల భేటీ..
రితికా రోహ్తక్లోని ఖడ్కడ గ్రామంలో భారతీయ నావికాదళానికి చెందిన అధికారి. ఆమె ఇండియన్ నేవీలో అధికారి, చీఫ్ పీటీ ఆఫీసర్గా పనిచేసింది. 2022లో జరిగిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లో 72 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆ తరువాత.. టిరానాలో 2023లో జరిగిన అండర్-23 ప్రపంచ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. 2024లోనే ఆసియా ఛాంపియన్షిప్లో 72 కేజీల విభాగంలో రితికా కాంస్య పతకం సాధించింది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..