Odisha Govt: బంగ్లాదేశీయులు సముద్రం గుండా భారత్లోకి ప్రవేశించడంపై ఒడిశా ప్రభుత్వం క్లారిటీ..
- పెద్ద సంఖ్యలో ఇండియాలోకి ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయలు
- సరిహద్దుల్లో అడ్డుకుంటున్న భద్రతా అధికారులు
- స్పందించిన ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్
- ఒడిశాలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను గుర్తించి త్వరలోనే వారి దేశానికి పంపిస్తాం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్లో రాజకీయ గందరగోళం, హిందువులపై పెరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో.. హిందువులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. సరిహద్దుల్లో వేలాది మంది హిందువులను భద్రతా అధికారులు అడ్డుకున్నారు. మరోవైపు.. బంగ్లాదేశీయులు సముద్ర మార్గం ద్వారా ఇండియాలోకి ప్రవేశించవచ్చని చాలా నివేదికలు చెబుతున్నాయి. దీనిపై ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో జరిగిన హింసాకాండ తర్వాత సముద్ర మార్గం ద్వారా బంగ్లాదేశీయులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు ఎలాంటి నివేదిక అందలేదన్నారు.
Read Also: Rahul Gandhi: తెలుగు భాష ముఖ్యం కాదంటే.. అక్కడి వారిని అవమానించిట్లే..
Also Read
- Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
- Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
- Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
ఒడిశాలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను గుర్తించి త్వరలోనే వారి దేశానికి పంపిస్తామని హరిచందన్ తెలిపారు. బంగ్లాదేశ్తో 480 కి.మీ పొడవైన సముద్ర సరిహద్దు వెంబడి ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్.. ఒడిశా మెరైన్ పోలీసులు మూడంచెల భద్రతను నిర్వహిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో రాజకీయ గందరగోళం మధ్య సముద్ర మార్గం ద్వారా బంగ్లాదేశీయులు ఒడిశాలోకి ప్రవేశించే అవకాశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు హరిచందన్ స్పందిస్తూ.. అలాంటి ప్రయత్నాలను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కోస్ట్ గార్డ్, ఒడిశా మెరైన్ పోలీసులను ఆదేశించారన్నారు. అంతేకాకుండా.. బీచ్లో పెట్రోలింగ్కు ఆదేశించినట్లు తెలిపారు.
Read Also: Rishabh Pant: భారత క్రికెట్ అభిమానుల వల్లే ఆ బంతి సిక్స్ వెళ్లలేదు.. టీ20 ప్రపంచకప్పై పంత్!
కొందరు బంగ్లాదేశీయులు ఒడిశాలో చాలా కాలంగా నివసిస్తున్నారని హరిచందన్ చెప్పారు. వీసా, వర్క్ పర్మిట్ ఉంటేనే రాష్ట్రంలో ఉండటానికి ప్రభుత్వం ధృవీకరిస్తుందన్నారు. ధృవీకరణ తర్వాత, అక్రమ చొరబాటుదారులను పంపుతామని తెలిపారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఒడిశాలోని ఏడు జిల్లాల్లో మొత్తం 3,740 మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను గుర్తించారు. వీరిలో కేంద్రపారాలో 1,649 మంది, జగత్సింగ్పూర్లో 1,112 మంది, మల్కన్గిరిలో 655 మంది అక్రమంగా నివసిస్తున్నారు.
- Tags
- bangladeshis
- enter
- india
- Odisha Govt
- sea
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!