Odisha Govt: బంగ్లాదేశీయులు సముద్రం గుండా భారత్లోకి ప్రవేశించడంపై ఒడిశా ప్రభుత్వం క్లారిటీ..
- పెద్ద సంఖ్యలో ఇండియాలోకి ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయలు
- సరిహద్దుల్లో అడ్డుకుంటున్న భద్రతా అధికారులు
- స్పందించిన ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్
- ఒడిశాలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను గుర్తించి త్వరలోనే వారి దేశానికి పంపిస్తాం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్లో రాజకీయ గందరగోళం, హిందువులపై పెరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో.. హిందువులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. సరిహద్దుల్లో వేలాది మంది హిందువులను భద్రతా అధికారులు అడ్డుకున్నారు. మరోవైపు.. బంగ్లాదేశీయులు సముద్ర మార్గం ద్వారా ఇండియాలోకి ప్రవేశించవచ్చని చాలా నివేదికలు చెబుతున్నాయి. దీనిపై ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో జరిగిన హింసాకాండ తర్వాత సముద్ర మార్గం ద్వారా బంగ్లాదేశీయులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు ఎలాంటి నివేదిక అందలేదన్నారు.
Read Also: Rahul Gandhi: తెలుగు భాష ముఖ్యం కాదంటే.. అక్కడి వారిని అవమానించిట్లే..
Also Read
- రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
- Uday Krishna Reddy: నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఆరోపణలు అన్నీ అవాస్తవం.. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా!
- Super El Nino: ఊహకందని విపత్తు... మానవాళికి ముప్పు తప్పదా?
- Vaibhav Sooryavanshi: డాన్ బ్రాడ్మన్తో వైభవ్ సూర్యవంశీకి పోలిక.. మాజీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ఒడిశాలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను గుర్తించి త్వరలోనే వారి దేశానికి పంపిస్తామని హరిచందన్ తెలిపారు. బంగ్లాదేశ్తో 480 కి.మీ పొడవైన సముద్ర సరిహద్దు వెంబడి ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్.. ఒడిశా మెరైన్ పోలీసులు మూడంచెల భద్రతను నిర్వహిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో రాజకీయ గందరగోళం మధ్య సముద్ర మార్గం ద్వారా బంగ్లాదేశీయులు ఒడిశాలోకి ప్రవేశించే అవకాశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు హరిచందన్ స్పందిస్తూ.. అలాంటి ప్రయత్నాలను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కోస్ట్ గార్డ్, ఒడిశా మెరైన్ పోలీసులను ఆదేశించారన్నారు. అంతేకాకుండా.. బీచ్లో పెట్రోలింగ్కు ఆదేశించినట్లు తెలిపారు.
Read Also: Rishabh Pant: భారత క్రికెట్ అభిమానుల వల్లే ఆ బంతి సిక్స్ వెళ్లలేదు.. టీ20 ప్రపంచకప్పై పంత్!
కొందరు బంగ్లాదేశీయులు ఒడిశాలో చాలా కాలంగా నివసిస్తున్నారని హరిచందన్ చెప్పారు. వీసా, వర్క్ పర్మిట్ ఉంటేనే రాష్ట్రంలో ఉండటానికి ప్రభుత్వం ధృవీకరిస్తుందన్నారు. ధృవీకరణ తర్వాత, అక్రమ చొరబాటుదారులను పంపుతామని తెలిపారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఒడిశాలోని ఏడు జిల్లాల్లో మొత్తం 3,740 మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను గుర్తించారు. వీరిలో కేంద్రపారాలో 1,649 మంది, జగత్సింగ్పూర్లో 1,112 మంది, మల్కన్గిరిలో 655 మంది అక్రమంగా నివసిస్తున్నారు.
- Tags
- bangladeshis
- enter
- india
- Odisha Govt
- sea
తాజావార్తలు
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
PM Modi: ప్రధాని మోడీకి మెటా క్షమాపణలు.. సాంకేతిక లోపమే కారణమని స్పష్టీకరణ
-
Chennai Love Story:’చెన్నై లవ్ స్టోరీ’ గ్రాండ్ సక్సెస్ మీట్.. కిరణ్ అబ్బవరం ఎమోషనల్, నాగచైతన్యకు ప్రత్యేక కృతజ్ఞతలు!
-
Uday Krishna Reddy: నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఆరోపణలు అన్నీ అవాస్తవం.. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా!
-
Super El Nino: ఊహకందని విపత్తు… మానవాళికి ముప్పు తప్పదా?
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!