Rajesh Veeramalla
Author- NTV Telugu-
Vinesh Phogat: వినేశ్ ఫొగట్ అప్పీల్పై ఈరోజు రాత్రి తీర్పు..!
అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.. కాగా.. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసిన వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై ఈరోజు రాత్రి 9:30 గంటలలోపు తీర్పు వెలువడే అవకావం ఉంది. -
Warangal: ఎంజీఎంలో దారుణం.. నాలుగు రోజుల పసికందును పీక్కుతిన్న కుక్కలు
ఎంజీఎంలో దారుణం చోటు చేసుకుంది. నాలుగు రోజుల పసి గుడ్డును కుక్కలు పిక్కోని తింటున్న దృశ్యం దర్శనమిచ్చింది. ఈ ఘటన ఎక్కడో ఆస్పత్రి ఆవరణలోని మూల ప్రాంతంలో కాదు.. అందరూ తిరుగుతుండే క్యాజువాలిటీ ముందు కనిపించింది. అయితే.. ఈ పసికందును కుక్కలు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాయనే వివరాలను ఆస్పత్రి అధికారులు, పోలీసులు సేకరిస్తున్నారు. పసికందు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
CMR Shopping Mall: సీఎంఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభించిన పాయల్ రాజ్పుత్..
తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్ గ్రూప్ తమ 32వ షాపింగ్ మాల్ను కరీంనగర్లోని మార్కెట్ రోడ్ లో శుక్రవారం ఉదయం 9.38 గం.కు భూంరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా చలిమెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆచలిమెడ లక్ష్మీ నరసింహరావు, డా. వి. సూర్యనారాయణ రెడ్డి. డా. భూంరెడ్డి హాస్పిటల్స్, డా. వి. రమాదేవి, మొదటి కొనుగోలుదారు చిదుర సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
Nizamabad: ఏసీబీ వలకు చిక్కిన రెవెన్యూ అధికారి.. భారీ మొత్తంలో నగదు సీజ్
నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఓ అవినీతి తిమింగలం బయటపడింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి ఏసీబీ సోదాలు చేపట్టారు. మొత్తంగా రూ.6.7 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. -
Sachin Tendulkar: ‘రజతానికి’ వినేశ్ అర్హురాలే..
ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్స్కు చేరిన వినేశ్ ఫొగాట్కు.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలిచారు. ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్కు చేరిన వినేశ్.. అదనపు బరువు కారణంగా పతకానికి దూరమైంది. ఈ క్రమంలో.. వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) కోర్టును ఆశ్రయించారు. కాగా.. ఈ అంశంపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. రజత పతకానికి వినేశ్ ఫొగాట్ అర్హురాలేనని అన్నారు. -
Cabinet sub-committee: సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం..
నీటి పారుదల ప్రాజెక్టులలో పూడిక తీత అంశంపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సయిజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. -
Konda Surekha: సీఎం అమెరికా టూర్ పై కేటీఆర్ విమర్శలు.. మంత్రి ఆగ్రహం
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పై కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళింది ఆయన తమ్ముడి కంపెనీ కోసం అని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని.. కేటీఆర్ గతంలో అమెరికా వెళ్ళినప్పుడు ఏం చేశారో, ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారో తెలుసన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ నేతలు పందికొక్కుల్ల దోచుకుతిన్నారని మండిపడ్డారు. -
Mohammed Siraj: క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు జూబ్లీహిల్స్లో ఇంటి స్థలం కేటాయింపు..
క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. జూబ్లీహిల్స్లో 600చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ.. ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. టీ20 ప్రపంచకప్ భారత్ జట్టు టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. -
Modi-Neeraj Chopra: ‘మరోసారి దేశం గర్వపడేలా చేశావు..’ నీరజ్ చోప్రాతో ఫోన్లో ప్రధాని
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు రజత పతకం సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో ప్రధాని మోడీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. అంతేకాకుండా.. నీరజ్ చోప్రాను అభినందించారు.. అతని గాయం గురించి అప్డేట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా.. నీరజ్ తల్లి క్రీడా స్ఫూర్తిని కూడా ప్రధాని ప్రశంసించారు. -
AMGEN: హైదరాబాద్లో మరో అతి పెద్ద కంపెనీ.. వేలల్లో ఉద్యోగావకాశాలు
అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ (AMGEN) తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది. హైదరాబాద్లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఈ సెంటర్ ఉంటుంది. దాదాపు 3 వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచే కంపెనీ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్జెన్ ఆర్ అండ్ డీ కేంద్రంలో…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!