Rajesh Veeramalla
Author- NTV Telugu-
Ministry of Defence: సుఖోయ్ ఇంజిన్ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం.. 26 వేల కోట్ల ఒప్పందంపై సంతకం
దేశ రక్షణ శక్తి నిరంతరం బలపడుతోంది. దీంతో.. రక్షణ శాఖ రక్షణ రంగంలో స్వావలంబనను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) నుంచి సుఖోయ్-30 విమానాలకు సంబంధించిన 240 ఏఎల్-31 ఎఫ్పీ ఏరో ఇంజిన్ల కొనుగోలుకు రూ.26 వేల కోట్లతో ఒప్పందం కుదిరింది. రక్షణ మంత్రిత్వ శాఖ, హెచ్ఏఎల్ సీనియర్ అధికారులు సోమవారం ఒప్పందంపై సంతకం చేశారు. -
Indian Hockey Team: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో మెరిసిన భారత హాకీ జట్టు.. జపాన్పై విజయం
సోమవారం జరిగిన పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో జపాన్పై డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్.. 5-1 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనను కనబరిచింది. -
Vijayawada: వరద బాధితుడిని చెంపదెబ్బ కొట్టిన వీఆర్వో..
వరదల నుంచి కోలుకుంటున్న ఓ గ్రామాన్ని పరిశీలించడానికి వచ్చిన వీఆర్వో, వరద బాధితుడిపై చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటన అజిత్ సింగ్ నగర్ షాది ఖానా రోడ్డులో జరిగింది. వరదలు వచ్చినప్పటీ నుంచి ఫుడ్, కనీసం వాటర్ సప్లై కూడా లేదని బాధితులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం చెప్పినా.. సచివాలయం 259 వార్డు వీఆర్వో విజయలక్ష్మి పట్టించుకోవటం లేదని ఆరోపించారు. దీంతో.. ఇదే విషయంపై వాగ్వివాదం జరగటంతో స్థానికుడిపై ఆగ్రహంతో వీఆర్వో చెంప చెళ్లుమనిపించింది. -
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో ఇద్దరికి బెయిల్..
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో ఇద్దరు నిందితులకు బెయిల్ లభించింది. మనీ లాండరింగ్ కేసులో మద్యం వ్యాపారి సమీర్ మహేంద్ర, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వాలంటీర్ చన్ప్రీత్ సింగ్లకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కవిత, విజయ్ నాయర్ కూడా ఇదే కేసులో బెయిల్పై బయటకు వచ్చారు. అనంతరం.. ఈ ఇద్దరికీ బెయిల్ మంజూరైంది. -
Lord Ganesh: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశుడి విగ్రహం ఎక్కడుందో తెలుసా..?
భారతదేశంలోనే కాదు వేరే దేశంలో కూడా గణపతి భారీ విగ్రహం ఉంది. అది ఎక్కడంటే.. థాయిలాండ్, ఖ్లాంగ్ ఖ్వాన్ ప్రాంతంలోని గణేష్ ఇంటర్నేషనల్ పార్క్లో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం 128 అడుగులు.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహంగా గుర్తింపు పొందింది. -
Delhi: ఢిల్లీలో బాణాసంచా తయారీ, ఆన్లైన్ విక్రయాలపై నిషేధం..
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బాణాసంచా తయారీ, ఆన్లైన్ విక్రయాలపై నిషేధం విధించింది. వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 వరకు బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకం, వాడకాన్ని నిషేధించింది. -
Odisha Govt: బంగ్లాదేశీయులు సముద్రం గుండా భారత్లోకి ప్రవేశించడంపై ఒడిశా ప్రభుత్వం క్లారిటీ..
బంగ్లాదేశ్లో రాజకీయ గందరగోళం, హిందువులపై పెరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో.. హిందువులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. సరిహద్దుల్లో వేలాది మంది హిందువులను భద్రతా అధికారులు అడ్డుకున్నారు. -
CM Chandrababu: ఆక్రమణలు తొలగించేలా పటిష్ట చట్టం తెస్తాం..
ఆక్రమణలు తొలగించేలా పటిష్ట చట్టం తెస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా.. బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని పేర్కొన్నారు. -
IND vs BAN: బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు భారత జట్టు ప్రకటన..
బంగ్లాదేశ్తో జరగనున్న తొలి టెస్టుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 21 నెలల తర్వాత రిషబ్ పంత్ మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చాడు. కేఎల్ రాహుల్కు కూడా స్థానం లభించింది. అలాగే యంగ్ అండ్ డాషింగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్కు జట్టులో చోటు దక్కింది. శ్రేయస్ అయ్యర్ను పక్కన పెట్టారు. మరోవైపు.. బౌలర్ యశ్ దయాళ్ను కూడా అదృష్టం వరించింది. -
Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో రెండు జిల్లాల్లో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో.. వరద ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. ఎప్పటికప్పుడూ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు.. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్టు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ కలెక్టరేట్లో సైక్లోన్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Survival Thriller: గుహల్లో చిక్కుకున్న స్నేహితులు.. ప్రాణాలు తీసే రహస్య జీవి… వణికించబోతున్న సర్వైవల్ థ్రిల్లర్
-
Kannada Villains : తెలుగు సినిమాల్లో బలమైన విలన్లుగా ముద్ర వేస్తున్నారు కన్నడ నటులు
-
Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
-
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
-
Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!