CM Chandrababu: ఆక్రమణలు తొలగించేలా పటిష్ట చట్టం తెస్తాం..
- ఆక్రమణలు తొలగించేలా పటిష్ట చట్టం తెస్తాం- సీఎం చంద్రబాబు
- బుడమేరు ఆక్రమణలు తొలగిస్తాం- చంద్రబాబు
- కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోం- సీఎం.
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం తెలిపింది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని.. రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆక్రమణలు తొలగించేలా పటిష్ట చట్టం తెస్తామని అన్నారు. అంతేకాకుండా.. బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని పేర్కొన్నారు. కొల్లేరులో ఆక్రమణలు వల్ల నీరు వెనక్కి తన్నే పరిస్థితి ఉంది.. దీనిని పరిశీలించి ఆక్రమణలు కొట్టేస్తామన్నారు. రాజకీయ అండతో కొందరు విచ్చలవిడిగా చేశారు.. ప్రజా భద్రత కంటే ఈ ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తున్నాం.. 5 ఏళ్లలో డ్రైన్ లన్నీ నాశనం చేశారని దుయ్యబట్టారు. అన్నీ కూడా ఆధునికీకరిస్తాం అని చంద్రబాబు చెప్పారు.
Also Read
- Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
- CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
వరద రావటానికి కారణాలు, ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలు గవర్నర్ కు నివేదించానని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ చర్యల పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. త్వరలోనే సాధారణ పరిస్థితి నెలకొంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఏలేరు ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉధృతిని నిశితంగా పరిశీలిస్తూ అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే.. విశాఖ, అల్లూరి జిల్లాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం గుర్తించి ముందస్తు హెచ్చరికలు పంపామని ముఖ్యమంత్రి తెలిపారు. మరోవైపు.. విజయవాడలో అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. ప్రతీ బృందాన్ని జవాబుదారీతనంగా పెట్టి పారిశుద్ధ్యం, ఆహారం పంపిణీ చేపట్టామన్నారు. గత 8 రోజుల్లో 97లక్షల మందికి పైగా సరిపడా ఆహారo పంపిణీ చేశాం.. బుడమేరు ఇన్ ఫ్లో, నగరంలో పడే వర్షపాతం, తదితర అధ్యయనాలతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో ప్రజలు కూడా అర్ధం చేసుకోవాలి.. మరోవైపు, దెబ్బతిన్న వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు బాగు చేపించటం ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది సీఎం చెప్పారు.
కాగా.. బుడమేరు కాలువకు గండ్లు పడడంతో.. విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లు అతలాకుతలం అయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వందలాది మూగజీవాలు చనిపోయాయి. దీనంతటికీ ప్రధాన కారణం బుడమేరు. సహజంగా కృష్ణానది నుంచి విజయవాడకు వరదలు వస్తాయనుకుంటారు. కానీ ఈసారి బుడమేరు బెజవాడను ముంచేసింది. సింగ్ నగర్, రామకృష్ణాపురం, నందమూరి నగర్, నున్న, వన్ టౌన్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది.
తాజావార్తలు
-
Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
-
Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు
-
Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
-
Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!
-
CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!