Odisha Govt: బంగ్లాదేశీయులు సముద్రం గుండా భారత్లోకి ప్రవేశించడంపై ఒడిశా ప్రభుత్వం క్లారిటీ..
- పెద్ద సంఖ్యలో ఇండియాలోకి ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయలు
- సరిహద్దుల్లో అడ్డుకుంటున్న భద్రతా అధికారులు
- స్పందించిన ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్
- ఒడిశాలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను గుర్తించి త్వరలోనే వారి దేశానికి పంపిస్తాం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్లో రాజకీయ గందరగోళం, హిందువులపై పెరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో.. హిందువులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. సరిహద్దుల్లో వేలాది మంది హిందువులను భద్రతా అధికారులు అడ్డుకున్నారు. మరోవైపు.. బంగ్లాదేశీయులు సముద్ర మార్గం ద్వారా ఇండియాలోకి ప్రవేశించవచ్చని చాలా నివేదికలు చెబుతున్నాయి. దీనిపై ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో జరిగిన హింసాకాండ తర్వాత సముద్ర మార్గం ద్వారా బంగ్లాదేశీయులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు ఎలాంటి నివేదిక అందలేదన్నారు.
Read Also: Rahul Gandhi: తెలుగు భాష ముఖ్యం కాదంటే.. అక్కడి వారిని అవమానించిట్లే..
Also Read
ఒడిశాలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను గుర్తించి త్వరలోనే వారి దేశానికి పంపిస్తామని హరిచందన్ తెలిపారు. బంగ్లాదేశ్తో 480 కి.మీ పొడవైన సముద్ర సరిహద్దు వెంబడి ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్.. ఒడిశా మెరైన్ పోలీసులు మూడంచెల భద్రతను నిర్వహిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో రాజకీయ గందరగోళం మధ్య సముద్ర మార్గం ద్వారా బంగ్లాదేశీయులు ఒడిశాలోకి ప్రవేశించే అవకాశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు హరిచందన్ స్పందిస్తూ.. అలాంటి ప్రయత్నాలను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కోస్ట్ గార్డ్, ఒడిశా మెరైన్ పోలీసులను ఆదేశించారన్నారు. అంతేకాకుండా.. బీచ్లో పెట్రోలింగ్కు ఆదేశించినట్లు తెలిపారు.
Read Also: Rishabh Pant: భారత క్రికెట్ అభిమానుల వల్లే ఆ బంతి సిక్స్ వెళ్లలేదు.. టీ20 ప్రపంచకప్పై పంత్!
కొందరు బంగ్లాదేశీయులు ఒడిశాలో చాలా కాలంగా నివసిస్తున్నారని హరిచందన్ చెప్పారు. వీసా, వర్క్ పర్మిట్ ఉంటేనే రాష్ట్రంలో ఉండటానికి ప్రభుత్వం ధృవీకరిస్తుందన్నారు. ధృవీకరణ తర్వాత, అక్రమ చొరబాటుదారులను పంపుతామని తెలిపారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఒడిశాలోని ఏడు జిల్లాల్లో మొత్తం 3,740 మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను గుర్తించారు. వీరిలో కేంద్రపారాలో 1,649 మంది, జగత్సింగ్పూర్లో 1,112 మంది, మల్కన్గిరిలో 655 మంది అక్రమంగా నివసిస్తున్నారు.
- Tags
- bangladeshis
- enter
- india
- Odisha Govt
- sea
తాజావార్తలు
-
Schools Closed: విద్యార్థులకు అలర్ట్.. నేడు పాఠశాలలు బంద్..
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Rain Forecast: మరో గంటలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
-
Skoda Slavia Facelift: స్కోడా స్లావియా ఫేస్లిఫ్ట్ 2026 వచ్చేసింది.. 360° కెమెరా, రియర్ సీట్ మసాజ్తో అదిరిపోయే ఫీచర్లు
-
IND vs SL: విజయం ముంగిట భారత్.. వరుణుడు కరుణిస్తాడా..?
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!